ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

  • 1918 విశ్వనట చక్రవర్తి ఎస్. వి. రంగారావు కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించారు. పూర్తి ప్రస్థానం →
  • 2003 రాజమౌళి రెండో చిత్రం సింహాద్రి అప్పటి అత్యధిక వసూళ్ల తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. పూర్తి ప్రస్థానం →
  • 2018 ఎస్వీ రంగారావు శతజయంతి ఉత్సవాలు హైదరాబాదులో ప్రారంభం కాగా, ఏలూరులో ఆయన కంచు విగ్రహాన్ని చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. పూర్తి ప్రస్థానం →

సంఘటనలు

  • 1608 క్విబెక్ నగరాన్ని (కెనడా) సామ్యూల్ డి ఛాంప్లేన్ స్థాపిఛాడు.
  • 1767 ఫిలిప్ కార్టెరెట్ నాయకత్వంలో జరిగిన ఒక సాహస యాత్ర లో, రాబర్ట్ పిట్కేర్న్ అనే నావికుడు (మిడ్ షిప్ మాన్), ఒక దీవిని కనిపెట్టాడు. ఆ దీవికి అతని పేరుతోనే పిట్కేర్న్ దీవి అని పేరు పెట్టారు.
  • 1767 అడ్రెస్సీవిసెన్ అనే పేరుగల నార్వే దేశపు వార్తాపత్రిక మొదటిసారిగా ముద్రించారు. ఆ పత్రికను నేటికీ ముద్రిస్తున్నారు.
  • 1819 అమెరికా లోని, న్యూయార్క్ నగరంలో, ది బ్యాంక్ ఆఫ్ సేవింగ్స్ అనే సేవింగ్స్ బ్యాంక్ మొట్టమొదటగా మొదలు పెట్టారు.
  • 1863 అమెరికన్ సివిల్ వార్లో భాగంగా జరిగిన గెట్టిస్ బర్గ్ యుద్ధం అంతమయ్యింది.
  • 1884 డౌ జోన్స్ అండ్ కంపెనీ ముద్రణా సంస్థ మొట్ట మొదటి సారి స్టాక్ ఏవరేజ్ని ముద్రించింది. ఈ సంస్థని ముగ్గురు విలేకరులు ' ఛార్లే స్ డౌ ', 'ఎడ్వర్ద్ జోన్స్ ', 'ఛార్లెస్ బెర్గ్ స్ట్రెస్సెర్ ' మొదలు పెట్టారు.
  • 1886 ' కార్ల్ బెంజ్ ' పేటెంట్ పొందిన 'మోటారు వేగన్ ' ని మొట్ట మొదటి సారిగా అధికారికంగా విడుదల చేసాడు.
  • 1886 మొట్టమొదటి లినో టైపు యంత్రాన్ని (పుస్తక ముద్రణలో వాడే యంత్రం) 'ది న్యూ యార్క్ ట్రిబ్యున్ ' అనే వార్తా పత్రిక వాడింది. అంతకు ముందు, పత్రికా ముద్రణలో, అత్యంత శ్రమతో కూడి, చేతితో కూర్చే ' టైప్ సెట్టింగ్ విధానం ' వాడేవారు.
  • 1890 అమెరికాలో 43వ రాష్ట్రంగా ఇదాహొ చేరింది.
  • 1928 జాన్ లాగీ బేర్డ్ మొదటి రంగుల టెలివిజన్ని ప్రసారం చేసాడు.
  • 1981 న్యూయార్క్ టైమ్స్ పత్రికలో మొట్టమొదటిసారిగా 'కొత్తరకం జబ్బు' గా పేర్కొన్నారు. తరువాత, ఆ జబ్బు కే, ఎయిడ్స్ అని పేరు పెట్టారు.
  • 1988 గల్ఫ్ తీరంలో వున్న అమెరికా యుద్ధ నౌక పొరపాటున ఒక ఇరానియన్ విమానాన్ని కూల్చి వేసింది.
  • 1994 టెక్సాస్ ట్రాఫిక్ చరిత్రలో (రోడ్డు ప్రమాదాలలో ) ఈ రోజున 46 మంది మరణించటం అత్యంత విషాదకరమైన విషయమని టెక్సాస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ చెప్పింది.
  • 1996 స్టోన్ ఆఫ్ స్కోన్ స్కాట్లాండ్ తిరిగి చేరుకుంది.
  • 2001 వ్లాదివోస్తోక్ అవియా తుపొలెవ్ సంస్థకు చెందిన విమానం టి.యు-154 జెట్ లైనర్ రష్యా లోని ఇర్కుత్ స్క్ విమానాశ్రయం సమీపంలో నేలకు దిగుతున్నప్పుడు కూలిపోయి 145 మంది ప్రయాణీకులు మరణించారు.
  • 2006 స్పెయిన్ లోని వేలెన్ సియాలో జరిగిన వేలెన్ సియా మెట్రో ప్రమాదంలో 43మంది మరణించారు.
  • 2006 భూమికి 4,32,308 కిలోమీటర్ల ( 2,68,624 మైళ్ళు) దూరంలో ఆస్టరాయిడ్ 2004 ఎక్స్.పి.14 అనే గ్రహ శకలం ప్రయాణించింది.
  • 2009 మార్క్ II.5 స్కై ట్రెయిన్ పేరు గల కార్లు కెనడా లోని వాన్ కూవర్ మెట్రో నగరంలో ప్రవేశపెట్టారు.

జననాలు

  • 1851 చార్లెస్ బాన్నర్‌మన్, ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు, కుడిచేతి బ్యాట్స్‌మెన్. (మ.1930).
  • 1898 దీవి రంగాచార్యులు, ఆయుర్వేద వైద్యులు. ప్రాచీన హిందూ వైద్యశాస్త్ర పరిశోధకులు. (మ.1976).
  • 1903 నారు నాగ నార్య, సాహితీవేత్త. (మ.1973).
  • 1914 విశ్వనాథశర్మ, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.
  • 1918 ఎస్వీ రంగారావు, తెలుగు సినిమా నటుడు. (మ.1974).
  • 1924 సూర్యదేవర సంజీవదేవ్, తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. (మ.1999).
  • 1924 మారెళ్ల కేశవరావు, వాయులీన విద్వాంసులు. (మ.1993).
  • 1927 బలివాడ కాంతారావు, తెలుగు నవలా రచయిత. (మ.2000).
  • 1928 ఎం. ఎల్. వసంతకుమారి, కర్ణాటక సంగీత విద్వాంసురాలు, దక్షిణ భారత చలనచిత్రరంగంలో ఒక నేపథ్యగాయని. (మ.1990). భారత్
  • 1931 సురభి బాలసరస్వతి, తెలుగు చిత్రాల నాయిక, ప్రతినాయక, హాస్య నటి.
  • 1939 లకంసాని చక్రధరరావు, "తెలుగు వ్యుత్పత్తి కోశం" సంపాదకుడు.
  • 1943 పి.సి.నరసింహారెడ్డి, భాషాశాస్త్రవేత్త, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు.(మ.2020).
  • 1949 అనుమాండ్ల భూమయ్య, తెలుగు కవి.
  • 1951 రిచర్డ్ హాడ్లీ, న్యూజీలాండ్ క్రికెట్ ఆటగాడు.
  • 1962 టామ్ క్రూజ్, అమెరికా దేశ నటుడు, చలన చిత్ర నిర్మాత.
  • 1971 జూలియన్ అసాంజే, ఆస్ట్రేలియన్ ప్రచురణకర్త, పాత్రికేయుడు, మాద్యమ, అంతర్జాల వ్యవస్థాపకుడు, మాద్యమ విమర్శకుడు, రచయిత, కంప్యూటర్ ప్రోగ్రామర్, రాజకీయ, అంతర్జాల కార్యకర్త.
  • 1980 హర్భజన్ సింగ్, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు. భారత్

మరణాలు

  • 1910 రావిచెట్టు రంగారావు, తెలంగాణలో విద్యావ్యాప్తికి విశేష కృషిచేసిన వాడు. (జ.1877).
  • 1996 చకిలం శ్రీనివాసరావు, నల్గొండ లోక్‌సభ సభ్యులు. (జ.1922).
  • 2015 తెన్నేటి విద్వాన్, రచయిత, సామాజిక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1924). భారత్
  • 2016 స్వర్ణలతా నాయుడు, తెలుగు కవయిత్రి. (జ.1975).

సినిమా

  • 1990 'మహాజనానికి మరదలుపిల్ల' చిత్రం విడుదలైంది.
  • 2003 'సింహాద్రి' చిత్రం విడుదలైంది.

పండుగలు, జాతీయ దినాలు

  • నేషనల్ ప్రైడ్ క్లామ్ డే.
  • అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం.