ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 12 హైతీలో భారీ భూకంపం సంభవించి వేలాది మంది మృతిచెందారు.
  • జనవరి 16 ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌గా ఇ.ఎస్.ఎల్.నరసింహన్ నియమించబడ్డాడు.
  • జనవరి 20 నైజీరియాలో మతఘర్షణలు చెలరేగి 200 మంది మృతిచెందారు.
  • జనవరి 25 ఇథియోపియాకు చెందిన విమానం మధ్యధరా సముద్రములో కూలిపోయి 90 మంది మృతిచెందారు.
  • జనవరి 26 ఐదు దశాబ్దాలకు పైగా తెలుగు తెరపై సాత్విక పాత్రలకు జీవం పోసిన నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు హైదరాబాదులో మరణించారు.
  • ఫిబ్రవరి 2 సమాజ్‌వాదీ పార్టీ నుంచి జయప్రద బహిష్కరణకు గురయ్యారు. భారత్
  • ఫిబ్రవరి 20 తెలుగు తెరపై ఆరు దశాబ్దాలు హాస్యం పండించిన నటుడు పద్మనాభం చెన్నైలో గుండెపోటుతో మరణించారు.
  • మార్చి 5 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా జి.కిషన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
  • ఏప్రిల్ 1 RTE- విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం.. edit by. మాధవ చారి.
  • ఏప్రిల్ 12 లూధియానా, పంజాబ్, లో గల గురునానక్ స్టేడియంలో భారతీయ కబడ్డీ జట్తు పాకిస్థాన్ జట్టును 58-24 తేడాతో ఓడించి ప్రప్రథమంగా ప్రపంచ కప్ కబడ్డీ పోటీలను గెలుచుకుంది. భారత్
  • ఏప్రిల్ 12 టెన్నిస్ తార సానియా మీర్జా పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను హైదరాబాద్‌లో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంది.
  • ఏప్రిల్ 14 చైనాలోని కిఘై ప్రావిన్సులో భారీ భూకంపం సంభవించి 400 మంది మరణించారు.
  • ఏప్రిల్ 24 దగ్గుబాటి వెంకటేష్ మణప్పురం సంస్థకు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పందం చేసుకున్నారు.
  • ఏప్రిల్ 30 'సింహా' చిత్రానికి గాను నందమూరి బాలకృష్ణ నంది ఉత్తమ నటుడి పురస్కారం పొందారు.
  • మే 10 చత్తీస్ ఘర్ రాష్ట్రంలో, లేండ్ మైన్ (భూమి లోపల పాతిన బాంబు) పేలి, ఎనిమిది మంది మరణించారు.
  • మే 10 రష్యా తన విజయ దినాన్ని జరుపుకుంది.
  • మే 12 బ్రిటన్ ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన డేవిడ్ కామెరాన్ ప్రమాణస్వీకారం చేశాడు. భారత్
  • మే 12 'ఆఫ్రిఖియా ఏర్‌వేస్' కి చెందిన విమానం కూలి అందరూ మరణించారు ఒక్కడు తప్ప.
  • మే 20 యు ట్యూబ్, ఫేస్ బుక్ లను పాకిస్తాన్ నిషేధించింది.
  • మే 22 మంగళూరు విమానాశ్రయంలో విమానం కూలి 158 మంది మృతిచెందారు.
  • జూన్ 4 జపాన్ ప్రధానమంత్రిగా నవోతో కాన్ ఎంపికయ్యాడు. భారత్
  • జూన్ 11 19వ ప్రపంచ కప్ సాకర్ పోటీలు దక్షిణాఫ్రికాలో ప్రారంభమయ్యాయి.
  • జూన్ 20 సైనా నెహ్వాల్ సింగపూర్ ఓపెన్ గెలిచి రెండు సూపర్ సిరీస్ టైటిళ్లు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచారు.
  • జూన్ 24 షట్లర్ సైనా నెహ్వాల్ ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో కెరీర్ అత్యుత్తమ మూడో స్థానానికి చేరారు.
  • జూలై 8 వై.ఎస్.రాజశేఖరరెడ్డి గౌరవార్థం కడప జిల్లా పేరును వైఎస్సార్ జిల్లాగా మార్చారు.
  • జూలై 10 అమరనాథ్ మంచులింగ దర్శనం కోసం బస్సులో వెళుతున్న ప్రయాణీకులను డ్రైవరు సలీం గఫూర్ రక్షించాడు.
  • జూలై 15 షట్లర్ సైనా నెహ్వాల్ ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకారు.
  • ఆగస్టు 11 విశాఖపట్నం బార్ అసోసియేషన్ కి 2010-11 సంవత్సరానికి, బుధవారం ఎన్నికలు జరిగాయి.
  • ఆగస్టు 12 అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని బాలికలకు యవ్వనం తొందరగా వస్తున్నదని, అందుకని, ఆ బాలికల ఆరోగ్యం ప్రమాదకరం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది.
  • ఆగస్టు 12 రంజాన్ భారతదేశంలో ఈ సంవత్సరంలో నేటితో ప్రారంభమవుతుంది. భారత్
  • ఆగస్టు 30 డైరెక్ట్ టాక్సెస్ కోడ్ 2010ని లోక్ సభలో ప్రవేశపెట్టారు.
  • సెప్టెంబరు 30 అయోధ్యలోని బాబ్రీ మసీదు రామ మందిర వివాదంపై ప్రయాగ్‌రాజ్ హైకోర్టు యొక్క లక్నో బెంచ్, ఆ వివాదాస్పద నేలను మూడు ముక్కలుగా వేరు చేసి, రామ్ లల్లా, నిర్మోహి అఖారా, వక్ఫ్ బోర్డులకు ఒక్కొక్కటి చొప్పున ఇచ్చింది.
  • నవంబరు 25 ఆంధ్రప్రదేశ్ 16 వ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
  • నవంబరు 29 ఓదార్పు యాత్రపై విభేదాలతో జగన్మోహన్ రెడ్డి లోక్‌సభ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
  • డిసెంబరు 7 45 రోజుల్లో కొత్త పార్టీ పెడతానని జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ప్రకటించారు.
  • డిసెంబరు 12 సైనా నెహ్వాల్ హాంకాంగ్ ఓపెన్ గెలిచి తన కెరీర్‌లో నాలుగో సూపర్ సిరీస్ టైటిల్ సాధించారు.
  • డిసెంబరు 16 శ్రీకృష్ణ కమిటీ గడువుకు ముందు వరంగల్‌లో టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభకు 26 లక్షల మందికి పైగా హాజరయ్యారు.
  • డిసెంబరు 25 దేశీయ క్రయోజనిక్ ఇంజన్‌తో ఇస్రో చేపట్టిన తొలి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్06 ప్రయోగం జీశాట్-5పీ ఉపగ్రహంతో సహా విఫలమైంది. భారత్
  • డిసెంబరు 31 ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో పరిష్కారం కాని కేసులు 1,98,056. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని మూడు ప్రాంతాల లోని (రాయలసీమ, కోస్తా, తెలంగాణ) దిగువ స్థాయి కోర్టులలో, పరిష్కారం కాని కేసులు 9,63,190.

మరణాలు

  • జనవరి 17 జ్యోతిబసు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1914). భారత్
  • జనవరి 22 చిల్లర భావనారాయణ రావు, నాటక రచయిత, సినీ రచయిత (జ.1925).
  • జనవరి 26 తెలుగు సినీనటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు (జ.1927).
  • జనవరి 27 దాసరి సుబ్రహ్మణ్యం, చందమామ కథా రచయిత, చందమామ తొలితరం సంపాదకవర్గ సభ్యుడు.
  • జనవరి 29 రాం నివాస్ మీర్థా, భారతదేశపు మాజీ కేంద్ర మంత్రి. భారత్
  • జనవరి 29 చోళ లింగయ్య, తెలంగాణ పోరాటయోధుడు.
  • ఫిబ్రవరి 10 భారత ఆర్థికవేత్త, తొలి ప్రణాళికా సంఘం సభ్యుడు కె.ఎన్.రాజ్. భారత్
  • ఫిబ్రవరి 11 లక్ష్మీదేవమ్మ, ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ.
  • ఫిబ్రవరి 14 నవలా రచయిత డిక్ ఫ్రాన్సిస్.
  • ఫిబ్రవరి 20 బి.పద్మనాభం , తెలుగు సినిమా, రంగస్థలనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, హాస్య నటుడు. (జ.1931).
  • ఫిబ్రవరి 21 చామర్తి కనకయ్య, కనక్ ప్రవాసి అనే కలం పేరుతో తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితుడు. (జ.1933).
  • ఫిబ్రవరి 25 కాటం లక్ష్మీనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు. (జ.1924).
  • మార్చి 1 తాడూరి బాలాగౌడ్, భారత జాతీయ కాంగ్రేస్ నాయకుడు, నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం సభ్యుడు. (జ.1931).
  • మార్చి 15 కోనేరు రంగారావు, కాంగ్రేసు పార్టీ రాజకీయనాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ మాజీమంత్రి. (మ.2010).
  • మార్చి 20 గిరిజాప్రసాద్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధానమంత్రి. భారత్
  • ఏప్రిల్ 3 భండారు సదాశివరావు, రచయిత, సంపాదకుడు, ఆర్.ఎస్.ఎస్. ప్రచారకుడు. (జ.1925).
  • ఏప్రిల్ 6 గౌతమ్ వాఘేలా, భారతీయ కళాకారుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత (జ.1936). భారత్
  • ఏప్రిల్ 7 భమిడిపాటి రామగోపాలం, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. (జ. 1932).
  • ఏప్రిల్ 11 పైల వాసుదేవరావు, శ్రీకాకుళం నక్సలెట్ ఉద్యమ యోధుడు. (జ.1932).
  • మే 15 భైరాన్ సింగ్ షెకావత్, భారత మాజీ ఉప రాష్ట్రపతి. (జ.1923). భారత్
  • మే 22 వేటూరి సుందరరామ్మూర్తి, సుప్రసిద్ధ తెలుగు సిసిమా పాటల రచయిత. (జ.1936).
  • మే 30 బలరాం నందా, భారత చరిత్రకారుడు. భారత్
  • జూన్ 15 మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము, కవి, రచయిత, చిత్రకారుడు. (జ.1926).
  • ఆగస్టు 1 కె.ఎం.మాథ్యూ, మలయాళ మనోరమ దినపత్రిక సంపాదకుడు. (జ.1917).
  • ఆగస్టు 8 సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, సంఘసేవకురాలు. (జ.1914). భారత్
  • ఆగస్టు 14 ఈడుపుగంటి వెంకట సుబ్బారావు, వ్యవసాయ శాస్త్రవేత్త. (జ.1934).
  • ఆగస్టు 27 కంభంపాటి స్వయంప్రకాష్, ఆయుర్వేద వైద్యుడు, లైంగిక వ్యాధుల నిపుణుడు. (జ.1962).
  • సెప్టెంబరు 5 హోమీ సేత్నా, భారతీయ శాస్త్ర పరిశోధకుడు. (జ.1923). భారత్
  • సెప్టెంబరు 12 స్వర్ణలత, దక్షిణ భారత గాయని. (జ.1973). భారత్
  • సెప్టెంబరు 23 కె.బి. తిలక్, స్వాతంత్ర్య సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత. (జ.1926). భారత్
  • సెప్టెంబరు 23 భావరాజు సర్వేశ్వరరావు, భారత ఆర్థిక వేత్త, సామాజిక శాస్త్రవేత్త. (జ.1915). భారత్
  • సెప్టెంబరు 24 సింహాద్రి సత్యనారాయణ, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. (జ.1929).
  • అక్టోబరు 14 సాయి శ్రీహర్ష, తెలుగు సినీ గీత రచయిత (జ.1961).
  • అక్టోబరు 20 పాగ పుల్లారెడ్డి, గద్వాల పురపాలక సంఘ చైర్మెన్ గా, బాలభవన్ లాంటి సంస్థల అభివృద్ధికి పాటుపడ్డాడు. (జ.1919).
  • అక్టోబరు 24 చెరుకూరి లెనిన్, ధనుర్ విద్యా శిక్షకుడిగా చిన్న వయసులోనే పేరు తెచ్చుకున్నాడు.
  • నవంబరు 2 ఎ .హెచ్.వి. సుబ్బారావు, పాత్రికేయుడు. (జ.1934).
  • నవంబరు 13 డి.వి.యస్.రాజు, తెలుగు సినిమా నిర్మాత, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు. (జ.1928).
  • నవంబరు 25 మిద్దె రాములు, ఒగ్గు కథ కళాకారుడు. (జ.1942).
  • డిసెంబరు 8 నారాయణరావు పవార్, తెలంగాణా విమోచనోద్యమ నాయకుడు. (జ.1926).
  • డిసెంబరు 12 బి.ఎస్.రంగా , తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, చిత్రాల ఛాయాగ్రాహకుడు, దర్శకుడు(జ.1917).
  • డిసెంబరు 26 ఏ.వి.సుబ్బారావు, తెలుగు రంగస్థల నటుడు, పద్య గాయకుడు. (జ.1930).

సినిమా

  • జనవరి 22 'సీతా రాముల కల్యాణం' చిత్రం విడుదలైంది.
  • ఫిబ్రవరి 26 'కళావర్ కింగ్' చిత్రం విడుదలైంది.
  • మార్చి 19 'యాగం' చిత్రం విడుదలైంది.
  • ఏప్రిల్ 30 'సింహా' చిత్రం విడుదలైంది.
  • మే 27 'గోలీమార్' చిత్రం విడుదలైంది.
  • జూలై 1 'ఝుమ్మందినాదం' చిత్రం విడుదలైంది.
  • జూలై 16 'స్నేహగీతం' చిత్రం విడుదలైంది.
  • ఆగస్టు 27 'గుడు గుడు గుంజం' చిత్రం విడుదలైంది.
  • అక్టోబరు 7 'ఖలేజా' చిత్రం విడుదలైంది.
  • అక్టోబరు 15 'Kiccha Huccha' చిత్రం విడుదలైంది.
  • అక్టోబరు 29 'బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం' చిత్రం విడుదలైంది.
  • నవంబరు 15 'కర్మ (2010 సినిమా)' చిత్రం విడుదలైంది.
  • డిసెంబరు 3 'రక్త చరిత్ర 2' చిత్రం విడుదలైంది.
  • డిసెంబరు 31 'బ్రోకర్' చిత్రం విడుదలైంది.

ఈ సంవత్సరపు ప్రస్థానాలు