ఈ రోజు విశేషం
1927 మహారాష్ట్రలోని రాయ్ఘర్ జిల్లాలోని మహాద్ ప్రాంతంలో అంబేద్కర్, అతని అనుచరులు 1927 డిసెంబరు 25న అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ మనుస్మృతి ప్రతిని తగలబెట్టారు.
సంఘటనలు
- 1927 మహారాష్ట్రలోని రాయ్ఘర్ జిల్లాలోని మహాద్ ప్రాంతంలో అంబేద్కర్, అతని అనుచరులు 1927 డిసెంబరు 25న అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ మనుస్మృతి ప్రతిని తగలబెట్టారు. భారత్
- 2000 రూ.60వేల కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన గ్రామీణ రహదారుల పథకం, అంత్యోదయ అన్న పథకాలను అప్పటి ప్రధాని వాజ్పేయి ప్రారంభించారు. భారత్
- 2007 గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడి మూడవసారి ప్రమాణస్వీకారం. భారత్
- 2010 దేశీయ క్రయోజనిక్ ఇంజన్తో ఇస్రో చేపట్టిన తొలి జీఎస్ఎల్వీ-ఎఫ్06 ప్రయోగం జీశాట్-5పీ ఉపగ్రహంతో సహా విఫలమైంది. భారత్ పూర్తి ప్రస్థానం →
జననాలు
- 1861 మదన్ మోహన్ మాలవ్యా, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1946). భారత్
- 1876 భారత్ ను విభజించి పాకిస్తాన్ ను ఏర్పాటు చేసిన నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా (మ.1948). భారత్
- 1901 తుమ్మల సీతారామమూర్తి, ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడు. అభినవ తిక్కన బిరుదాంకితుడు/[మ.1990].
- 1910 కల్లూరి తులశమ్మ, సంఘసేవకురాలు, ఖాదీ ఉద్యమ నాయకురాలు. (మ.2001).
- 1917 ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, కవయిత్రి, పరిశోధకురాలు, గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీత (మ.1996).
- 1924 అటల్ బిహారీ వాజపేయి, పూర్వ భారత ప్రధానమంత్రి. (మ.2018). భారత్
- 1927 రాం నారాయణ్, హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కళాకారుడు. భారత్
- 1933 పటేల్ అనంతయ్య, ఉర్దూ అకాడెమీ "తెలుగు - ఉర్దూ నిఘంటువు" ప్రాజెక్టుకు డైరెక్టర్గా వ్యవహరించాడు. ఆకాశవాణిలో బాలగేయాలు, జాతీయ కవితానువాదాలు ప్రసారం చేశాడు.
- 1936 ఇస్మాయిల్ మర్చెంట్, భారతదేశంలో జన్మించిన సినీ నిర్మాత, సుదీర్ఘ కాలంలో మర్చెంట్ ఐవరీ ప్రొడక్షన్స్తో అనుబంధం కలిగి ఉన్న వ్యక్తిగా బాగా సుపరిచితుడు. భారత్
- 1950 ఆనం వివేకానందరెడ్డి, ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయనాయకుడు. (మ.2018).
- 1951 చంద్రకళ, తెలుగు చలన చిత్ర నటి, నిర్మాత. (మ.1999).
- 1956 ఎన్.రాజేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మేల్యే. (మ.2011).
- 1971 ఎ.కరుణాకర్, చలన చిత్ర దర్శకుడు.
- 1974 నగ్మా, తెలుగు, తమిళ, చిత్రాల నటి, రాజకీయ నాయకురాలు.
- 1977 ప్రియా రాయ్, భారతీయ సంతతికి చెందిన అమెరికన్ నీలి చిత్రాల నటి. భారత్
- 1991 సుహాని కలిత, తెలుగు, హిందీ, మలయాళ, బెంగాలీ చిత్రాల నటి.
మరణాలు
- 1846 స్వాతి తిరునాళ్, కేరళలోని తిరువంకూరు మహారాజు, గొప్ప భక్తుడు, రచయిత. (జ.1813). భారత్
- 1970 దాడి గోవిందరాజులు నాయుడు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ నాటకాలలో స్త్రీ పురుష పాత్రధారి. (జ.1909).
- 1972 చక్రవర్తి రాజగోపాలాచారి, భారతదేశపు చివరి గవర్నర్ జనరల్. (జ.1878). భారత్
- 1972 కాకాని వెంకటరత్నం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి.
- 1996 హరిత కౌర్ డియోల్, భారత ఎయిర్ ఫోర్సుకు చెందిన మొట్టమొదటి మహిళా పైలట్. (జ.1972). భారత్
- 1997 జోస్యం జనార్దనశాస్త్రి, అభినవ వేమన బిరుదాంకితుడు, అష్టావధాని (జ.1911).
- 1998 పెనుమర్తి విశ్వనాథశాస్త్రి, తెలుగు వచన కవితా ప్రవీణులు.
- 2009 అజిత్ నాథ్ రే, భారతదేశ సుప్రీంకోర్టు పద్నాల్గవ ప్రధాన న్యాయమూర్తి. (జ. 1912). భారత్
- 2011 ఇలపావులూరి పాండురంగారావు, హిందీ సంస్కృత రచనలను తెలుగులోనికి, తెలుగు నుండి హిందీ, ఇంగ్లీషు భాషలకు అనేక పుస్తకాలను అనుసృజించాడు. (జ.1930).
- 2015 మెట్ల సత్యనారాయణ రావు, రాజకీయనాయకుడు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (జ.1942).
- 2022 తమ్మారెడ్డి చలపతిరావు, సినిమా నటుడు (జ.1944).
- 2024 ఎం.టి.వాసుదేవన్ నాయర్, కేరళ రచయిత, పద్మభూషణ్, జ్ఞానపీఠ పురస్కారాల గ్రహీత. (జ.1933). భారత్
సినిమా
- 1970 'ఒకే కుటుంబం' చిత్రం విడుదలైంది.
- 1992 'అశ్వమేధం (1992 సినిమా)' చిత్రం విడుదలైంది.
- 2015 'భలే మంచి రోజు' చిత్రం విడుదలైంది.
- 2016 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రం విడుదలైంది.
- 2024 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- ప్రపంచ క్రిస్మస్ పండగ రోజు.
- జాతీయ సుపరిపాలన దినోత్సవం.