ఈ రోజు విశేషం
2014 అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' తొలి సీజన్ మా టీవీలో ప్రారంభమైంది.
తెలుగు నాట ఈ రోజు
- 2014 అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' తొలి సీజన్ మా టీవీలో ప్రారంభమైంది. పూర్తి ప్రస్థానం →
- 2024 రామోజీరావు అంత్యక్రియలు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1900 భారత స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా బ్రిటిష్ జైలులో అనూహ్యమైన రీతిలో మరణించాడు. భారత్
- 1964 భారత ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి నియమితుడైనాడు. భారత్
- 1964 లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వంలో దామోదరం సంజీవయ్య కేంద్ర శ్రామిక, ఉద్యోగ శాఖల మంత్రిగా కొనసాగారు. భారత్ పూర్తి ప్రస్థానం →
- 2001 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ చిత్రకారుడు బాపును జీవిత సాఫల్య పురస్కారంతో సన్మానించింది. భారత్ పూర్తి ప్రస్థానం →
- 2006 ప్రపంచ కప్పు సాకర్ పోటీలు జర్మనీలో ప్రారంభమయ్యాయి.
జననాలు
- 1899 వామన్ శ్రీనివాస్ కుడ్వ, సిండికేట్ బ్యాంకు వ్యవస్థాపకులలో ఒకరు. (మ.1967).
- 1912 ఉమ్మెత్తల గోపాలరావు, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.
- 1931 నందిని సత్పతీ, ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి (మ.2006). భారత్
- 1939 డాక్టర్ వేణుముద్దల నరసింహారెడ్డి కవి, తెలుగు ఆచార్యుడు. (మ. 1973).
- 1947 గాలి ముద్దుకృష్ణమ నాయుడు, ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయనాయకుడు. (మ.2018).
- 1949 కిరణ్ బేడీ, భారత దేశ మహిళా పోలీసు అధికారి, సామాజిక కార్యకర్త. భారత్
- 1951 తెలంగాణ శకుంతల, తెలుగు సినిమా రంగంలో క్యారెక్టర్ నటి, ప్రతినాయకురాలు, హాస్య నటి. (మ.2014).
- 1954 ఎం. ఎఫ్. గోపీనాథ్, తెలుగు రచయిత, రాజకీయ విశ్లేషకుడు, భారతదేశపు తొలి దళిత కార్డియాలజిస్టు.
- 1959 జి.వి.హర్షకుమార్, భారత పార్లమెంటు సభ్యుడు, ఇతడు 14వ లోక్సభకు ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురం లోక్సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
- 1975 అమీషా పటేల్ , భారత చలన చిత్ర నటి, మోడల్. భారత్
- 1977 రూపా మిశ్రా, భారతీయ సామాజిక కార్యకర్త, 2003-2004 IAS లో ప్రథమురాలు. భారత్
- 1978 మోహినీ , దక్షిణ భారత చలన చిత్ర నటి. భారత్
మరణాలు
- 1936 అబ్బాస్ తయ్యబ్జీ, స్వాతంత్ర్య సమరయోధుడు, మహాత్మాగాంధీ అనుచరుడు. (జ.1854). భారత్
- 1949 వంగోలు వెంకటరంగయ్య, బహుభాషా పండితుడు, న్యాయవాది, రచయిత. (జ.1867).
- 1995 ఎన్.జి.రంగా, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు, రైతు నాయకుడు. (జ.1900). భారత్
- 2011 ఎమ్.ఎఫ్. హుస్సేన్, అంతర్జాతీయంగా పేరుగాంచిన భారతీయ చిత్రకారుడు. (జ.1915). భారత్
- 2012 పాలపర్తి వెంకటేశ్వర్లు, ఆదిలాబాదు జిల్లా కలెక్టరుగా పనిచేశాడు.
- 2017 పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తెలంగాణా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. (జ.1936).
- 2019 బి.వి.పరమేశ్వరరావు మహిళల ఆర్థిక స్వేచ్ఛకోసం "మహిళా సంఘాల"ను ప్రారంభించాడు. (జ.1933).
- 2022 సురభి బాబ్జీ, సురభి నాటక నిర్వాహకుడు (జ. 1949).
- 2022 మాట్ జిమ్మెర్మాన్, కెనడియన్ నటుడు (జ. 1934).
- 2024 అమోల్ కాలే, ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు. (జ.1976/77). భారత్
సినిమా
- 1972 'దత్తపుత్రుడు' చిత్రం విడుదలైంది.
- 1992 'పెళ్ళానికి ప్రేమలేఖ ప్రియురాలికి శుభలేఖ' చిత్రం విడుదలైంది.
- 2006 'ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు' చిత్రం విడుదలైంది.
- 2023 'విమానం' చిత్రం విడుదలైంది.