ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

  • 1839 దేశంలోని తీరప్రాంతాలను ప్రచండ తుఫాను కుదిపేసింది. నలభై అడుగుల ఎత్తున విరుచుకుపడిన కడలి కెరటాల్లో 20వేల పడవలు కొట్టుకు పోయాయి. ఊళ్లకు ఊళ్లే మునిగిపోయాయి. కాకినాడకు సమీపంలోని కోరింగా రేవు పట్టణం పూర్తిగా దెబ్బతింది. ఆనాటి ప్రళయంలో దాదాపు మూడులక్షల మంది మరణించి ఉంటారని అంచనా.
  • 1932 ఉస్మానియా పట్టభద్రుల సంఘం ఏర్పడింది. ఎన్నో విద్యాసంస్థలను స్థాపించిన ఈ సంస్థ ఆధ్వర్యంలోనే, ప్రసిద్ధి చెందిన హైదరాబాదు పారిశ్రామిక ప్రదర్శన (Hyderabad Industrial Exhibition) జరుగుతుంది.
  • 2010 ఆంధ్రప్రదేశ్ 16 వ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
  • 2013 మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా దక్షిణాసియాకు ఐరాస మహిళా సౌహార్ద రాయబారిగా సానియా మీర్జా నియమితురాలైంది. పూర్తి ప్రస్థానం →

జననాలు

  • 1926 రంగనాథ్ మిశ్రా, 21వ భారత ప్రధాన న్యాయమూర్తి. (మ. 2012). భారత్
  • 1951 సుధామ, కవి, రచయిత, విమర్శకుడు, కార్టూనిస్టు, పజిల్స్ నిర్మాత.
  • 1952 ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ క్రికెట్ క్రీడాకారుడు.
  • 1954 సౌభాగ్య, కవితాసంపుటి 'సంధ్యాబీభత్సం' ప్రతిష్ఠాత్మక ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డుతో పాటు అనేక పురస్కారాలను అందుకుంది.
  • 1966 రూపా గంగూలీ, భారతీయ సినిమా నటి. భారత్
  • 1968 ముప్పలనేని శివ , తెలుగు చలన చిత్ర దర్శకుడు.
  • 1969 సుకన్య , దక్షిణ భారత చలన చిత్ర నటి. భారత్

మరణాలు

  • 1964 ద్వారం వెంకటస్వామి నాయుడు, వాయులీన విద్వాంసుడు. (జ.1893).
  • 1974 యూ థాంట్, ఐక్యరాజ్య సమితి మూడవ ప్రధాన కార్యదర్శి. (జ.1909).
  • 1984 యశ్వంతరావ్ చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. భారత్
  • 1988 రాచమల్లు రామచంద్రారెడ్డి, తెలుగు సాహితీవేత్త. (జ.1922).
  • 2003 ఇస్మాయిల్, కవి, అధ్యాపకుడు. (జ.1928).
  • 2010 మిద్దె రాములు, ఒగ్గు కథ కళాకారుడు. (జ.1942).
  • 2015 ఆచంట వెంకటరత్నం నాయుడు, తెలుగు పౌరాణిక నాటక నటుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ హంస అవార్డ్ గహీత (జ.1935).
  • 2016 క్యూబా నాయకుడు ఫిడెల్ కాస్ట్రో క్యూబాలో మరణించాడు (జ. 1926).

సినిమా

  • 1983 'ఆడవాళ్లే అలిగితే' చిత్రం విడుదలైంది.

పండుగలు, జాతీయ దినాలు

  • అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినము.
  • ఎన్.సి.సి. దినోత్సవం.
  • జాతీయ జంతు సంక్షేమ దినం.