ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

  • 1954 గుంటూరులో 1954 జూలై 5 నాడు ఆంధ్ర రాష్ట్ర హైకోర్టును నెలకొల్పారు. కోస్తాంధ్ర, రాయల సీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈ రెండు ప్రాంతాల నాయకులు, శ్రీ బాగ్ ఒడంబడిక పై 1937 నవంబరు 15 న సంతకాలు చేసారు. దాని ప్రకారం, రాజధాని, హైకోర్టు, విశ్వ విద్యాలయం ఒకే చోట కాకుండా, వేరు వేరు ప్రాంతాలలో ఉండాలి. దాని ప్రకారం, గుంటూరులో 1954 జూలై 5 నాడు హైకోర్టుని నెలకొల్పారు. కర్నూలును (రాయల సీమ) రాజధానిని చేసారు. విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో ఉంది (ఆంధ్ర విశ్వ కళా పరిషత్).
  • 1995 భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు హైదరాబాదులో వాలీబాల్ క్రీడాకారులైన పి.వి. రమణ, విజయ దంపతులకు జన్మించింది. పూర్తి ప్రస్థానం →

సంఘటనలు

  • 1687 సర్ ఐజాక్ న్యూటన్ ఫిలాసఫి నేచురాలిస్ ప్రిన్సిపియా మేథ్ మెటికా అనే గ్రంథాన్ని ప్రచురించాడు.
  • 1811 వెనెజులా దేశం స్పెయిన్ దేశం నుంచి స్వతంత్రం ప్రకటించుకొంది.
  • 1946 బికినీ ఈత దుస్తులను, పారిస్ ఫేషన్ షో లో, మొట్టమొదటిసారిగా ప్రదర్శించారు.
  • 1954 బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బి.బి.సి.) తన మొట్టమొదటి టెలివిజన్ వార్తా వాహినిని ప్రసారం చేసింది. భారత్
  • 1962 అల్జీరియా దేశం స్వతంత్రం పొందింది (ఫ్రాన్స్ నుంచి).
  • 1975 కేప్ వెర్డె దేశం స్వతంత్రం పొందింది (పోర్చుగల్ నుంచి).
  • 1977 పాకిస్తాన్ మిలిటరీ అధికారులు కుట్ర చేసి, పాకిస్తాన్ లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన జుల్ఫికర్ ఆలి భుట్టో ను, ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించారు. భారత్
  • 1995 సోవియట్ రష్యా నుంచి స్వతంత్రం పొందిన నాలుగు సంవత్సరాల తరువాత, ఆర్మీనియా దేశం తన స్వంత రాజ్యాంగాన్ని అమలు చేసుకుంది.
  • 1996 మొట్టమొదటిసారి, క్లోనింగ్ ద్వారా పెద్ద గొఱ్ఱె నుంచి సేకరించిన గొఱ్ఱె జీవ కణం ద్వారా డాలీ అనే పేరు గల గొఱ్ఱె ను శాస్త్రవేత్తలు పుట్టించారు.
  • 2004 లోక్ సభ స్పీకర్ సోమనాధ్ చటర్జీ ఆదేశాల పై 2004 జూలై 5 నుంచి లోక్ సభ లో జరిగే శూన్య గంట (జీరో అవర్) చర్చలను, ప్రత్యక్ష ప్రసారం చేయటం మొదలుపెట్టారు.

జననాలు

  • 1853 రొడీషియా (నేటి జింబాబ్వే) దేశాన్ని స్థాపించిన సెసిల్ రోడ్స్.
  • 1906 ఘంటసాల బలరామయ్య, తెలుగు సినిమా నిర్మాత, దర్శకులు. (మ.1953).
  • 1920 సచిన్ నాగ్, 1951 ఆసియా క్రీడలలో భారతదేశానికి మొట్టమొదటి బంగారు పతకం తెచ్చిపెట్టిన ఈతగాడు. (మ.1987). భారత్
  • 1927 రావూరి భరద్వాజ, తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (మ.2013).
  • 1943 అదితి పంత్, ఓషనోగ్రాఫర్. అంటార్కెటికా మీద కాలుమోపిన మొట్టమొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త. భారత్
  • 1956 చౌలపల్లి ప్రతాపరెడ్డి,1994లో రాజకీయాలలో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీలో చేరాడు, షాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి 9838 ఓట్ల మెజారిటీతో ఎన్నికయ్యాడు.
  • 1979 నవీన షేక్, రంగస్థల, సినీ, టివీ నటి.
  • 1980 కళ్యాణ్ రామ్, తెలుగు సినిమా నటుడు, నందమూరి తారక రామారావు మనవడు.
  • 1995 పి.వి. సింధు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. పలు అంతర్జాతీయ పోటీలలో విజయకేతనం ఎగురవేసింది.
  • 1997 కార్తీక్ రత్నం , నాటక రంగ , సినిమా నటుడు.

మరణాలు

  • 2017 కంచర్ల సుగుణమణి, సంఘసేవకురాలు, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ అనుయాయి (జ.1919).

సినిమా

  • 1977 'రాజా రమేష్' చిత్రం విడుదలైంది.
  • 1979 'వేటగాడు' చిత్రం విడుదలైంది.
  • 2012 'ఈగ' చిత్రం విడుదలైంది.
  • 2013 'మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు' చిత్రం విడుదలైంది.

పండుగలు, జాతీయ దినాలు

  • అంతర్జాతీయ సహకార సంఘ దినోత్సవం.
  • మెకానికల్ పెన్సిల్ డే.