ఈ రోజు విశేషం
2015 రాజమౌళి తీసిన బాహుబలి: ది బిగినింగ్ జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం పొందిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది.
తెలుగు నాట ఈ రోజు
- 1846 ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 500 మంది బోయ సైనికులతో కోయిలకుంట్ల ఖజానాపై పట్టపగలు దాడి చేశారు. పూర్తి ప్రస్థానం →
- 2015 ప్రభాస్ కథానాయకుడిగా బాహుబలి: ది బిగినింగ్ విడుదలై భారతీయ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. పూర్తి ప్రస్థానం →
- 2015 రాజమౌళి తీసిన బాహుబలి: ది బిగినింగ్ జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం పొందిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1794 పద్మనాభ యుద్ధం జరిగింది.
- 1846 ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 500 మంది బోయసైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి, ఖజానాను దోచుకున్నాడు.
- 1991 భారత లోక్సభ సభాపతిగా శివరాజ్ పాటిల్ పదవిని స్వీకరించాడు. భారత్
- 2008 సల్మాన్ రష్డీ రచించిన నవల "మిడ్నైట్ చిల్డ్రెన్స్" బెస్ట్ ఆఫ్ ది బుకర్ పురస్కారాన్ని గెలుచుకుంది.
- 2010 అమరనాథ్ మంచులింగ దర్శనం కోసం బస్సులో వెళుతున్న ప్రయాణీకులను డ్రైవరు సలీం గఫూర్ రక్షించాడు.
జననాలు
- 1856 నికొలా టెస్లా ఆస్ట్రియా (ఇప్పటి క్రొయాటియా) లో స్మిల్ జాన్ అనే గ్రామంలో పుట్టాడు. (మ 1943). మేగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి కొలమానంగా కొలిచే ప్రమాణాన్ని, ఇతని గౌరవార్ధం టెస్లాగా పిలుస్తున్నారు. ఎమ్.ఆర్.ఐ స్కానింగ్ సమయంలో ఈ టెస్లా పేరు వినపడుతుంది.
- 1916 కోన ప్రభాకరరావు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభాపతి. (మ.1990).
- 1920 పీసపాటి నరసింహమూర్తి, రంగస్థల నటుడు. (మ.2007).
- 1926 అక్కిరాజు వాసుదేవరావు, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.
- 1928 జస్టిస్ అమరేశ్వరి, భారతదేశములో తొలి మహిళా న్యాయమూర్తి. (మ.2009). భారత్
- 1928 గూటాల కృష్ణమూర్తి, 'జుబ్బా లేని అబ్బాయి' అని ఒక చాలా పెద్ద నవల తెలుగులో సంకల్పించి మొదటి ప్రకరణాలేవో రాసినట్లూ, మనదేశం లోని సామాజిక జీవ న అస్తవ్యస్తతలు, అన్యాయాలు, దోపిడీ వ్యవస్థ.
- 1938 తుర్లపాటి రాధాకృష్ణ మూర్తి, రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు.
- 1939 కేతు విశ్వనాథ రెడ్డి, సాహితీవేత్త, విద్యావేత్త. ఈయన ప్రధానంగా కథారచయిత. (మ. 2023).
- 1945 కోట శ్రీనివాసరావు, తెలుగు సినిమా నటుడు(మ.2025).
- 1949 సునీల్ గవాస్కర్, "లిటిల్ మాస్టర్"గా పేరొందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. భారత్
- 1951 మెడియం బాబూరావ్, భద్రాచలం లోక్సభ నియోజకవర్గం నుండి 14 వ లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) లో క్రియాశీల సభ్యులు. భారత్
- 1968 అజీద్ అబ్దుల్ షేక్ తెలుగు రచయిత, ఆంధ్ర ప్రదేశ్ ముస్లిం రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.
- 1980 జెస్సికా సింప్సన్, ఒక అమెరికా గాయని, నటి, బుల్లితెర వ్యాఖ్యాత.
- 1987 బేబీషామిలి, బాలనటిగాగుర్తింపు, దక్షిణ భారత సినీ నటి. భారత్
- 1988 మంజరీ ఫడ్నీస్ , భారతీయ సినీ నటీ.తెలుగు, హిందీ చిత్రాల నటి.
మరణాలు
- 1794 పద్మనాభ యుద్ధంలో ఆ యుద్ధ కథా నాయకుడు రెండవ విజయ రామరాజు గజపతి రాజు మరణం. పద్మనాభంలో ఇతని సమాధి ఉంది.
- 1806 జార్జ్ స్టబ్స్, ఇంగ్లాండుకు చెందిన చిత్రకారుడు. గుర్రాల చిత్రాల ద్వారా పేరొందాడు. (జ.1724).
సినిమా
- 1980 'సూపర్ మేన్' చిత్రం విడుదలైంది.
- 1996 'అదిరింది అల్లుడు' చిత్రం విడుదలైంది.
- 2015 'బాహుబలి: ది బిగినింగ్' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- నికోలా టెస్లా డే.
- జాతీయ చేపల రైతుల దినోత్సవం.