ఈ రోజు విశేషం
1937 కోస్తాంధ్ర, రాయల సీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈ రెండు ప్రాంతాల నాయకులు, శ్రీ బాగ్ ఒడంబడిక పై సంతకాలు చేసారు. దాని ప్రకారం, రాజధాని, హై కోర్టు, విశ్వ విద్యాలయం ఒకే చోట కాకుండా, వేరు వేరు ప్రాంతాలలో ఉండాలి. దాని ప్రకారం, గుంటూరులో 1954 జూలై 5 నాడు హై కోర్టుని నెలకొల్పారు. కర్నూలును (రాయల సీమ) రాజధానిని చేసారు. విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో ఉంది (ఆంధ్ర విశ్వ కళా పరిషత్).
తెలుగు నాట ఈ రోజు
- 1937 కోస్తాంధ్ర, రాయల సీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈ రెండు ప్రాంతాల నాయకులు, శ్రీ బాగ్ ఒడంబడిక పై సంతకాలు చేసారు. దాని ప్రకారం, రాజధాని, హై కోర్టు, విశ్వ విద్యాలయం ఒకే చోట కాకుండా, వేరు వేరు ప్రాంతాలలో ఉండాలి. దాని ప్రకారం, గుంటూరులో 1954 జూలై 5 నాడు హై కోర్టుని నెలకొల్పారు. కర్నూలును (రాయల సీమ) రాజధానిని చేసారు. విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో ఉంది (ఆంధ్ర విశ్వ కళా పరిషత్).
- 1954 టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్ కాదు) ముఖ్యమంత్రిగా పదవీ విరమణ (1953 అక్టోబర్ 1 నుంచి 1954 నవంబరు 15 వరకు).
- 1954 ఆంధ్ర రాష్ట్రంలో (ఆంధ్రప్రదేశ్ కాదు) రాష్ట్రపతి పాలన మొదలు (1954 నవంబరు 15 నుంచి 1955 మార్చి 28 వరకు).
- 1954 అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో టంగుటూరి ప్రకాశం నేతృత్వంలోని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పడిపోయింది. పూర్తి ప్రస్థానం →
- 1986 ప్రఖ్యాత భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ముంబైలో జన్మించింది; కొద్దికాలానికే ఆమె కుటుంబం హైదరాబాద్కు తరలివెళ్లింది. పూర్తి ప్రస్థానం →
- 1993 ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఒకటి 272 మంది ప్రయాణీకులతో తిరుపతి దగ్గర పొలాల్లో దిగింది. ప్రయాణీకులంతా క్షేమంగానే ఉన్నారు.
- 2022 తెలుగు సినిమా సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ హైదరాబాదులో కార్డియాక్ అరెస్ట్తో కన్నుమూశారు. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 2000 108 రోజుల నిర్బంధం తరువాత కన్నడ నటుడు రాజ్కుమార్ ను వీరప్పన్ విడిచిపెట్టాడు.
- 2000 భారతదేశంలో కొత్తగా ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది. బీహార్ రాష్ట్రాన్ని విభజించి ఛోటానాగ్పూర్ ప్రాంతంలో ఈ రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు. భారత్
జననాలు
- 1738 విలియం హెర్షెల్, వరుణ (యురేనస్) గ్రహాన్ని కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్త. (మ.1822).
- 1883 ఓలేటి వేంకటరామశాస్త్రి, జంటకవులు వేంకట రామకృష్ణ కవులలో మొదటివాడు. (మ.1939).
- 1898 కల్లూరి చంద్రమౌళి, స్వాతంత్ర్య సమరయోధుడు, మంత్రిపదవి, తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. (మ.1992).
- 1902 గోరా, హేతువాది, భారతీయ నాస్తికవాద నేత. (మ.1975). భారత్
- 1927 నల్లాన్ చక్రవర్తి శేషాచార్లు, తెలుగు సాహితీవేత్త.
- 1935 తెన్నేటి హేమలత, నవలా రచయిత్రి.
- 1949 మల్లాది వెంకట కృష్ణమూర్తి, తెలుగు రచయిత.
- 1958 దార్ల రామచంద్రం, కథా రచయత (మ. 2024).
- 1986 సానియా మీర్జా, భారతదేశ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి. భారత్
మరణాలు
- 1630 జోహాన్స్ కెప్లర్, ప్రఖ్యాత జర్మన్ అంతరిక్ష పరిశోధకుడు. (జ.1571).
- 1949 నాథూరామ్ గాడ్సే, గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. (జ.1910). భారత్
- 1949 నారాయణ్ ఆప్తే, ఆర్.ఎస్.ఎస్. కార్యకర్త, గాంధీ హత్య కేసు నిందితులలో ఒకరు. భారత్
- 1982 వినోబా భావే, స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది. (జ.1895). భారత్
- 2012 వేదాంతం సత్యనారాయణ శర్మ, కూచిపూడి నృత్య కళాకారుడు, నటుడు. (జ.1935).
- 2022 ఘట్టమనేని కృష్ణ, సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత, మాజీ లోక్సభ సభ్యుడు. (జ.1943). భారత్
సినిమా
- 2010 'కర్మ (2010 సినిమా)' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- 2000: ఝార్ఖండ్ ఫౌండేషన్ డే.