ఈ రోజు విశేషం
2012 ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి నొజోమి ఒకుహారాను ఓడించి పి.వి. సింధు ఆసియా జూనియర్ ఛాంపియన్గా నిలిచిన తొలి భారతీయురాలైంది.
తెలుగు నాట ఈ రోజు
- 2012 ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి నొజోమి ఒకుహారాను ఓడించి పి.వి. సింధు ఆసియా జూనియర్ ఛాంపియన్గా నిలిచిన తొలి భారతీయురాలైంది. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1890 అమెరికాలో మొట్టమొదటిసారిగా ఎలెక్ట్రిక్ కుర్చీని వాడారు.
- 1896 భారతదేశంలో మొట్టమొదటిసారిగా బొంబాయిలో లుమేరీ సోదరులు చలనచిత్రాన్ని ప్రదర్శించారు. భారత్
- 1929 వాటికన్ సిటీ ని, క్రైస్తవ మతాధిపతి (పోప్) కోసం ఏర్పాటు చేసారు.
- 1939 గాంధేయవాది ఎ. వైద్యనాథా అయ్యర్ హరిజనులకి మదురై మీనాక్షి గుడిలో ప్రవేశం ఇప్పించారు.
- 1941 అమెరికన్ సైన్యం ఐస్ లాండ్ వచ్చింది.
- 1985 బోరిస్ బెకర్ అతి చిన్నవయసులో తన 17వ ఏట వింబుల్డన్ (టెన్నిస్) లో గెలిచాడు.
- 1985 రాబర్ట్ ముగాబే కొత్తగా ఏర్వడిన జింబాబ్వే అధ్యక్షుడు అయ్యాడు.
- 2005 లండనులో వరుస బాంబు పేలుళ్ళు 30మంది మరణం, 700మంది గాయాలపాలు.
- 2015 రామ్ చరణ్ ప్రమోటర్గా ఉన్న ట్రూజెట్ విమానయాన సంస్థకు ప్రాంతీయ సర్వీసుల కోసం ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ లభించింది. భారత్ పూర్తి ప్రస్థానం →
- 2017 శ్రీదేవి నటించిన 300వ చిత్రం 'మామ్' విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. భారత్ పూర్తి ప్రస్థానం →
జననాలు
- 1900 కళా వెంకటరావు, స్వాంతంత్ర్య యోధుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి. (మ.1959).
- 1901 విట్టొరియో డి సికా, ఇటాలియన్ దర్శకుడు, నటుడు. (మ.1974).
- 1908 కొమ్మూరి పద్మావతీదేవి, తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి. (మ. 1970).
- 1915 యూల్ బ్రిన్నర్, అమెరికన్ సినీ నటుడు.
- 1916 మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, నటుడు, రచయిత. (మ.2009).
- 1920 మద్దిపట్ల సూరి, రచయిత, అనువాదకుడు, సాహితీవేత్త. (మ.1995).
- 1922 పియరీ కార్డిన్, ఫ్రెంచి ఫేషన్ డిజైనర్.
- 1942 పి.వేణుగోపాల్, హృద్రోగ శస్త్రచికిత్స వైద్యంలో నిపుణులు.
- 1947 ఎ.మోహన్ గాంధీ , తెలుగు ,తమిళ, కన్నడ, చిత్రాల దర్శకుడు.
- 1947 జ్ఞానేంద్ర, నేపాల్ రాజు.
- 1956 చౌలపల్లి ప్రతాపరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు.
- 1959 జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు , తెలుగు కవి, సినీ గీత రచయిత.
- 1962 ఇందిర భైరి, గజల్ కవయిత్రి, ఉపాధ్యాయిని (మ. 2023).
- 1973 కైలాష్ ఖేర్ , సినీ, జానపద గాయకుడు.
- 1981 మహేంద్రసింగ్ ధోని, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు. భారత్
మరణాలు
- 1816 రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్, ఐర్లాండ్ దేశానికి చెందిన ఆంగ్ల కవి, నాటక రచయిత (జ. 1751).
- 2008 వాడపల్లి వెంకటేశ్వరరావు, దౌత్యవేత్త, కీర్తిచక్ర పొందిన మొట్టమొదటి సైనికేతర పౌరుడు. (జ.1963).
- 2022 పులపర్తి నారాయణ మూర్తి, రాజకీయ నాయకుడు.మాజీ ఎమ్మెల్యే. (జ.1954).
- 2022 గోరంట్ల రాజేంద్రప్రసాద్, తెలుగు సినిమా నిర్మాత.
సినిమా
- 1966 'సంగీత లక్ష్మి' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- ప్రపంచ చాక్లెట్ దినోత్సవం.
- గ్లోబల్ క్షమాపణ దినోత్సవం.
- ప్రపంచ కిస్వాహిలి భాషా దినోత్సవం.