ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

  • 1955 అన్నపూర్ణ పిక్చర్స్ తొలి చిత్రంగా కె.వి.రెడ్డి దర్శకత్వంలో దొంగరాముడు విడుదలై ఘనవిజయం సాధించింది. పూర్తి ప్రస్థానం →
  • 1998 చిరంజీవి రక్తదానం, నేత్రదానం లక్ష్యంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. పూర్తి ప్రస్థానం →
  • 2009 తుంగభద్ర నది ఉప్పొంగి కర్నూలు, మంత్రాలయం లతో సహా కర్నూలు, మహబూ నగర్ జిల్లాలలోని తుంగభద్ర తీరాన ఉన్న వందలాది గ్రామాలు నీటమునిగాయి.
  • 2019 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలను ప్రారంభించారు. పూర్తి ప్రస్థానం →
  • 2019 ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా విడుదలైంది. పూర్తి ప్రస్థానం →

సంఘటనలు

  • 1535 ఫ్రెంచ్ విశ్లేషకుడు జాక్యూస్ కార్టైర్ 1535 అక్టోబరు 2న హోచెలాగా (మాట్రియల్ చూడండి) ను సందర్శించాడు, హోచెలాగాలో నివాస ప్రజలు "వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ కాలం" నుండి ఉంటున్నట్లు అంచనా వేశాడు.
  • 1844 మద్రాసు ప్రెసిడెన్సీలోకెల్లా భారతీయుని యాజమాన్యంలో మొదటి పత్రిక క్రిసెంట్‌ను గాజుల లక్ష్మీనర్సు శెట్టి స్థాపించారు. భారత్
  • 1845 భారతదేశంలో మొదటి షిప్పింగ్ కంపెనీ ప్రారంభమైంది. భారత్
  • 1934 భారత నావికాదళం ( అప్పటి పేరు రాయల్ ఇండియన్ నేవీ) స్థాపించబడింది. భారత్
  • 1951 శ్యామ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్‌ను స్థాపించారు. భారత్
  • 1952 సంఘ ప్రెంపుదల కార్యక్రమం ప్రారంభమైంది.
  • 1954 ఫ్రెంచ్ ఆధీనంలో ఉన్న చందర్‌నగర్ పశ్చిమ బెంగాల్‌లో భాగంగా మారింది. భారత్
  • 1955 చెన్నై లోని పెరంబూరులో ఉన్న సమగ్ర రైలు పెట్టెల కర్మాగారము (ICF) తన పనులు మొదలుపెట్టింది. భారత్
  • 1961 బొంబాయిలో (నేటి ముంబై) షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. భారత్
  • 1966 భారతదేశం లోని 16 రైల్వే జోన్‌లలో ఒకటైన దక్షిణ మధ్య రైల్వే ఏర్పడింది. భారత్
  • 1971 అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి గాంధీ సదన్‌గా ఇప్పుడు మనకు తెలిసిన బిర్లా హౌస్‌ను దేశానికి అంకితం చేశారు . ఇక్కడే మహాత్మా గాంధీ హత్య జరిగింది. భారత్
  • 1972 భారతదేశపు మొట్టమొదటి టెలివిజన్ స్టేషన్ బొంబాయిలో మొదలయ్యింది. భారత్
  • 1985 వరకట్న నిషేధ సవరణ చట్టం అమలులోకి వచ్చింది.
  • 1988 సెప్టెంబర్ 17 నుంచి దక్షిణ కొరియాలోని సియోల్లో మొదలయిన 24వ ఒలింపిక్ క్రీడలు ముగిసాయి.
  • 1988 తమిళనాడులోని మండపం ఇంకా పంబన్ నడుమ సముద్రంపై పొడవైన వంతెన తెరవబడింది. భారత్
  • 1991 బీహార్ రాజధాని పాట్నా ఇంకా క్రొత్త ఢిల్లిల నడుమ శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ను మొదలుపెట్టారు. భారత్
  • 1992 ఒడిషా రాష్ట్రంలోని పట్టణం, మల్కనగిరి జిల్లా కేంద్రం. ఇది కొరాపుట్ జిల్లా నుండి వేరుచేయబడింది.
  • 1994 12వ ఆసియా క్రీడలు జపాన్ లోని హిరోషిమాలో ప్రారంభమయ్యాయి.
  • 2004 అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాలలో జరిగిన రెండు బాంబు ప్రేళుల్లలో 57 మంది ప్రజలు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. భారత్
  • 2006 అణు ఇంధన సరఫరా సమస్యపై భారత్‌కు మద్దతు ఇవ్వాలని దక్షిణాఫ్రికా నిర్ణయించింది. భారత్
  • 2008 భారత్-అమెరికా అణుఒప్పందానికి అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసింది. భారత్
  • 2012 తెదేపా అధినేత చంద్రబాబు చేసిన 'వస్తున్నా మీకోసం' 208 రోజుల పాదయాత్ర మొదలుపెట్టారు.
  • 2014 స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం మొదలయ్యింది. భారత్
  • 2016 భారతదేశంలో విద్య విధానాలమీద సంస్కరణల కోసం దేశంలో వున్నా స్వచ్ఛంద సంస్థలను, యువతను భాగస్వామ్యం చేస్తూ దేశంలో యువత ద్వారా సంస్కరణల స్థాపనే ఏకైక లక్ష్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో యూత్ పార్లమెంట్ ప్రోగ్రాం (వైపిపి) ఏర్పడింది. భారత్

జననాలు

  • 1852 విలియం రామ్సే, స్కాట్లాండుకు చెందిన రసాయన శాస్త్రవేత్త నోబెల్, బహుమతి గ్రహీత. (మ.1916).
  • 1869 మహాత్మా గాంధీ, భారత జాతిపిత. (మ.1948). భారత్
  • 1891 కోరాడ రామకృష్ణయ్య, భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు. (మ.1962).
  • 1900 అక్టోబర్ 2 లీలా రాయ్ జన్మించింది.
  • 1902 అన్నాప్రగడ కామేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు (జ.1987). భారత్
  • 1904 లాల్ బహాదుర్ శాస్త్రి, భారతదేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి. (మ.1966). భారత్
  • 1908 పర్వతనేని బ్రహ్మయ్య, ఛార్టర్డ్ అకౌంటెంట్. (మ.1980).
  • 1910 డి. అర్కసోమయాజి, ఆంధ్ర విద్యావేత్త.
  • 1911 అంబత్ మీనన్, కేరళ విద్యావేత్త. భారత్
  • 1911 జోస్యం జనార్దనశాస్త్రి, అభినవ వేమన బిరుదాంకితుడు, అష్టావధాని (మ.1997).
  • 1923 ఎం.శాంతప్ప, రాయలసీమకు చెందిన విద్యావేత్త, మాజీ వైస్‌ఛాన్స్‌లర్ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (మ.2017).
  • 1924 తపన్ సిన్హా, ప్రముఖ సినీ దర్శకుడు (మ. 2009).
  • 1926 నల్లా నరసింహులు, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు, సిపిఐ నాయకుడు. (మ. 1993).
  • 1928 ఎస్.వి.జోగారావు, సాహిత్యవేత్త. (మ.1992).
  • 1931 తాడూరి బాలాగౌడ్, భారత జాతీయ కాంగ్రేస్ నాయకుడు, నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం సభ్యుడు. (మ.2010).
  • 1935 ఎన్.నిత్యానంద్ భట్, చలనచిత్ర నిర్మాత.
  • 1942 ఆశా పరేఖ్, ప్రముఖ సినీ నటి.
  • 1943 కావూరు సాంబశివరావు, భారత పార్లమెంటు సభ్యుడు. భారత్
  • 1943 మినతీ సేన్, భారత 12, 13, 14 లోక్ సభ సభ్యుడు. భారత్
  • 1961 సోలిపేట రామలింగారెడ్డి, పాత్రికేయుడు, రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే (మ.2020).
  • 1974 రచనా బెనర్జీ, ఒరియా, బెంగాలీ, దక్షిణాది చిత్రాలనటీ.
  • 1974 Veldi Indira అక్టోబర్ 2 జన్మించింది.

మరణాలు

  • 1422 ఫిరుజ్ షా బహమనీ.
  • 1906 రాజా రవివర్మ, ప్రముఖ చిత్రకారుడు (జ. 1848).
  • 1961 శ్రీరంగం నారాయణబాబు, తెలుగు కవి. (జ.1906).
  • 1974 మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, గ్రంథ ప్రచురణకర్త. (జ.1900).
  • 1975 కుమారస్వామి కామరాజ్, తమిళనాడుకు చెందిన భారత రాజకీయనాయకుడు. భారత్
  • 1982 సి.డి.దేశ్‌ముఖ్, భారత ఆర్థికవేత్త, దుర్గాబాయి దేశ్‌ముఖ్ భర్త. (జ.1896). భారత్
  • 1992 హొన్నప్ప భాగవతార్, దక్షిణ భారత కర్ణాటక సంగీతకారుడు, నాటకరంగ ప్రముఖులు. (జ. 1915). భారత్
  • 2018 ఎం.వి.వి.ఎస్. మూర్తి, విశాఖపట్నం లోని గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు అమెరికా లోని అలాస్కాలో మరణం (జ. 1938 జూలై 3).

సినిమా

  • 1975 'తీర్పు (1975 సినిమా)' చిత్రం విడుదలైంది.
  • 2020 'ఒరేయ్ బుజ్జిగా' చిత్రం విడుదలైంది.

పండుగలు, జాతీయ దినాలు

  • గాంధీ జయంతి. (అంతర్జాతీయ అహింసా దినం, ). భారత్
  • లాల్ బహదూర్ శాస్త్రి జయంతి.
  • అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవం.
  • ప్రపంచ సాధు జంతువుల రోజు.
  • మానవ హక్కుల పరిరక్షణ దినం.
  • గ్రామ స్వరాజ్ డే.
  • ఖైదీల దినోత్సవం.
  • జాతీయ ఖాదీ దినోత్సవం.
  • దానోత్సవ వారం (జాయ్‌ ఆఫ్‌ గివింగ్‌) అక్టోబర్‌ 2 నుంచి 8వ తేదీ వరకు.
  • మాదకద్రవ్య వినిమయ వ్యతిరేక దినం.