ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 6 తెలంగాణ అంశంపై 505 పేజీల శ్రీకృష్ణ కమిటీ నివేదికను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది; విభజన రెండో ఉత్తమ ప్రత్యామ్నాయమని పేర్కొంది. భారత్
  • జనవరి 20 భారత దేశము : ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మొబైల్ నంబర్ పొర్టబులిటీ (Mobile Number Portability) సర్వీసుని ప్రారంభించారు. భారత్
  • ఫిబ్రవరి 2 టెలికాం మంత్రి ఎ. రాజాను 2011 ఫిబ్రవరి 2 నాడు, 2జి స్పెక్త్రుం కేసులో అరెస్టు చేసి తీహారు జైలులో ఉంచారు. 2012 మే 15 నాడు 2జి ట్రయల్ కోర్టు బెయిలు మంజూరు చేసింది.
  • ఫిబ్రవరి 6 చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది.
  • ఫిబ్రవరి 12 2011 ఫిబ్రవరి 22 స్వామి దయానంద సరస్వతి జయంతి (రోమన్ కాలమానం ప్రకారం 1824 ఫిబ్రవరి 12 మరణం 1883 అక్టోబరు 31).
  • ఫిబ్రవరి 17 తెలంగాణ సాధన కోసం మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యంతో 16 రోజుల సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైంది.
  • ఫిబ్రవరి 24 శ్రీరామరాజ్యం రచన పూర్తి చేసిన వెంటనే ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ చెన్నైలో కన్నుమూశారు.
  • మార్చి 2 శివరాత్రి ; కోటిపల్లి తీర్థం.
  • మార్చి 6 నటుడు అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల వివాహం హైదరాబాద్‌లో జరిగింది.
  • మార్చి 7 యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
  • మార్చి 10 శ్రీకంఠ జయంతి.
  • మార్చి 10 తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాదు ట్యాంక్ బండ్ వద్ద మిలియన్ మార్చి జరిగింది; ఆంక్షలు దాటి సుమారు 50 వేల మంది చేరుకున్నారు.
  • మార్చి 31 2011 మార్చి 31 నాటికి భారతదేశంలో మొత్తం 8,40,130 మంది వైద్యులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, లోక్ సభలో కేంద్ర ఆరోగ్యమంత్రి 2012 మే 18 నాడు చెప్పారు. భారత్
  • ఏప్రిల్ 9 అన్నా హజారేకు అవినీతి పై వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు గానూ ఐ.ఐ.పి.ఎం రవీంధ్రనాథ్ ఠాగూర్ అంతర రాష్ట్రీయ శాంతి పురస్కారంగా ఒక కోటి రూపాయలు యిచ్చుటకు ప్రకటించారు.
  • ఏప్రిల్ 25 2011 ఏప్రిల్ 1 నుంచి 2011 ఏప్రిల్ 25 వరకు భారతదేశంలో, వెండి ధర 75,770 రూపాయలకు చేరి, రికార్డు స్థాపించింది. (1 ఏప్రిల్ నుంచి 2011 ఏప్రిల్ 25 వరకు ఉన్న 25 రోజులలో వెండి 31% ఎక్కువ పెరిగింది). ఈ నెలంతా, బంగారం, వెండ్ వ్యాపారులు వెండిని సరఫరా చేయలేక, ముందుగా కొంత డబ్బు కట్టించుకుని, వారం రోజుల తరువాత వెండిని ఇచ్చేవారు. భారత్
  • మే 5 జూనియర్ ఎన్.టి.ఆర్, లక్ష్మీ ప్రణతిల వివాహం హైదరాబాద్‌లో జరిగింది.
  • మే 10 పరువు హత్యలలో (పరువు, మర్యాద లేదని, అవి హత్యలేనని) భారతదేశపు న్యాయ స్థానం వెల్లడించింది. (తమ పరువు పోతుందని, తమ ఇంటిలోని ఆడవారిని హత్యలు చేయటమె పరువు హత్య). భారత్
  • మే 13 మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్) పశ్చిమ బెంగాల్ లో, 34 ఏళ్ళ కమ్యూనిస్ట్ పాలనను, తుడిచి వేసింది. భారత్
  • మే 18 స్పేస్ షటిల్ ఎండీవర్ ఆఖరి సారిగా ‍ (చివరి ప్రయాణం) రోదసీలోకి వెళ్ళింది.
  • మే 20 పశ్చిమ బెంగాల్‌లో 34ఏళ్ళ సుదీర్ఘ కమ్యూనిస్టు పాలనకు చరమగీతం పాడి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయింది. భారత్
  • ఆగస్టు 12 విశాఖపట్నం బార్ అసోసియేషన్ కి 2011-12 సంవత్సరానికి, శుక్రవారం ఎన్నికలు జరిగాయి. 2788 ఓటర్లు ఉండగా 1791 మంది ఓట్లు వేసారు. 997మంది ఓట్లు వేయలేదు.
  • ఆగస్టు 13 రాఖీ పండుగ; జంధ్యాల పౌర్ణమి; శ్రావణ పౌర్ణమి; సింహాచలం అప్పన్నకు కరాళచందనం సమర్పించే రోజు.
  • ఆగస్టు 18 నేడు, లోక్‌సభ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (సవరణ) బిల్లు 2011ని ఆమోదించింది. దేశంలో, మరింత మెరుగైన వైద్య సౌకర్యాలను కల్పించటం, ఈ బిల్లు ఉద్దేశం. అలాగే, గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే వైద్యులను ప్రోత్సహించటానికి, కావలసిన చర్యలు కూడా తీసుకున్నారు. ప్రైవేటు రంగంలో, వైద్యకళాశాలలు స్థాపించే వారికి, మరిన్ని సౌకర్యాలు, వెసులుబాట్లు కల్పించారు. రాబోయే, 5 ఏళ్ళలో, వైద్య విద్యార్థుల కోసం 15, 000 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను పెంచుతారు. భారత్
  • ఆగస్టు 18 జిప్మెర్, పుదుచ్చెర్రీ చట్టము 2008కి సవరణగా, ప్రతిపాదించిన, జిప్మెర్ (జవహర్ లాల్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‍గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్), పుదుచ్చెర్రీ (సవరణ) బిల్లు 2011 ని, లోక్‍సభ ఆమోదించింది.
  • ఆగస్టు 18 రాజ్యసభ, కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్ర సేన్ పై అభిశంసన తీర్మానాన్ని ఆమోదించి, అతనిని పదవినుంచి తొలగించమని కోరింది. 1990లో న్యాయవాదిగా ఉండగా 24 లక్షల రూపాయల దుర్వినియోగం చేసాడని నేరారోపణ. భారత్
  • ఆగస్టు 18 పాఠశాల విద్యార్థులకు ఇచ్చే, నేషనల్ కేడెట్ కోర్ (ఎన్.సి.సి) శిక్షణ కోసం, 2010 సంవత్సరంలో, 707 కోట్లు ఖర్చుపెట్టగా, 79 మంది కేడెట్లు మాత్రమే సైనిక దళాలలో చేరారు.
  • ఆగస్టు 18 సాధారణ వర్గానికి (జనరల్ కేటగిరి), సూచించబడినటువంటి, కనీస అర్హత మార్కులలో, 10 శాతం కంటే తక్కువ మార్కులు, పొందకపోతే, ఒ.బి.సి విద్యార్థులు 27 శాతంరిజర్వేషన్లు కోటా కింద ప్రవేశానికి అర్హులు అని సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది.
  • ఆగస్టు 19 ప్రణాళికా సంఘం, ఏప్రిల్ 2012 నుంచి మొదలయ్యే, 12వ పంచవర్షప్రణాళిక లక్ష్యము 9 శాతం అభివృద్ధిగా పెట్టుకున్నట్లు ప్రణాళికా సంఘం ఉపాద్యక్షుడు ప్రకటించాడు. వ్యవసాయం అభివృద్ధి లక్ష్యం 4 శాతం అని చెప్పాడు. 11వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయరంగం లక్ష్యం 4 శాతమైనా, ఆ లక్ష్యాన్ని చేరలేకపోయామని, అయినా, వ్యవసాయరంగం మెరుగు గానే ఉంది అని చెప్పాడు.
  • ఆగస్టు 19 దేశీయ పరిఙ్ఞానంతో తయారైన స్టెల్త్ (శత్రువుల రాడార్కు ఆచూకీ దొరకని) యుద్ధనౌక ఐ.ఎన్‌.ఎస్. సాత్పుర శనివారం, భారత నౌకాదళంలో చేరింది. శివాలిక్ తరగతి కింద నిర్మిస్తున్న ఫ్రిగేట్ యుద్ధనౌకల్లో సాత్పుర రెండవది. ఐ.ఎన్.ఎస్.శివాలిక్ మొదటి యుద్ధనౌక. చూడు. భారత్
  • సెప్టెంబరు 13 తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, సింగరేణి కార్మికుల భాగస్వామ్యంతో సకల జనుల సమ్మె ప్రారంభమైంది.
  • సెప్టెంబరు 29 దళితులపై అఘాయిత్యాలకు పాల్పడిన 269 మంది అధికారులను, వారిలో అత్యాచార‌ ఆరోపణ రుజువయ్యిన 17 మందిని వాచ్చాతి కేసులో‌ ధర్మపురి జిల్లా సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది.
  • అక్టోబరు 24 తెలంగాణ సాధన కోసం 42 రోజుల పాటు సాగిన చరిత్రాత్మక సకల జనుల సమ్మె ముగిసింది.
  • నవంబరు 28 బాపు దర్శకత్వం వహించిన శ్రీరామరాజ్యం చిత్రానికి భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రత్యేక ప్రదర్శన జరిగింది. భారత్
  • డిసెంబరు 28 నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు సతీమణి అన్నపూర్ణ కన్నుమూశారు.

మరణాలు

  • జనవరి 2 గుండవరపు సుబ్బారావు, అభ్యుదయ కవి, విప్లవ గీతాల రచయిత.
  • జనవరి 6 ఎస్. టి. జ్ఞానానంద కవి, తెలుగు రచయిత. (జ.1922).
  • జనవరి 21 ఇ.వి.వి.సత్యనారాయణ, తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత. (జ.1958).
  • ఫిబ్రవరి 19 వనం ఝాన్సీ, భారతీయ జనతా పార్టీ నాయకురాలు. భారత్
  • ఫిబ్రవరి 20 మలేషియా వాసు దేవన్, నేపథ్య గాయకుడు, (జ .1944).
  • ఫిబ్రవరి 21 ఎమ్.పీతాంబరం, తెలుగులో ఎన్టీయార్, తమిళంలో ఎమ్.జి.ఆర్. నంబియార్ లకు వ్యక్తిగత మేకప్ మాన్ గా వ్యవహరించారు.
  • ఫిబ్రవరి 22 మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, నటుడు, రచయిత . (జ.1916).
  • ఫిబ్రవరి 24 ముళ్ళపూడి వెంకటరమణ, తెలుగు నవల, కథ, సినిమా, హాస్య కథ రచయిత. (జ.1931).
  • మార్చి 30 నూతన్ ప్రసాద్, తెలుగు సినిమా రంగములో హాస్య నటుడు, ప్రతినాయకుడు. (జ.1945).
  • ఏప్రిల్ 6 సుజాత, దక్షిణ భారత సినిమా నటి. (జ.1952). భారత్
  • ఏప్రిల్ 14 రామిరెడ్డి (అంకుశం రామిరెడ్డి) దక్షిణ భారత చలన చిత్రాల ప్రతినాయకుడు. భారత్
  • ఏప్రిల్ 24 సత్య సాయి బాబా, భారతీయ ఆధ్యాత్మిక గురువు. (జ.1926). భారత్
  • ఏప్రిల్ 30 దోర్జీ ఖండు, అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ. 1955).
  • మే 2 బిన్ లాడెన్ ను అమెరికన్ సి.ఐ.ఏ. కాల్చి చంపింది.
  • మే 5 క్లాడ్ ఛౌల్స్ (బ్రిటన్ లో పుట్టాడు) 110వ సంవత్సరాల వయసులో పశ్చిమ ఆస్ట్రేలియాలో మరణించాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో రాయల్ నేవీ తరపున పోరాడి, 2011 మే 5 వరకు బ్రతికిన చివరి యోధుడు. (జ. 1901).
  • జూన్ 3 కరుటూరి సూర్యారావు, కష్టే ఫలీ అనే నానుడి నిజము చేసిన గొప్ప వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక వేత్త. (జ.1933).
  • జూన్ 7 నటరాజ రామకృష్ణ, పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు. (జ.1933).
  • జూన్ 9 ఎమ్.ఎఫ్. హుస్సేన్, అంతర్జాతీయంగా పేరుగాంచిన భారతీయ చిత్రకారుడు. (జ.1915). భారత్
  • జూన్ 21 కొత్తపల్లి జయశంకర్, తెలంగాణా సిద్ధాంతకర్త, తెలంగాణా పితామహుడు. (జ.1934).
  • జూలై 4 వి.ఆర్.ప్రతాప్ , తెలుగు చలన చిత్ర దర్శకుడు.
  • జూలై 26 కొర్లపాటి శ్రీరామమూర్తి, విమర్శకుడు. ఉత్తమ పరిశోధకుడు, ఆదర్శ ఆచార్యుడు. కవి. నాటకకర్త. (జ.1929).
  • ఆగస్టు 3 వేగుంట మోహనప్రసాద్, కవి, రచయిత. (జ.1942).
  • ఆగస్టు 7 మాతంగి విజయరాజు, రంగస్థల నటులు.
  • ఆగస్టు 14 షమ్మీ కపూర్, భారత సినీనటుడు, దర్శకుడు. (జ.1931). భారత్
  • ఆగస్టు 24 బండి రాజన్ బాబు, ఛాయాచిత్రకారుడు. (జ.1939).
  • సెప్టెంబరు 3 నండూరి రామమోహనరావు, తెలుగు పాత్రికేయరంగ ముఖ్యుడు, అభ్యుదయవాది, ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు. (జ.1927).
  • సెప్టెంబరు 3 ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్, పారిశ్రామిక వేత్త. (జ.1921).
  • సెప్టెంబరు 21 తుమ్మల వేణుగోపాలరావు, విద్యా, సాహితీ, సామాజిక వేత్త, వామపక్ష భావజాలసానుభూతిపరుడు. (జ.1928).
  • అక్టోబరు 10 జగ్జీత్ సింగ్, భారతీయ గజల్ గాయకుడు. (జ.1941). భారత్
  • అక్టోబరు 14 జాలాది రాజారావు, తెలుగు రచయిత. (జ.1932).
  • అక్టోబరు 20 అమరపు సత్యనారాయణ, నటుడు, గాయకుడు, రంగస్థల కళాకారుడు. (జ.1937).
  • అక్టోబరు 28 దూసి బెనర్జీ భాగవతార్, రంగస్థల నటుడు, భక్తిగీతాల గాయకుడు, వ్యాఖ్యాత, తబలా కళాకారుడు, సంగీత దర్శకుడు, హరికథా భాగవతార్‌.
  • అక్టోబరు 30 ఎన్.రాజేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మేల్యే. (జ.1956).
  • నవంబరు 28 అవసరాల రామకృష్ణారావు, కథలు, నవలల రచయిత. (జ.1931).
  • నవంబరు 28 అక్కినేని అన్నపూర్ణ, తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగేశ్వరరావు భార్య. (జ.1933).
  • నవంబరు 30 ఏల్చూరి విజయరాఘవ రావు, భారతీయ సంగీతకారుడు, వేణుగాన విద్వాంసుడు, సంగీత దర్శకుడు, రచయిత. (జ.1925). భారత్
  • డిసెంబరు 3 దేవానంద్, హిందీ చలనచిత్ర నటుడు. (జ.1923). భారత్
  • డిసెంబరు 11 మల్లెమాల సుందర రామిరెడ్డి, తెలుగు రచయిత, సినీ నిర్మాత. (జ.1924).
  • డిసెంబరు 23 త్రిపురనేని మహారధి, సినీ మాటల రచయిత (జ.1930).
  • డిసెంబరు 25 ఇలపావులూరి పాండురంగారావు, హిందీ సంస్కృత రచనలను తెలుగులోనికి, తెలుగు నుండి హిందీ, ఇంగ్లీషు భాషలకు అనేక పుస్తకాలను అనుసృజించాడు. (జ.1930).

సినిమా

  • జనవరి 21 'అనగనగా ఓ ధీరుడు' చిత్రం విడుదలైంది.
  • జనవరి 26 'వాంటెడ్' చిత్రం విడుదలైంది.
  • జనవరి 29 'వారేవా' చిత్రం విడుదలైంది.
  • ఫిబ్రవరి 18 'ఎల్బిడబ్ల్యు: లైఫ్ బిఫోర్ వెడ్డింగ్' చిత్రం విడుదలైంది.
  • ఫిబ్రవరి 25 'భలే మొగుడు భలే పెళ్ళామ్' చిత్రం విడుదలైంది.
  • మే 27 'వైకుంఠపాళీ' చిత్రం విడుదలైంది.
  • జూన్ 10 'నమిత ఐ లవ్ యు' చిత్రం విడుదలైంది.
  • ఆగస్టు 14 'ముగ్గురు (సినిమా)' చిత్రం విడుదలైంది.
  • ఆగస్టు 26 'దగ్గరగా దూరంగా' చిత్రం విడుదలైంది.
  • నవంబరు 17 'శ్రీరామరాజ్యం' చిత్రం విడుదలైంది.
  • నవంబరు 18 'వీడు తేడా' చిత్రం విడుదలైంది.
  • డిసెంబరు 9 'పంజా' చిత్రం విడుదలైంది.

ఈ సంవత్సరపు ప్రస్థానాలు