ఈ రోజు విశేషం
1830 కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్వానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఈతని యాత్ర 18 మే, 1830 నుండి సెప్టెంబరు 3, 1831 వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన ఏనుగుల వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.
తెలుగు నాట ఈ రోజు
- 1830 కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్వానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఈతని యాత్ర 18 మే, 1830 నుండి సెప్టెంబరు 3, 1831 వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన ఏనుగుల వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.
సంఘటనలు
- 1642 కెనడా దేశంలోని రెండవ పెద్ద నగరమైన మాంట్రియల్ స్థాపించబడింది.
- 1804 ఫ్రెంచ్ సెనేట్ నెపోలియన్ బోనపార్టెను చక్రవర్తిగా ప్రకటించింది.
- 1860 చికాగోలో జరిగిన రిపబ్లికన్ పార్టీ సమావేశం లో, అబ్రహం లింకన్ని అమెరికా అధ్యక్షుడుగా ప్రతిపాదించారు (నామినేటెడ్ ).
- 1910 హేలీ తోకచుక్క భూమి మీద నుంచి కనిపించి, సూర్యుని వైపు తరలిపోయింది.
- 1914 పనామా కాలువ ద్వారా కార్గో (సరుకు/సామాను) తో ప్రయాణించిన మొట్ట మొదటి స్టీం బోటు (ఆవిరితో నడిచే పడవ) పేరు మారినర్.
- 1933 టెన్నెసీ వేలీ అథారిటీ (టి.వి.ఏ) ని ఏర్పాటు చేసారు., దీని ఉద్దేశాలు.. టెన్నేస్సీ నది వలన వచ్చే వరదలను కట్టడి చేయటానికి, టెన్నెస్సీ లోయ లోని భూములలో అడవులను పెంచటము, గ్రామాలకు విద్యుత్తును అందించటము. టెన్నెసీ వేలీ అథారిటీ ఏడు రాష్ట్రాలలో పనిచేస్తుంది.
- 1953 : జాక్వెలిన్ కోచ్రన్ నార్త్ అమెరికన్ ఎఫ్-86 కనడేర్ విమానం రోజర్స్ డ్రై లేక్ (కాలిఫోర్నియా) మీదగా నడిపిన మొట్టమొదటి మహిళ. ఎఫ్-86 చేసే శబ్దానికి స్త్రీలు తట్టుకోలేరన్న వాదనను పటాపంచలు చేసింది.
- 1969 రోదసీ నౌక అపొలో 10 ని, ముగ్గురు రోదసీ యాత్రికుల (1. యూజీన్ ఎ. సెమన్, 2. థామస్ పి. స్టాఫర్డ, 3. జాన్ డబల్ యు. యంగ్) తో రోదసీ లోకి ప్రయోగించారు.
- 1980 93 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న, 9,677-అడుగుల ఎత్తున్న మౌంట్ సెయింట్ హెలెన్స్ అగ్నిపర్వతం (వాషింగ్టన్ రాష్ట్రము) పేలింది. అగ్నిపర్వతం పేలుడు హిరోషిమా పై వేసిన అణుబాంబు కంటే ఐదు వందల రెట్లు అధిక శక్తివంతమైనది. అగ్ని పర్వతం చిమ్మిన, ఆవిరి, బూడిద ఆకాశంలో 11 మైళ్ళఎత్తు దాటి, 160-మైళ్ళ వ్యాసార్ధములో ఆకాశం అంతా చీకటి మయం అయింది. అగ్నిపర్వతం చుట్టూ ఉన్న అడవులు అంటుకుని, ఆర్పటానికి సాధ్యం కాలేదు. ఈ పేలుడులోను, తరువాత మరణించిన వారు 67 మంది.. ఈ పేలుడు, 1300 అడుగుల ఎత్తున పర్వతం మీద జరిగి, 57 మంది మరణించటమో, కనపడకుండా పోవటమో జరిగింది.
- 1991 సోవియట్ సోయుజ్ అంతరిక్ష నౌకలో హెలెన్ షర్మన్ (మొట్ట మొదటి బ్రిటన్ మహిళ) అంతరిక్షంలోకి వెళ్ళింది.
- 1995 నటి ఎలిజబెత్ మాంట్ గోమెరి, లాస్ ఏంజిల్స్లో మరణించింది.
- 2005 కువాయిట్ పార్లమెంట్ ఆడవారికి ఓటు హక్కు ఇచ్చింది. భారత్
- 2006 నేపాల్ రాజు యొక్క అధికారాలను తగ్గించటానికి, నేపాల్ పార్లమెంట్ ఒక తీర్మానం చేసింది. భారత్
- 2006 అంగోలాలో కలరా వ్యాపించింది.
- 2006 భారత దేశపు, స్టాక్ మార్కెట్ అధఃపాతాళాన్ని తాకింది. సెన్సెక్స్ 826 పాయింట్లు, నిఫ్టీ 246 పాయింట్లు కోల్పోయాయి. భారత్
- 2007 అంటార్కిటిక్ సముద్రంలో 700 కొత్త జీవులను కనుగొన్నారు.
- 2011 స్పేస్ షటిల్ ఎండీవర్ ఆఖరి సారిగా (చివరి ప్రయాణం) రోదసీలోకి వెళ్ళింది.
- 2012 అమెరికాకు చెందిన నాస్ డాక్ స్టాక్ ఎక్స్చేంజీలో, ఫేస్ బుక్ (సోషల్ నెట్ వర్క్ సంస్థ) 2012 మే 18 నాడు నమోదు అయింది.
- 2012 రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే 54.90 స్థాయికి పడిపోయింది. రూపాయి – డాలరు మారకం విలువ చరిత్రలో, ఇది, అత్యంత తక్కువ స్థాయి.
జననాలు
- 1850 ఆలివర్ హీవిసైడ్, భౌతిక శాస్త్రవేత్త. అయనోస్పియర్ అనేది ఒకటి ఉందని, అది రేడియో తరంగాలను పరావర్తింప చేస్తుందని ఊహించి చెప్పిన శాస్త్రవేత్త.
- 1877 కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత. (మ.1923).
- 1883 జర్మన్ ఆర్కిటెక్ట్ (భవన నిర్మాత) [http://en.wikipedia.org/wiki/Bauhaus వాల్టర్ గ్రోపియస్], బౌహౌస్ స్కూలు స్థాపకుడు జననం.
- 1914 సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, సంఘసేవకురాలు. (మ.2010). భారత్
- 1916 సి.ఆర్.సుబ్బరామన్, తెలుగు సంగీత దర్శకుడు, నిర్మాత(మ.1952).
- 1928 చలం(కోరాడ సింహాచలం), తెలుగు చలన చిత్ర నటుడు, నిర్మాత.
- 1932 దూపాటి సంపత్కుమారాచార్య, సత్తుపల్లి లోని శారదా విద్యానికేతన్ కులపతి, రచయిత, శతావధాని.
- 1949 నరాల రామిరెడ్డి, సుప్రసిద్ధ తెలుగు అవధానీ.
- 1959 బేతా సుధాకర్ , చలన చిత్ర నటుడు, నిర్మాత.
మరణాలు
- 1886 అక్షయ్ కుమార్ దత్తా, బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనమునకు ఆద్యులలో ఒకరు. (జ.1820).
- 1986 కె.ఎల్.రావు, ఇంజనీరు, రాజకీయ నాయకుడు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి ఈయన కృషి చేశాడు. (జ.1902).
- 2007 జ్యోతి, దక్షిణ భారత చలన చిత్ర నటి(జ.1963). భారత్
- 2013 కళాధర్, చిత్ర కళా దర్శకుడు. (జ.1915).
- 2014 పి.అంకమ్మ చౌదరి, హేతువాది, మానవతావాది. మానవతా విలువలున్న న్యాయమూర్తి.
- 2017 కె.కె.శర్మ, తెలుగు సినిమా నటుడు, రంగస్థల నటుడు.
- 2018 పెద్దిభొట్ల సుబ్బరామయ్య, కథారచయిత (జ.1938).
- 2018 యద్దనపూడి సులోచనారాణి, నవలా రచయిత్రి. (జ.1940).
సినిమా
- 2001 'అమ్మాయి కోసం' చిత్రం విడుదలైంది.
- 2023 'Samajavaragamana' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం.