ఈ రోజు విశేషం
2015 క్రికెటర్ వి.వి.యస్. లక్ష్మణ్ న్యూఢిల్లీలోని టెరీ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.
తెలుగు నాట ఈ రోజు
- 2015 క్రికెటర్ వి.వి.యస్. లక్ష్మణ్ న్యూఢిల్లీలోని టెరీ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 2007 భారతీయ సంతతితికి చెందిన అమెరికన్ మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ 22 గంటల 27 నిమిషాలు రోదసిలో నడచి కొత్త రికార్డు సృష్టించింది. భారత్
జననాలు
- 1891 మాడభూషి అనంతశయనం అయ్యంగార్, స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు, లోక్సభ స్పీకరు. భారత్
- 1908 మఖ్దూం మొహియుద్దీన్, కార్మిక నాయకుడు, ఉర్దూకవి. (మ.1969).
- 1910 బెళ్లూరి శ్రీనివాసమూర్తి, సాహిత్యపిపాసకుడు. ఎన్నో పద్యాలను అల్లినవాడు. హనుమంతరావు అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం మొదలైన సమస్త వైద్యశాఖలలో సిద్ధహస్తుడు.
- 1911 వేదుల సూర్యనారాయణ శర్మ, ‘శే్లషయమక చక్రవర్తి’ వేంకటాధ్వరి సంస్కృతంలో రాసిన లక్ష్మీసహస్ర మహాకావ్యాన్ని శర్మగారు అతి మనోహరంగా తెలుగులో అనువదించి తన ప్రతిభను చాటుకున్నారు.
- 1913 ఒక ఆఫ్రికన్ అమెరికన్ కుట్టుపనిచేసే స్త్రీ, పౌర హక్కుల ఉద్యమకారి రోసా పార్క్స్.
- 1938 కథక్ కళాకారుడు బిర్జూ మహరాజ్.
- 1939 రామ్మోహన్ , తెలుగు, తమిళ, చిత్రాల నటుడు(మ.2005).
- 1943 ఫాదర్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్ లా డాక్టర్ కండే ప్రసాద రావు.
- 1948 భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు రాకేష్ శుక్లా. భారత్
- 1962 డాక్టర్ రాజశేఖర్, తెలుగు సినిమా నటుడు. ఈయన తెలుగు, తమిళ సినిమాలలో వివిధ పాత్రలలో నటించాడు.
- 1966 కోడిహళ్లి మురళీ మోహన్, రచయిత, సంపాదకుడు, అనువాదకుడు, వికీపీడియన్.
- 1972 శేఖర్ కమ్ముల, తెలుగు సినీదర్శకుడు, నిర్మాత, సినీ రచయిత.
- 1974 ఊర్మిళ , భారతీయ సినీనటి , రాజకీయ నాయకురాలు. భారత్
మరణాలు
- 1973 మునిమాణిక్యం నరసింహారావు, తెలుగు హాస్యరచయితలలో మునిమాణిక్యం గారికి ఒక విశిష్టస్థానం ఉంది.
- 1990 చౌటి భాస్కర్, ప్రముఖ సంగీత విద్యాంసులు (జ. 1939).
- 1993 దౌలత్ సింగ్ కొఠారి, భారతీయ శాస్త్రవేత్త, విద్యావేత్త. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1906). భారత్
- 2006 రాజ్ వీర్ సింగ్ యాదవ్, భారతదేశపు మొట్టమొదటి మూత్రపిండ మార్పిడి శస్త్రవైద్యుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1937). భారత్
- 2019 పిళ్లా రామారావు స్వాతంత్ర్య సమరయోధుడు, ఆర్.ఎస్.ఎస్. నాయకుడు. భారత్
- 2023 వాణి జయరాం, దక్షిణ భారత నేపథ్యగాయని.(జ.1945). భారత్
సినిమా
- 1971 'నిండు దంపతులు' చిత్రం విడుదలైంది.
- 2000 'క్షేమంగా వెళ్ళి లాభంగా రండి' చిత్రం విడుదలైంది.
- 2005 'కీలుగుర్రం (2005 సినిమా)' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- వరల్డ్ క్యాన్సర్ డే,.
- శ్రీలంక స్వాతంత్ర్య దినోత్సవం. భారత్
- జాతీయ భద్రతా దినోత్సవం.