ఈ రోజు విశేషం
1893 ఎక్సెల్సియర్ అనే పేరు గల వజ్రాన్ని (నీలం - తెలుగు రంగు 995 కేరట్స్ బరువు) కనుగొన్నారు.
తెలుగు నాట ఈ రోజు
- 1893 ఎక్సెల్సియర్ అనే పేరు గల వజ్రాన్ని (నీలం - తెలుగు రంగు 995 కేరట్స్ బరువు) కనుగొన్నారు.
సంఘటనలు
- 1914 మహాత్మా గాంధీ ని, దక్షిణ ఆఫ్రికా లో, భారత ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో మొదటిసారిగా అరెస్టు చేసారు. భారత్
- 1935 ఆస్టరాయిడ్#1784 (బెన్గెల్లా) ని సి.జాక్సన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
- 1936 మార్గరెట్ మిచెల్ వ్రాసిన నవల గాన్ విత్ ద విండ్ ముద్రించారు.
- 1936 'వారానికి నలభై గంటల పని విధానాన్ని' అమలు చేసే ఫెడరల్ చట్టాన్ని అమెరికాలో అమలు చేయడం జరిగింది.
- 1940 డాల్ మెస్సిక్ తయారు చేసిన బ్రెండా స్టార్ అనే కార్టూన్ స్ట్రిప్ మొదటిసారిగా కనిపించింది.
- 1948 రేడియోలో వాడే ట్యూబులకి బదులుగా ట్రాన్సిస్టర్స్ని వాడవచ్చునని బెల్ లాబరేటరీస్ ప్రకటించింది.
- 1960 జైరీ (పూర్వపు బెల్జియన్ కాంగో) అనే దేశం, బెల్జియం నుంచి స్వాతంత్ర్యం పొందింది. భారత్
- 1962 రువాండా, బురుండీ అనే రెండు దేశాలు స్వాతంత్ర్యం పొందాయి. భారత్
- 1971 రష్యన్ వ్యోమ నౌక సోయుజ్ రోదసి నుంచి తిరిగి భూమి మీదకు వస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యోమగాములు మరణించారు.
- 1996 1996 యూరోకప్ ఫుట్బాల్ ట్రోఫీని జర్మనీ జట్టు గెలిచింది.
జననాలు
- 19. : సుమంత్ అశ్విన్,చలనచిత్ర నటుడు.
- 1833 మండపాక పార్వతీశ్వర శాస్త్రి, సంస్కృతాంధ్ర కవి, పండితులు. (మ.1897). భారత్
- 1906 త్రిభువన్, నేపాల్ రాజు (మ. 1955).
- 1928 జె.వి. సోమయాజులు, రంగస్థల, సినిమా, బుల్లితెర నటుడు. (మ.2004).
- 1934 చింతామణి నాగేశ రామచంద్ర రావు, భారతీయ శాస్త్రవేత్త, భారతరత్న పురస్కార గ్రహీత. భారత్
- 1939 సుంకర వెంకట ఆదినారాయణరావు, పేరుపొందిన ఎముకల వైద్యనిపుణుడు.
- 1941 ఉప్పలపాటి సైదులు, పౌరాణిక రంగస్థల కళాకారుడు.
- 1948 తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు సినిమా నిర్మాత, దర్శకులు.
- 1969 సనత్ జయసూర్య, శ్రీలంక క్రికెట్ క్రీడాకారుడు.
- 1970 అరవింద్ స్వామి , చలనచిత్ర నటుడు, మోడల్, పారిశ్రామిక వేత్త.
- 1973 సితార , ప్రముఖ దక్షిణ భారత చిత్రాల నటి. భారత్
- 1977 శివాజీ , తెలుగు చలనచిత్ర నటుడు, వ్యాఖ్యాత.
- 1977 సురేఖ వాణి, తెలుగు,తమిళ చిత్రాల సహాయ నటి.
- 1978 ఇంద్రజ , తెలుగు, మళయాల చిత్రాల నటి, గాయని.
- 1982 అల్లరి నరేష్, సినిమా నటుడు, తెలుగు సినిమా దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ ద్వితీయ కుమారుడు.
మరణాలు
- 1897 మండపాక పార్వతీశ్వర శాస్త్రి, సంస్కృతాంధ్ర కవి, పండితులు. (జ.1833). భారత్
- 1917 దాదాభాయి నౌరోజీ, భారత జాతీయ నాయకుడు. (జ.1825). భారత్
- 1953 బలిజేపల్లి లక్ష్మీకాంతం, స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, నాటక రచయిత, రంగస్థల, సినిమా నటులు. (జ.1881). భారత్
- 1961 లీ డి ఫారెస్ట్, తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే 'ఫోనో ఫిల్మ్' ప్రక్రియను కనుగొన్న అమెరికన్ ఆవిష్కర్త. (జ.1873).
- 1967 వామన్ శ్రీనివాస్ కుడ్వ, సిండికేట్ బ్యాంకు వ్యవస్థాపకులలో ఒకరు. (జ.1899).
- 1984 రాయప్రోలు సుబ్బారావు, తెలుగు కవి. (జ.1892).
- 1985 కె.హెచ్. ఆరా, చిత్రకారుడు (జ. 1914).
- 1988 సుత్తి వీరభద్ర రావు, తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు, రేడియో, నాటక కళాకారుడు. (జ.1947).
- 2014 సూర్యకళ, పాతతరం తెలుగు చలన చిత్ర నటి, పలు దక్షిణాది భాషల్లో నటించిన నటి(జ.1942).
- 2019 నల్లగారి రామచంద్ర తెలుగు కథా రచయిత, కవి, నవల, నాటక రచయిత. (జ.1939).
సినిమా
- 1983 'గూడచారి నంబర్ 1' చిత్రం విడుదలైంది.
- 1984 'సీతమ్మ పెళ్ళి' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం (ఆస్టరాయిడ్ దినోత్సవం).
- ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం.
- అంతర్జాతీయ పార్లమెంటరీ దినోత్సవం. భారత్