ఈ రోజు విశేషం
2005 తెలుగు చిత్రం 'అతడు' అమెరికాలో తొలి ప్రదర్శన నార్త్ బెర్గెన్లోని సినీ ప్లాజా 13 థియేటర్లో జరిగింది.
తెలుగు నాట ఈ రోజు
- 2005 తెలుగు చిత్రం 'అతడు' అమెరికాలో తొలి ప్రదర్శన నార్త్ బెర్గెన్లోని సినీ ప్లాజా 13 థియేటర్లో జరిగింది. పూర్తి ప్రస్థానం →
- 2010 విశాఖపట్నం బార్ అసోసియేషన్ కి 2010-11 సంవత్సరానికి, బుధవారం ఎన్నికలు జరిగాయి.
- 2013 గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి యొక్క నవభారత యువభేరీ సదస్సు హైదరాబాదులో జరిగింది.
సంఘటనలు
- 2008 బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో అభినవ్ బింద్రా షూటింగ్ లో స్వర్ణపతకం సాధించాడు. వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకం రావడం భారత్కు ఇదే తొలిసారి. భారత్
జననాలు
- 1926 ఎక్కిరాల కృష్ణమాచార్య, రచయిత, హోమియో వైద్యుడు (మ.1984).
- 1927 నీతా హొంటివెరోస్-లిచౌకో, ఫిలిప్పైన్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకురాలు, అధ్యక్షురాలు.
- 1949 దువ్వూరి సుబ్బారావు, ఖమ్మం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించాడు, భారతదేశపు కేంద్రబ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా (2008 - 2013) పనిచేశాడు.
- 1950 మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, కృష్ణా జిల్లాకు చెందిన వై.ఎస్.ఆర్ పార్టీ నాయకుడు, నూజివీడు శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడు.
మరణాలు
- 1908 ఖుదీరాం బోస్, భారతీయ స్వాతంత్ర్య సమర వీరులలో మొదటితరానికి చెందిన అతిపిన్నవయస్కుడు (జ.1889). భారత్
- 1945 త్యాగబీర్ హేమ్ బారువా, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త, రచయిత (జ.1893). భారత్
- 1946 బత్తిని మొగిలయ్య గౌడ్, తెలంగాణ విమోచనోద్యమ నాయకుడు, వరంగల్లులో రజాకార్ల దాష్టీకాలతో హత్య చేయబడ్డాడు (జ.1918).
- 1962 పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి, రచయిత, సాహితీకారుడు (జ.1900).
- 2000 పైడి జైరాజ్, భారత సినీరంగంలో నటుడు, నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత (జ.1909). భారత్
- 2012 భద్రిరాజు కృష్ణమూర్తి, ద్రావిడ భాషా పరిశోధకుడు, భాషాశాస్త్ర అధ్యాపకుడు (జ.1928).
- 2016 యాదాటి కాశీపతి, అనంతపురం జిల్లాకు చెందిన పాత్రికేయుడు, రచయిత.
- 2016 ఇచ్ఛాపురపు రామచంద్రం, కథారచయిత. బాల సాహిత్య రచయిత. (జ.1940).
- 2018 విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్, భారత సంతతికి చెందిన వ్యక్తి, సాహిత్యంలో నోబెల్ బహుమతి గ్రహిత (జ. 1932). భారత్
- 2025 హేమంత్ దత్తా, అస్సామీ నాటక రచయిత, సినిమా దర్శకుడు గీత రచయిత (జ.1941).
సినిమా
- 1978 'సింహబలుడు' చిత్రం విడుదలైంది.
- 2017 'జయ జానకి నాయక' చిత్రం విడుదలైంది.