ఈ రోజు విశేషం
2014 విభజిత ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని గుంటూరు–విజయవాడ మధ్య ప్రాంతంలో ఏర్పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రకటించారు.
తెలుగు నాట ఈ రోజు
- 2009 కొణిజేటి రోశయ్య, ఆంధ్రప్రదేశ్ 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.
- 2009 వై.ఎస్.రాజశేఖరరెడ్డి అంత్యక్రియలు కడప జిల్లా ఇడుపులపాయలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. పూర్తి ప్రస్థానం →
- 2014 విభజిత ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని గుంటూరు–విజయవాడ మధ్య ప్రాంతంలో ఏర్పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రకటించారు. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1781 44మంది నివసించటంతో లాస్ ఏంజెల్స్ నగరం, "బహియా డి లాస్ ఫ్యూమ్" (పొగల లోయ - వేలీ ఆఫ్ స్మోక్స్) లో స్థాపించబడింది.
- 1833 మొట్టమొదటి న్యూస్ బాయ్ (దినపత్రికలు ఇంటికి పంచేవాడు) (బార్నీ ఫ్లాహెర్టీ - న్యూయార్క్ సన్ పత్రిక 1833 నుంచి 1950వరకు ప్రచురణ అయ్యింది). దీనిని బట్టి ఈ రోజుని, "పేపర్ బాయ్స్ " అందరూ "ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు" జరుపుకోవచ్చును.
- 1866 మొదటి హవాయిన్ దినపత్రిక ప్రచురణ మొదలు పెట్టారు.
- 1870 తమ రాజును, పదవి నుంచి తొలగించినట్లు, 3వ ప్రెంచి రిపబ్లిక్ ప్రకటించింది.
- 1882 విద్యుత్ కాంతులు వెలిగిన మొట్టమొదటి జిల్లా న్యూయార్క్. (న్యూయార్క్ లోని పెరల్ స్ట్రీట్ స్టేషను).
- 1885 న్యూయార్క్ సిటీలో, మొట్టమొదటి "కేఫ్టీరియ"ను ప్రారంభించారు.
- 1888 జార్జ్ ఈస్ట్మెన్ తన మొదటి "రోల్ ఫిల్మ్" కెమెరాకు పేటెంటు తీసుకుని, కోడక్ సంస్థను రిజిస్టర్ చేసాడు.
- 1933 మొదటిసారిగా విమానం గంటకి 300 మైళ్ళ (483 కి.మీ) వేగాన్ని దాటి ప్రయాణించింది పైలట్లు జె.ఆర్.వెండెల్, గ్లెన్వ్యూ Il.
- 1967 భారతదేశంలోని కొయ్నా డాం దగ్గర జరిగిన భూకంపం (6.5 రెక్టర్ స్కేలు) వలన 200 మంది చనిపోయారు. భారత్
జననాలు
- 1825 దాదాభాయి నౌరోజీ, భారత జాతీయ నాయకుడు. (మ.1917). భారత్
- 1918 కొండేపూడి లక్ష్మీనారాయణ, తెలుగు చలన చిత్రాల మాటలు, పాటల రచయిత,అనువాదకుడు.
- 1924 కె.వి.రఘునాథరెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి. త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు. (మ.2002). భారత్
- 1926 బాలు శంకరన్,ప్రొఫెసర్, శాస్త్రవేత్త , పద్మశ్రీ పద్మవిభూషణ్ అవార్డుల గ్రహీత. (మ.2012).
- 1935 కొమ్మూరి వేణుగోపాలరావు, తెలుగు రచయిత. (మ.2004).
- 1942 కే.రాణీ , నేపథ్య గాయని (మ.2018).
- 1948 అనంత్ నాగ్, భారతీయ చలనచిత్ర నటుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత. భారత్
- 1962 కిరణ్ మోరే, భారత క్రికెట్ జట్టు మాజీ వికెట్ కీపర్. భారత్
- 1973 కొల్లూరి సోమశంకర్, తెలుగు రచయిత, అనువాదకుడు.
- 1980 స్మితా, తెలుగు గాయని, నర్తకి.
- 1987 రితు పాతక్, బాలీవుడ్ నేపథ్య గాయని.
మరణాలు
- 1999 చదలవాడ ఉమేశ్ చంద్ర, ఆంధ్రప్రదేశ్ కి చెందిన పోలీస్ ఉన్నతోద్యోగి. (జ.1966).
- 2007 భమిడిపాటి రాధాకృష్ణ, నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు, హస్య రచయిత. (జ.1929).
- 2007 వై.రుక్మిణి, తెలుగు, తమిళ, హిందీ నటి.
సినిమా
- 2015 'డైనమైట్' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు.
- అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ దినోత్సవం. (తెలంగాణ/ఆంధ్రప్రదేశ్).
- జాతీయ వన్యప్రాణుల దినోత్సవం.