గురజాడ అప్పారావు
గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యంలో వాడుక భాషా ఉద్యమానికి బలమైన పునాది వేసిన మహాకవి, సంఘ సంస్కర్త. కన్యాశుల్కం వంటి దురాచారాలను ఎండగడుతూ ఆయన రాసిన నాటకం తెలుగు నాటక సాహిత్యంలో అగ్రస్థానంలో నిలిచింది. 'దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్' అంటూ ఆయన అందించిన దేశభక్తి గీతం తరతరాలకు స్ఫూర్తినిస్తోంది.
-
1862 సెప్టెంబరు 21
మహాకవి గురజాడ అప్పారావు విశాఖ జిల్లా రాయవరంలో మేనమామ ఇంట జన్మించారు.
-
1882
గురజాడ అప్పారావు మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.
-
1884
గురజాడ అప్పారావు ఎఫ్.ఎ పూర్తి చేసి ఎం.ఆర్. ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు.
-
1885
గురజాడ అప్పారావుకు అప్పల నరసమ్మతో వివాహం జరిగింది.
-
1887
విజయనగరంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో గురజాడ అప్పారావు తొలిసారి ప్రసంగించారు.
-
1889
గురజాడ అప్పారావు ఆనంద గజపతి డిబేటింగ్ క్లబ్బుకు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
-
1891
విజయనగర సంస్థాన శాసన పరిశోధకుడిగా గురజాడ అప్పారావు నియమితులయ్యారు.
-
1892
గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకం తొలిసారి ప్రదర్శితమై గొప్ప పేరు తెచ్చుకుంది.
-
1896
గురజాడ అప్పారావు ప్రకాశిక అనే పత్రికను ప్రారంభించారు.
-
1897
గురజాడ కన్యాశుల్కం తొలి కూర్పు ప్రచురితమై మహారాజా ఆనంద గజపతికి అంకితమివ్వబడింది.
-
1909
గురజాడ అప్పారావు నీలగిరి కొండల్లో విశ్రాంతి సమయంలో కన్యాశుల్కం నాటకాన్ని తిరగరాసి రెండవ కూర్పు వెలువరించారు.
-
1910
గురజాడ అప్పారావు సుప్రసిద్ధ దేశభక్తి గీతం 'దేశమును ప్రేమించుమన్నా' రచించారు.
-
1911
గురజాడ అప్పారావు మద్రాసు విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యుడిగా నియమితులై, మిత్రులతో కలిసి ఆంధ్ర సాహిత్య పరిషత్తు ప్రారంభించారు.
-
1913
గురజాడ అప్పారావు పదవీ విరమణ చేశారు; మద్రాసు విశ్వవిద్యాలయం ఆయనను ఫెలోషిప్తో గౌరవించింది.
-
1915 నవంబరు 30
కన్యాశుల్కం నాటక కర్త, అభ్యుదయ కవితా పితామహుడు గురజాడ అప్పారావు కన్నుమూశారు.
-
1955 మార్చి 13
గురజాడ కన్యాశుల్కం రచనపై జయంతి కుమారస్వామి ఆంధ్రపత్రికలో రాసిన వ్యాసంతో పెద్ద వివాదం చెలరేగింది.
-
2012 సెప్టెంబరు 21
గురజాడ అప్పారావు 150వ జయంతి సందర్భంగా ఆయన సమగ్ర రచనల సంపుటం 'గురుజాడలు' తొలి ముద్రణ వెలువడింది.