ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 254 పోప్ లూసియస్-I తరువాత పోప్ సెయింట్ స్టీఫెన్-I, 23వ కేథలిక్ పోప్ అయ్యాడు.
  • 1364 'కాసిమిర్ III', పోలాండ్ రాజు 'జగీల్లోనియన్ యూనివర్సిటీ' (పోలాండ్ లోని అత్యంత ప్రాచీనమైన విశ్వవిద్యాలయం)ని నెలకొల్పమని, 'రాజ పత్రం' (రాయల్ ఛార్టర్) ఇచ్చాడు.
  • 1459 'సన్ సిటీ ఇండియా' గా పేరుగాంచిన జోధ్‌పూర్ ని, రాథోర్ (డ్) వంశానికి చెందిన, రాజ్‌పుట్ ప్రముఖుడు, 'రావు జోధ్' స్థాపించాడు. భారత్
  • 1701 నెదర్లాండ్ లోని 'డ్రెన్త్' అనే ప్రాంతం గ్రెగొరియన్ కేలండర్ ని అమలు చేసింది (నిన్నటి రోజు తేది 1701 ఏప్రిల్ 29 నుంచి నేటి తేది 1701 మే 12 కి తేదీలు మారాయి. అంటే ఈ మధ్య రోజులు అన్నీ మాయమయ్యాయి అన్న మాట).
  • 1777 మొట్టమొదటి 'ఐస్ క్రీం' ప్రకటన (ఫిలిప్ లెంజి - న్యూయార్క్ గెజెట్ లో ప్రకటించారు).
  • 1792 నియమిత సమయంలో దానంతట అదే శుభ్రం చేసుకునే మరుగుదొడ్లు (టాయిలెట్స్ ఫ్లషింగ్) పేటెంటు హక్కులు పొందారు.
  • 1835 ఛార్లెస్ డార్విన్ ఉత్తర ఛిలి దేశంలో ఉన్న రాగి గనులను చూడటానికి వెళ్లాడు.
  • 1908 'నాథన్ బి. స్టబ్‌ల్‌ఫీల్డ్' 'వైర్‌లెస్ రేడియో ప్రసారానికి' పేటెంట్ హక్కులు తీసుకున్నాడు.
  • 1921 మొట్ట మొదటి 'నేషనల్ హాస్పిటల్ డే' ని అమెరికాలో జరుపుకున్నారు.
  • 1926 బ్రిటన్‌లో కార్మిక సంఘాలు చేసిన 9 రోజుల సాధారణ సమ్మెను విరమించారు.
  • 1937 కింగ్ జార్జి VI పట్టాభిషేకం గ్రేట్ బ్రిటన్లో జరిగింది.
  • 1942 1500 మంది యూదులను 'ఆస్చ్‌విట్జ్ కాన్సెంట్రేషన్ కేంపు' లో విషవాయువు ద్వారా చంపేసారు. ఈ కేంపు నాజీ జర్మనీ ఆక్రమించిన పోలాండ్ లో ఉంది.
  • 1942 అమెరికాకు చెందిన రవాణానౌకను, మిస్సిసిపి నదీ ముఖద్వారం దగ్గర, నాజీ లకు చెందిన యు-బోటు ముంచేసింది.
  • 1943 జర్మన్ సైన్యం, ఉత్తర ఆఫ్రికాలో లొంగిపోయింది.
  • 1949 అమెరికాలో మొట్ట మొదటి మహిళా రాయబారిగా శ్రీమతి విజయలక్ష్మి పండిట్ ని భారతదేశం నియమించింది. భారత్
  • 1951 మొదటి ఉదజని బాంబు (హైడ్రోజన్ బాంబు)ను 'ఎనెవెటక్ అటోల్' అనే చోట పరీక్షించారు.
  • 1952 'గజ్ సింగ్' జోధ్‌పూర్ మహారాజుగా కిరీట ధారణ జరిగింది.
  • 1956 తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్) తీవ్రమైన తుఫాను, ఎత్తైన సముద్రపు అలలతో, అతలాకుతలమైంది.
  • 1965 సోవియట్ యూనియన్ ప్రయోగించిన రోదసీనౌక లూనా 5 చంద్రుని నేల మీద నెమ్మదిగా దిగలేక కూలిపోయింది. ప్రయోగం విఫలమైంది.
  • 1982 'యు.ఎస్. ఫుట్‌బాల్ లీగ్' ఏర్పడింది.
  • 1984 ఫ్రాన్స్ అణుబాంబును పరీక్షించింది.
  • 1984 నెల్సన్ మండేలా,దక్షిణాఫ్రికాలో ఖైదు చేయబడిన 22 సంవత్సరాల తరువాత తన భార్యను చూసాడు.
  • 1986 అమెరికాకు చెందిన 'ఫ్రెడ్ మార్ఖం' తన రెండుచక్రాల సైకిలు పై, గంటకు 65 మైళ్ళ (104.607 కి.మీ) వేగం సాధించాడు.
  • 1991 పసిఫిక్ ప్రాంతపు వాయవ్య దిక్కులో దొరికే, అరుదైన మూలికతో కేన్సర్ వ్యాధికి ఒక కొత్త మందును కనుగొన్నారు.
  • 1992 ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మొదటి బెల్జియం దేశ మహిళ 'ఇన్‌గ్రిడ్ బేయెన్స్'.
  • 1997 ఆస్ట్రేలియాకు చెందిన 'సుసాన్ జీన్ (సుసీ) మరోనీ' (22 సంవత్సరాలు),క్యూబా నుంచి ఫ్లోరిడా స్ట్రెయిట్స్ (అమెరికా) వరకూ (180 కి.మీ - 112 మైళ్ళు) ఈత కొట్టిన మొదటి మనిషి, మొదటి మహిళ. ఈమె సెరిబ్రల్ ఫాల్సీ వ్యాధితో పుట్టింది.
  • 2002 మాజీ అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ 5 రోజుల క్యూబా పర్యటనకు వెళ్లాడు. 1959 లో, క్యూబాలో ఫిడెల్ కాస్ట్రో తిరుగుబాటు చేసిన తరువాత పర్యటించిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్.
  • 2008 చైనాలోని సిచుయాన్లో రెక్టర్ స్కేల్ మీద 8.0 మేగ్నిట్యూడ్ తీవ్రతతో భూకంపం వచ్చి, 69,000 మంది మరణించారు.
  • 2010 బ్రిటన్ ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన డేవిడ్ కామెరాన్ ప్రమాణస్వీకారం చేశాడు. భారత్
  • 2010 'ఆఫ్రిఖియా ఏర్‌వేస్' కి చెందిన విమానం కూలి అందరూ మరణించారు ఒక్కడు తప్ప.
  • 2012 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయొజెనిక్ ఇంజిన్ ప్రయోగం సఫలమైంది. దీనిని, ఉపగ్రహ ప్రయోగ వాహకం జి.ఎస్.ఎల్.వి-డి5 లో బిగించుతారు. భారతదేశం, అమెరికాను ఈ ఇంజిన్లు అడిగినప్పుడు భారత దేశానికి ఇవ్వకుండగా, భారత దేశానికి అనేకమైన అడ్డంకులను కల్పించింది. భారత్

జననాలు

  • 1401 షొకొ చక్రవర్తి, జపాన్ 101వ చక్రవర్తి (మ. 1428).
  • 1820 ఫ్లోరెన్స్ నైటింగేల్, ఫ్లారెన్స్ నైటింగేల్, సమాజ సేవకురాలు, నర్సు. (మ. 1910).
  • 1895 జిడ్డు కృష్ణమూర్తి, భారతీయ తత్వవేత్త. (మ. 1986). భారత్
  • 1899 ఇంద్రా దేవి, లాట్వియన్ యోగా గురువు (మ. 2002).
  • 1920 వింజమూరి అనసూయ, జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత (మ.2019).
  • 1924 వింజమూరి సీతాదేవి, సంగీతకారిణి , గాయకురాలు, రచయిత(మ.2016).
  • 1924 షేక్ చిన మౌలానా, నాదస్వర విద్వాంసులు (మ.1999).
  • 1926 భాట్టం శ్రీరామమూర్తి, జర్నలిస్టు, రాజకీయవేత్త.
  • 1926 పోలెట్ పూజోల్-ఒరియోల్, హైతియన్ విద్యావేత్త, నటి.
  • 1937 జార్జ్ కార్లిన్, అమెరికన్ స్టాండ్-అప్ హాస్యకారుడు, సామాజిక విమర్శకుడు, నటుడు,, రచయిత. (మ.2008).
  • 1945 కె. జి. బాలకృష్ణన్, భారతదేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి. భారత్
  • 1950 షోజొ ఫుజీ, జూడో ఛాంపియన్.
  • 1951 గున్నార్ లార్సన్ స్వీడెన్, 200 మీటర్లు / 400 మీటర్లు ఈతగాడు (1972 లో ఒలింపిక్ బంగారుపతకాన్ని గెలిచాడు).
  • 1969 చంద్రసిద్ధార్ధ , తెలుగుచిత్రాల దర్శకుడు, నిర్మాత.
  • 1980 రుషి సునాక్ , యునైటెడ్ కింగ్ డం ప్రధాన మంత్రి.
  • 2003 ప్రిన్స్ సద్రుద్దిన్ ఆగా ఖాన్, ఫ్రెంచి యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫొర్ రెఫ్యూజీస్ (కాందిశీకులకు) (జ.1933).

మరణాలు

  • 1871 జాన్ ఎఫ్.డబ్లు. హెర్షెల్, బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్త (నెబ్యులాలను కేటలాగ్ లో ప్రకటించాడు. (నక్షత్ర మేఘాల పట్టిక తయారుచేసిన వాడు)). భారత్
  • 1922 మాస్టర్ సి.వి.వి., భారతీయ తత్త్వవేత్త, యోగి, గురువు.(జ.1868). భారత్
  • 1946 ధారా వెంకట సుబ్బయ్య, భక్త ప్రహ్లాద, వేణీ సంహారం, భీష్మ నిర్యాణం, గయోపాఖ్యానం, పాండవోద్యోగ విజయాలు మొదలైన నాటకలను రసవంతంగా ప్రదర్శించేవారు.
  • 2009 గుత్తి రామకృష్ణ, కథకుడు, పాత్రికేయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1915). భారత్
  • 2021 కె.ఎస్.చంద్రశేఖర్ , తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు.

సినిమా

  • 1965 'తోడూ నీడా' చిత్రం విడుదలైంది.
  • 1972 'మంచి రోజులొచ్చాయి' చిత్రం విడుదలైంది.
  • 1980 'మూడు ముళ్ళ బంధం' చిత్రం విడుదలైంది.
  • 2017 'రాధ' చిత్రం విడుదలైంది.
  • 2017 'వెంకటాపురం 2017 సినిమా' చిత్రం విడుదలైంది.
  • 2022 'సర్కారు వారి పాట' చిత్రం విడుదలైంది.

పండుగలు, జాతీయ దినాలు

  • 'నేషనల్ హాస్పిటల్ డే' ని 1921 నుంచి అమెరికాలో జరుపుకుంటున్నారు.
  • అంతర్జాతీయ నర్సుల దినోత్సవం.
  • అంతర్జాతీయ వలస పక్షుల దినం.