ఈ రోజు విశేషం
2008 చెన్నైలోని ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సానియా మీర్జాకు డాక్టర్ ఆఫ్ లెటర్స్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
తెలుగు నాట ఈ రోజు
- 1881 కందుకూరి వీరేశలింగం తన ఇంట తొలి వితంతు పునర్వివాహం జరిపించి సంఘ సంస్కరణ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించారు. పూర్తి ప్రస్థానం →
- 1891 తెలుగునాట మొట్టమొదటి వితంతు పునర్వివాహం కందుకూరి వీరేశలింగం పంతులు ఆధ్వర్యంలో, రాజమండ్రిలో జరిగింది.
- 1965 హైదరాబాదు లోని రామచంద్రాపురంలో బి.హెచ్.ఇ.ఎల్ కర్మాగారాన్ని, నాటి భారత ప్రధానమంత్రి, లాల్ బహదూర్ శాస్త్రి ప్రారంభించాడు.
- 2008 చెన్నైలోని ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సానియా మీర్జాకు డాక్టర్ ఆఫ్ లెటర్స్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1911 నేపాల్ రాజు త్రిభువన్ అధికారంలోకి వచ్చాడు.
- 1946 భారత రాజ్యాంగ పరిషత్తు అధ్యక్ష ఎన్నికలలో రాజేంద్ర ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనాడు. భారత్
- 1946 ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునిసెఫ్ అమలులోకి వచ్చింది.
- 1946 సరోజినీ నాయుడు రాజ్యాంగ పరిషత్తులో తన ఏకైక ప్రసంగం చేశారు. భారత్ పూర్తి ప్రస్థానం →
- 1967 పశ్చిమ భారతదేశములో వచ్చిన భూకంపము వలన 170 మంది మరణించారు. ఆ భూకంపము తీవ్రత రిక్టర్ స్కేలు పై 6.5గా నమోదు అయ్యింది. భారత్
జననాలు
- 1864 సత్తిరాజు సీతారామయ్య, దేశోపకారి, హిందూసుందరి, లా వర్తమాని మొదలైన పత్రికలను నడిపిన పత్రికా సంపాదకుడు. (మ.1945).
- 1882 సుబ్రహ్మణ్య భారతి, తమిళ కవి, స్వాతంత్ర్యయోధుడు. (మ.1921). భారత్
- 1896 గ్రంధి మంగరాజు, సినిమా పంపిణీదారుడు, నిర్మాత.
- 1922 దిలీప్ కుమార్, భారతీయ చలనచిత్ర నటుడు,నిర్మాత,దర్శకుడు,రాజకీయ నాయకుడు. భారత్
- 1931 ఓషో, భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. (మ.1990). భారత్
- 1934 సలీం దుర్రానీ, భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు. భారత్
- 1935 ప్రణబ్ ముఖర్జీ, భారత 13 వ రాష్ట్రపతి. భారత్
- 1948 రఘువరన్, దక్షిణ భారతదేశానికి చెందిన నటుడు. (మ.2008). భారత్
- 1966 బెనెడిక్టా బొక్కొలి, ఇటాలియన్ సినిమా నటి.
- 1967 మునిమడుగుల రాజారావు, తాత్విక రచయిత.
- 1969 విశ్వనాథన్ ఆనంద్, భారత చదరంగ క్రీడాకాకారుడు. భారత్
- 1995 నభా నటేష్, కన్నడ, తెలుగు, చలన చిత్ర నటి, మోడల్.
మరణాలు
- 1756 థియోడోర్ వాన్ న్యుహాఫ్ జర్మన్ సాహసికుడు. కింగ్ ఆఫ్ కోర్సికా. (జ.1694).
- 1783 రఘునాథరావ్, మరాఠా సామ్రాజ్యానికి చెందిన 13వ పేష్వా. (జ.1734).
- 1967 మెహర్ చంద్ మహాజన్, భారతదేశ మూడవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1889). భారత్
- 2004 ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, భారతదేశ గాయని. (జ.1916). భారత్
- 2011 మల్లెమాల సుందర రామిరెడ్డి, తెలుగు రచయిత, సినీ నిర్మాత. (జ.1924).
- 2013 శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్, మైసూర్ రాజ కుటుంబం యొక్క వారసుడు. (జ.1953).
- 2015 హేమ ఉపాధ్యాయ, మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కళాకారిణి, (జ.1972). భారత్
- 2016 పి.వి. రాజేశ్వర్ రావు: రాజకీయ నాయకుడు, మాజీ ఎంపి. (జ. 1946).
పండుగలు, జాతీయ దినాలు
- అంతర్జాతీయ పర్వత దినోత్సవం.
- యూనిసెఫ్ దినోత్సవం.
- వితంతు పునర్వివాహా దినోత్సవం.