జనవరి 18 గజ్వేల్ (మెదక్ జిల్లా), భూపాలపల్లి (వరంగల్ జిల్లా) మేజర్ గ్రామపంచాయతీలను పురపాలక సంఘంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
జనవరి 19 మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి కిషన్ రెడ్డి పోరుయాత్ర మొదలైంది.
మార్చి 17 మహబూబ్ నగర్ జిల్లా అందుగులలో రాతియుగం నాటి పనిముట్లు బయటపడ్డాయి.
మార్చి 18 సైనా నెహ్వాల్ స్విస్ ఓపెన్ టైటిల్ను విజయవంతంగా నిలబెట్టుకున్నారు.
మార్చి 29 నటుడు చిరంజీవి రాజ్యసభ సభ్యత్వానికి నామినేట్ అయ్యారు.
ఏప్రిల్ 5 సంపత్ నంది దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన రచ్చ చిత్రం విడుదలై వాణిజ్య విజయం సాధించింది.
ఏప్రిల్ 23 మావోయిస్టులు ఒడిశా లోని లక్ష్మీపూర్ శాసనసభ్యుడు జిన్నూ హిక్కాకను అపహరించారు.
భారత్
ఏప్రిల్ 26 హైదరాబాదులో మెట్రోరైలు పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
మే 12 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయొజెనిక్ ఇంజిన్ ప్రయోగం సఫలమైంది. దీనిని, ఉపగ్రహ ప్రయోగ వాహకం జి.ఎస్.ఎల్.వి-డి5 లో బిగించుతారు. భారతదేశం, అమెరికాను ఈ ఇంజిన్లు అడిగినప్పుడు భారత దేశానికి ఇవ్వకుండగా, భారత దేశానికి అనేకమైన అడ్డంకులను కల్పించింది.
భారత్
మే 13 స్టార్ ప్లస్ కార్యక్రమం 'సత్యమేవ్ జయతే'లో శ్రీదేవి పాల్గొన్నారు.
భారత్
మే 14 డాలరుతో రూపాయి మారకం విలువ అతి తక్కువగా రూ 53.96 కి పడిపోయింది. 2012 మే 18 నాడు, రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే 54.91 స్థాయికి పడిపోయింది. రూపాయి – డాలరు మారకం విలువ చరిత్రలో, ఇది, అత్యంత తక్కువ స్థాయి.
మే 15 టెలికాం మంత్రి ఎ. రాజాకు 2012 మే 15 నాడు 2జి ట్రయల్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. టెలికాం మంత్రి ఎ. రాజాను 2011 ఫిబ్రవరి 2 నాడు, 2జి స్పెక్త్రుం కేసులో అరెస్టు చేసి తీహారు జైలులో ఉంచారు.
మే 18 అమెరికాకు చెందిన నాస్ డాక్ స్టాక్ ఎక్స్చేంజీలో, ఫేస్ బుక్ (సోషల్ నెట్ వర్క్ సంస్థ) 2012 మే 18 నాడు నమోదు అయింది.
మే 18 రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే 54.90 స్థాయికి పడిపోయింది. రూపాయి – డాలరు మారకం విలువ చరిత్రలో, ఇది, అత్యంత తక్కువ స్థాయి.
మే 20 గుంటూరు జిల్లాలోని, రెంటచింతలలో 47 డిగ్రీల సెంటిగ్రేడ్ (116.6 డిగ్రీల ఫారెన్ హీట్ ) వేడి.
మే 20 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే 2012 సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష 2012 మే 20 ఆదివారం జరిగింది. హైదరాబాద్, విశాఖపట్నం,తిరుపతి నగరాల్లోని 101 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. 48,178 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావచ్చును. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు మొదటి పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు రెండో పరీక్ష జరిగింది.
మే 27 అక్రమాస్తుల ఆరోపణలపై జగన్మోహన్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది.
జూన్ 7 మహేశ్ భూపతితో జతగా సానియా మీర్జా ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకుంది.
జూన్ 10 సైనా నెహ్వాల్ రత్చనోక్ ఇంతనోన్ను ఓడించి థాయ్లాండ్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నారు.
జూన్ 14 హైదరాబాద్లోని టెంపుల్ ట్రీస్ ఫామ్ హౌస్లో రామ్ చరణ్ ఉపాసన కామినేనిని వివాహం చేసుకున్నారు.
జూన్ 17 రామప్ప ఆలయం పరిరక్షణకు 10వేల దివ్వెల జాతర నిర్వహించారు.
జూన్ 17 సైనా నెహ్వాల్ వరుసగా మూడోసారి ఇండోనేషియా ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నారు.
జూన్ 26 లండన్ ఒలింపిక్స్ మహిళల డబుల్స్లో సానియా మీర్జాకు వైల్డ్ కార్డ్ ప్రవేశం లభించి భారత ప్రాతినిధ్యం ఖరారైంది.
జూలై 7 ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి నొజోమి ఒకుహారాను ఓడించి పి.వి. సింధు ఆసియా జూనియర్ ఛాంపియన్గా నిలిచిన తొలి భారతీయురాలైంది.
జూలై 13 రామ్ చరణ్ నటించిన రచ్చ చిత్రం ఆంధ్రప్రదేశ్లోని 38 కేంద్రాల్లో 100 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది.
జూలై 20 మహేష్ బాబు, నమ్రత దంపతులకు కుమార్తె సితార జన్మించింది.
ఆగస్టు 4 లండన్ ఒలింపిక్స్లో సైనా నెహ్వాల్ కాంస్యం గెలిచి ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించారు.
భారత్
ఆగస్టు 18 హైదరాబాదీ క్రికెటర్ వి.వి.యస్. లక్ష్మణ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు.
ఆగస్టు 27 చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా (స్వతంత్ర హోదా) బాధ్యతలు చేపట్టారు.
భారత్
సెప్టెంబరు 2 నిర్మల్లో తెలంగాణ రచయితల సంఘం 6వ మహాసభలు నిర్వహించబడ్డాయి.
సెప్టెంబరు 7 రామోజీరావు చిన్న కుమారుడు చెరుకూరి సుమన్ ల్యుకేమియాతో మరణించారు.
సెప్టెంబరు 12 పుడమి నేషనల్ బ్లడ్ ఫౌండేషన్, పుడమి ఎడ్యుకేషన్ ఫౌండేషన్ స్థాపించిన రోజు.
సెప్టెంబరు 21 గురజాడ అప్పారావు 150వ జయంతి సందర్భంగా ఆయన సమగ్ర రచనల సంపుటం 'గురుజాడలు' తొలి ముద్రణ వెలువడింది.
సెప్టెంబరు 21 అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకింగ్స్లో తొలి 20 స్థానాల్లో చోటు దక్కించుకుని పి.వి. సింధు తొలిసారి అంతర్జాతీయ గుర్తింపు పొందింది.
సెప్టెంబరు 28 తెలుగు అకాడమీ జాషువా పరిశోధనా కేంద్రం 'జాషువా విశిష్ట సాహిత్య పురస్కారా'న్ని కవి ఎండ్లూరి సుధాకర్కు బహూకరించింది.
సెప్టెంబరు 30 హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో తెలంగాణా మార్చి (కవాతు) జరిగింది.
సెప్టెంబరు 30 తెలంగాణ సాధన కోసం హైదరాబాదు నెక్లెస్ రోడ్డుపై తెలంగాణ మార్చ్ జరిగింది; సుమారు రెండు లక్షల మంది ఉద్యమకారులు పాల్గొన్నారు.
అక్టోబరు 2 తెదేపా అధినేత చంద్రబాబు చేసిన 'వస్తున్నా మీకోసం' 208 రోజుల పాదయాత్ర మొదలుపెట్టారు.
అక్టోబరు 21 సైనా నెహ్వాల్ జూలియన్ షెంక్ను ఓడించి డెన్మార్క్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నారు.
నవంబరు 8 మహమ్మద్ అజారుద్దీన్పై విధించిన జీవితకాల క్రికెట్ నిషేధాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎత్తివేసింది.
డిసెంబరు 27 ; తిరుపతిలో నాలుగవ ప్రపంచ తెలుగు మహా సభలు ఘనంగా ప్రారంభమైనవి నేటి నుండి మూడు రోజుల పాటు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ అధ్యక్షతన జరిగినవి.
జననాలు
ఏప్రిల్ 18 కందిక వర్షిత్, నెక్కొండ(గ్రామం&మండలం), వరంగల్ రూరల్, తెలంగాణ.
మరణాలు
జనవరి 11 వీరమాచనేని మధుసూదనరావు, తెలుగు సినిమా దర్శకులు, ఫిలిం ఇన్ స్టిట్యూట్ స్థాపించి ఎందరో నటుల్ని తీర్చిదిద్దారు (జ.1923).
జనవరి 15 హొమాయ్ వ్యరవాలా, భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫోటోజర్నలిస్టు. పద్మవిభూషణ పురస్కార గ్రహీత. (జ.1913).
భారత్
ఫిబ్రవరి 1 విస్లావా సింబోర్స్కా, కవయిత్రి, అనువాదకురాలు. నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1923).
ఫిబ్రవరి 2 అట్లూరి పుండరీకాక్షయ్య, తెలుగు సినిమా నిర్మాత, రచయిత, నటుడు. (జ.1925).
ఫిబ్రవరి 3 స్టీవ్ అపిల్టన్, మైక్రాన్ టెక్నాజీ సిఇవో. (జ.1960).
ఫిబ్రవరి 9 సుసర్ల దక్షిణామూర్తి , గాయకుడు,సంగీత దర్శకుడు (జ.1921).
మార్చి 8 రాధాకుమారి , తెలుగు సినిమా, సీరియల్, నటి.డబ్బింగ్ కళాకారిణి.
ఏప్రిల్ 1 ఎన్.కె.పి.సాల్వే, భారత రాజకీయవేత్త. (జ. 1921).
భారత్
ఏప్రిల్ 17 నిత్యానంద మహాపాత్రా, భారత రాజకీయవేత్త, కవి, జర్నలిస్టు (జ. 1912).
భారత్
జూన్ 8 కె.ఎస్.ఆర్.దాస్, తెలుగు, కన్నడ సినిమా దర్శకుడు. (జ.1936).
జూన్ 9 పాలపర్తి వెంకటేశ్వర్లు, ఆదిలాబాదు జిల్లా కలెక్టరుగా పనిచేశాడు.
జూన్ 20 బాలు శంకరన్,ప్రొఫెసర్, శాస్త్రవేత్త , పద్మశ్రీ పద్మవిభూషణ్ అవార్డుల గ్రహీత. (జ.1926).
జూలై 12 దారా సింగ్, భారతీయ మల్లయోధుడు, సినిమా నటుడు. (జ.1928).
భారత్
జూలై 18 రాజేష్ ఖన్నా, హిందీ సినిమా నటుడు, నిర్మాత, రాజకీయవేత్త. (జ.1942).
భారత్
జూలై 26 కొండపల్లి శేషగిరి రావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. (జ.1924).
జూలై 29 వెంపటి చినసత్యం, కూచిపూడి నాట్యాచార్యుడు (జ.1929).
ఆగస్టు 7 సామల సదాశివ, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాహితీవేత్త. (జ.1928).
ఆగస్టు 11 భద్రిరాజు కృష్ణమూర్తి, ద్రావిడ భాషా పరిశోధకుడు, భాషాశాస్త్ర అధ్యాపకుడు (జ.1928).
ఆగస్టు 14 విలాస్రావు దేశ్ముఖ్, భారత రాజకీయవేత్త. (జ.1945).
భారత్
ఆగస్టు 16 టీ.జి. కమలాదేవి, తెలుగు సినిమా నటి, స్నూకర్ క్రీడాకారిణి. (జ.1930).
ఆగస్టు 20 కాపు రాజయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. (జ.1925).
ఆగస్టు 25 నీల్ ఆర్మ్స్ట్రాంగ్, చంద్రుడిపై కాలు పెట్టిన మొదటి మనిషి. (జ.1930).
సెప్టెంబరు 6 చెరుకూరి సుమన్, బుల్లితెర రచయిత, నటుడు, దర్శకుడు, చిత్రలేఖకుడు, సినీ నటుడు. (జ.1966).
సెప్టెంబరు 8 కొడవటిగంటి రోహిణీప్రసాద్, సంగీతజ్ఞుడు, శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. (జ.1949).
సెప్టెంబరు 13 రంగనాథ్ మిశ్రా, 21వ భారత ప్రధాన న్యాయమూర్తి. (జ.1926).
భారత్
సెప్టెంబరు 16 సుత్తివేలు, తెలుగు హాస్య నటులు. (జ.1947).
సెప్టెంబరు 21 కొండా లక్ష్మణ్ బాపూజీ, నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకుడు. (జ.1915).