ఈ రోజు విశేషం
2003 శ్రీజయ ఆర్ట్స్ సంస్థను హైదరాబాద్ లో ఇదేరోజున సినీ, టీవీ, రంగస్థల నటి, దర్శకురాలు, డాక్టర్ శ్రీజ సాధినేని గారు స్థాపించారు. ఈ సంస్థలో కళలపై ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇస్తూ నటులుగా తీర్చి దిద్దుతున్నారు. అలాగే శ్రీజయా ఆర్ట్స్ నాటక పరిషత్తు పేరిట అఖిల భారత స్థాయిలో నాటికల పోటీలను నిర్వహిస్తున్నారు.
తెలుగు నాట ఈ రోజు
- 1973 బహుముఖ ప్రజ్ఞాశాలి, పద్మశ్రీ గ్రహీత చిత్తూరు నాగయ్య మద్రాసులో కన్నుమూశారు. పూర్తి ప్రస్థానం →
- 1985 తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా విడిపోవడానికి గల కారణాలలో ముఖ్యమైనది జీ.వో.610ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం జారీచేసింది.
- 1985 ఆరు సూత్రాల పథకం ఉల్లంఘనలను సరిదిద్దేందుకు ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ప్రభుత్వం జీవో 610 జారీ చేసింది. పూర్తి ప్రస్థానం →
- 2003 శ్రీజయ ఆర్ట్స్ సంస్థను హైదరాబాద్ లో ఇదేరోజున సినీ, టీవీ, రంగస్థల నటి, దర్శకురాలు, డాక్టర్ శ్రీజ సాధినేని గారు స్థాపించారు. ఈ సంస్థలో కళలపై ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇస్తూ నటులుగా తీర్చి దిద్దుతున్నారు. అలాగే శ్రీజయా ఆర్ట్స్ నాటక పరిషత్తు పేరిట అఖిల భారత స్థాయిలో నాటికల పోటీలను నిర్వహిస్తున్నారు.
సంఘటనలు
- 1906 భారత్లో తమ ప్రయోజనాలు కాపాడుకోవడానికి జాతీయస్థాయిలో కాంగ్రెస్ లాంటి పార్టీ అవసరమని భావించిన ముస్లిం ప్రముఖులు ఢాకాలో సమావేశమై ముస్లిం లీగ్ పార్టీని స్థాపించారు. భారత్
- 1922 రష్యన్ సోవియట్ ఫెడరేషన్, ట్రాన్స్కకేషియన్, ఉక్రేనియన్, బెలారసియన్ సోవియట్ రిపబ్లిక్లు నాలుగూ కలిసి ద యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్గా ఏర్పడ్డాయి.
- 1968 ఐక్యరాజ్య సమితి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ట్రిగ్వేలీ మరణించాడు.
- 2006 ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దామ్ హుసేన్ ను ఉరితీసారు.
- 2008 హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రేమ్ కుమార్ ధుమాల్ ప్రమాణస్వీకారం.
- 2009 జార్ఖండ్ ముఖ్యమంత్రిగా శిబూసోరెన్ ప్రమాణస్వీకారం చేశాడు.
- 2024 అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికత ప్రదర్శన కోసం ఇస్రో రెండు చిన్న ఉపగ్రహాలతో స్పేడెక్స్ యాత్రను విజయవంతంగా ప్రయోగించింది. భారత్ పూర్తి ప్రస్థానం →
జననాలు
- 1865 రుడ్యార్డ్ కిప్లింగ్, ఆంగ్ల రచయిత, కవి. (మ.1936).
- 1879 రమణ మహర్షి, బోధనలలో ప్రధానమైనది "మౌనము" లేదా "మౌనముద్ర". వీరు చాలా తక్కువగా ప్రసంగించేవారు.
- 1887 కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకటరమణ కవి, అవధానంలో పేరొందిన జంట సోదర కవులు.
- 1898 యలమంచిలి వెంకటప్పయ్య, స్వాతంత్ర్య సమర యోధుడు. కాకినాడలో 1920 లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలలో బ్రాహ్మణులకు ప్రత్యేక భోజన శాల ఉండటానికి వీల్లేదని అందరూ కలిసే తినాలనీ తీర్మానం చేయించాడు,.
- 1935 మాన్యువెల్ ఆరన్ భారతదేశపు చదరంగం ఆటగాడు. భారత్
- 1944 అంజనా భౌమిక్, బెంగాలీ సినిమానటి.(మ.2024).
- 1946 మాక్సిన్ శాండర్స్.
- 1948 సురీందర్ అమర్నాథ్ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఎడమచేతి బ్యాట్స్మెన్. భారత్
- 1968 సబీర్ భాటియా హాట్ మెయిల్ ఈమెయిల్ సర్వీసు సహ-వ్యవస్థాపకుడు.
- 1984 లెబ్రాన్ జేమ్స్ అమెరికన్ బాస్కెట్బాల్ క్రీడాకారుడు.
మరణాలు
- 1955 వేమూరి గగ్గయ్య, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (జ.1895).
- 1971 విక్రం సారాభాయ్, శాస్త్రవేత్త.
- 1973 చిత్తూరు నాగయ్య, తెలుగు సినిమా నటుడు.(జ.1904).
- 1992 వడ్డాది పాపయ్య, చిత్రకారుడు.
- 2006 పేకేటి శివరాం, తెలుగు సినిమా నటుడు. (జ.1918).
- 2009 విష్ణువర్ధన్, దక్షిణ భారత చలన చిత్రాలతో పాటు హిందీ చిత్రాల్లో సహాయ పాత్రల నటుడు.(జ.1950). భారత్
సినిమా
- 2016 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రం విడుదలైంది.
- 2016 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' చిత్రం విడుదలైంది.