ఈ రోజు విశేషం
1945 వరంగల్లు జిల్లా బైరాన్పల్లి పై, పోలీసులు, మిలటరీ సాయంతో, భువనగిరి డిప్యూటీ కలెక్టరు ఇక్బాల్ హుస్సేన్ నాయకత్వంలో 500 మందికి పైగా రజాకార్లు దాడి చేసారు. హైదరాబాద్ సంస్థానం మిలిటరీ 84 మందిని నిలబెట్టి కాల్చి చంపింది. ప్రక్కనే ఉన్న కూటికల్లు గ్రామంపై కూడా దాడి చేసారు.
తెలుగు నాట ఈ రోజు
- 1945 వరంగల్లు జిల్లా బైరాన్పల్లి పై, పోలీసులు, మిలటరీ సాయంతో, భువనగిరి డిప్యూటీ కలెక్టరు ఇక్బాల్ హుస్సేన్ నాయకత్వంలో 500 మందికి పైగా రజాకార్లు దాడి చేసారు. హైదరాబాద్ సంస్థానం మిలిటరీ 84 మందిని నిలబెట్టి కాల్చి చంపింది. ప్రక్కనే ఉన్న కూటికల్లు గ్రామంపై కూడా దాడి చేసారు.
- 1953 గోల్కొండ పత్రిక వ్యవస్థాపకుడు, 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర' రచయిత సురవరం ప్రతాపరెడ్డి దివంగతులయ్యారు. పూర్తి ప్రస్థానం →
- 2007 హైదరాబాద్లో లుంబినీ పార్క్, కోఠి (గోకుల్ ఛాట్) బాంబు పేలుళ్ళ వల్ల 42 మందికి పైగా మృతిచెందారు.
సంఘటనలు
- ఉరుగ్వే జాతీయదినోత్సవం.
- 1960 17వ వేసవి ఒలింపిక్ క్రీడలు రోంలో ప్రారంభమయ్యాయి.
- 2003 బొంబాయి నగరములో కారు బాంబులు పేలి విధ్వంసం సృష్టించబడింది. భారత్
జననాలు
- 1694 థియోడోర్ వాన్ న్యుహాఫ్ జర్మన్ సాహసికుడు. కింగ్ ఆఫ్ కోర్సికాగా ప్రసిద్ధుడు. (మ.1756).
- 1724 జార్జ్ స్టబ్స్, ఇంగ్లాండుకు చెందిన చిత్రకారుడు. (మ.1806).
- 1865 రాయచోటి గిరిరావు, సంఘ సేవకులు, విద్యావేత్త. (మ.1918).
- 1893 కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్, హైదరాబాదు మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు, విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశీలి. (మ.1967).
- 1917 దేవులపల్లి రామానుజరావు, రచయిత.
- 1920 ఏల్చూరి సుబ్రహ్మణ్యం , కవి,రచయిత,పాత్రికేయుడు.
- 1926 మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము, కవి, రచయిత, చిత్రకారుడు. (మ.2010).
- 1938 చిత్తరంజన్ , లలిత గీతాల రచయిత , గాయకుడు, సంగీత దర్శకుడు .(మ.2023).
- 1952 దులీప్ మెండిస్, శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- 1952 విజయ కాంత్ , తమిళ సినిమా నాయకుడు, రాజకీయ నాయకుడు(మ.2023). భారత్
- 1955 సోమరాజు సదారాం, తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్.
- 1961 బిల్లీ రే సైరస్, అమెరికా సంగీత గాయకుడు, గీత రచయిత, నటుడు.
- 1962 తస్లీమా నస్రీన్, బెంగాలీ రచయిత్రి.
- 1973 నిత్యశ్రీ మహదేవన్, కర్ణాటకసంగీత విద్వాంసురాలు, ప్లే బ్యాక్ సింగర్. భారత్
- 1984 హేమల్ రణసింఘే, శ్రీలంక చలనచిత్ర నటుడు.
- 1987 బ్లెక్ లైవ్లీ, అమెరికా టీ.వీ., సినిమా నటి.
- 1987 మోనికా , దక్షిణ భారత చలన చిత్ర నటి. భారత్
మరణాలు
- 1822 విలియం హెర్షెల్, వరుణ (యురేనస్) గ్రహాన్ని కనుగొన్న ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త. (జ.1738).
- 1867 మైకేల్ ఫెరడే, ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త. (జ.1791).
- 1908 హెన్రీ బెక్వెరెల్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- 1953 సురవరం ప్రతాపరెడ్డి, పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు. (జ.1896).
- 1960 చింతా దీక్షితులు, రచయిత. (జ.1891).
- 1969 మఖ్దూం మొహియుద్దీన్, కార్మిక నాయకుడు, ఉర్దూకవి. (జ.1908).
- 1999 సూర్యదేవర సంజీవదేవ్, తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. (జ.1924).
- 2012 నీల్ ఆర్మ్స్ట్రాంగ్, చంద్రుడిపై కాలు పెట్టిన మొదటి మనిషి. (జ.1930).
- 2015 పటోళ్ల కృష్ణారెడ్డి, ఆంధ్రపదేశ్ శాసన సభలో నాలుగు పర్యాయాలు నారాయణఖేడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ నేత.
సినిమా
- 1966 'శ్రీకృష్ణ తులాభారం' చిత్రం విడుదలైంది.
- 1976 'బంగారు మనిషి' చిత్రం విడుదలైంది.
- 2017 'అర్జున్ రెడ్డి' చిత్రం విడుదలైంది.
- 2022 'లైగర్' చిత్రం విడుదలైంది.