ఈ రోజు విశేషం
1972 త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
సంఘటనలు
- 1972 త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
జననాలు
- 1910 బి.ఎన్.బి.రావు, భారతీయ వైద్యుడు, పరిశోధకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1995). భారత్
- 1915 పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి, నెల్లూరు నగరంలో నడుస్తున్న రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల వ్యవస్థాపకుడు.
- 1939 సత్యమూర్తి, వ్యంగ్య చిత్రాలను, ఇతర చిత్రాలను వేస్తున్న ఇతని పూర్తి పేరు భావరాజు వెంకట సత్యమూర్తి.
- 1959 ఎండ్లూరి సుధాకర్, తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠం, నన్నయ్య ప్రాంగణం రాజమండ్రిలో ఆచార్యుడు, పీఠాధిపతి.
మరణాలు
- 1924 వ్లాదిమిర్ లెనిన్, సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు.
- 1950 జార్జ్ ఆర్వెల్, బ్రిటీష్ రచయిత. భారత్
- 2011 ఇ.వి.వి.సత్యనారాయణ, తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత. (జ.1958).
- 2015 ఎల్కోటి ఎల్లారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (జ.1939).
- 2016 మృణాళినీ సారాభాయి శాస్త్రీయ నృత్య కళాకారిణి (జ.1918).
- 2016 పరశురామ ఘనాపాఠి, వేదపండితుడు. (జ.1914).
- 2022 అఫ్తాబ్ అహ్మద్ ఖాన్ ఐ.పి.ఎస్ అధికారి. మాజీ రాజకీయ నాయకుడు. (జ.1941).
సినిమా
- 2011 'అనగనగా ఓ ధీరుడు' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అవతరణ దినోత్సవం.
- GRANDMOTHER'S DAY జనవరి 21.
- పోలాండ్లో, బామ్మల దినోత్సవాన్ని ఏటా జనవరి 21న జరుపుకుంటారు.
- ప్రపంచ మత దినోత్సవం.
- ప్రపంచ మంచు దినోత్సవం.
- జాతీయ కౌగిలింతల దినోత్సవం.