జనవరి 12 హైతీలో భారీ భూకంపం సంభవించి వేలాది మంది మృతిచెందారు.
జనవరి 16 ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా ఇ.ఎస్.ఎల్.నరసింహన్ నియమించబడ్డాడు.
జనవరి 20 నైజీరియాలో మతఘర్షణలు చెలరేగి 200 మంది మృతిచెందారు.
జనవరి 25 ఇథియోపియాకు చెందిన విమానం మధ్యధరా సముద్రములో కూలిపోయి 90 మంది మృతిచెందారు.
జనవరి 26 ఐదు దశాబ్దాలకు పైగా తెలుగు తెరపై సాత్విక పాత్రలకు జీవం పోసిన నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు హైదరాబాదులో మరణించారు.
ఫిబ్రవరి 2 సమాజ్వాదీ పార్టీ నుంచి జయప్రద బహిష్కరణకు గురయ్యారు.
భారత్
ఫిబ్రవరి 20 తెలుగు తెరపై ఆరు దశాబ్దాలు హాస్యం పండించిన నటుడు పద్మనాభం చెన్నైలో గుండెపోటుతో మరణించారు.
మార్చి 5 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా జి.కిషన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
ఏప్రిల్ 1 RTE- విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం.. edit by. మాధవ చారి.
ఏప్రిల్ 12 లూధియానా, పంజాబ్, లో గల గురునానక్ స్టేడియంలో భారతీయ కబడ్డీ జట్తు పాకిస్థాన్ జట్టును 58-24 తేడాతో ఓడించి ప్రప్రథమంగా ప్రపంచ కప్ కబడ్డీ పోటీలను గెలుచుకుంది.
భారత్
ఏప్రిల్ 12 టెన్నిస్ తార సానియా మీర్జా పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను హైదరాబాద్లో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంది.
ఏప్రిల్ 14 చైనాలోని కిఘై ప్రావిన్సులో భారీ భూకంపం సంభవించి 400 మంది మరణించారు.
ఏప్రిల్ 24 దగ్గుబాటి వెంకటేష్ మణప్పురం సంస్థకు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్గా ఒప్పందం చేసుకున్నారు.
ఏప్రిల్ 30 'సింహా' చిత్రానికి గాను నందమూరి బాలకృష్ణ నంది ఉత్తమ నటుడి పురస్కారం పొందారు.
మే 10 చత్తీస్ ఘర్ రాష్ట్రంలో, లేండ్ మైన్ (భూమి లోపల పాతిన బాంబు) పేలి, ఎనిమిది మంది మరణించారు.
మే 12 బ్రిటన్ ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన డేవిడ్ కామెరాన్ ప్రమాణస్వీకారం చేశాడు.
భారత్
మే 12 'ఆఫ్రిఖియా ఏర్వేస్' కి చెందిన విమానం కూలి అందరూ మరణించారు ఒక్కడు తప్ప.
మే 20 యు ట్యూబ్, ఫేస్ బుక్ లను పాకిస్తాన్ నిషేధించింది.
మే 22 మంగళూరు విమానాశ్రయంలో విమానం కూలి 158 మంది మృతిచెందారు.
జూన్ 4 జపాన్ ప్రధానమంత్రిగా నవోతో కాన్ ఎంపికయ్యాడు.
భారత్
జూన్ 11 19వ ప్రపంచ కప్ సాకర్ పోటీలు దక్షిణాఫ్రికాలో ప్రారంభమయ్యాయి.
జూన్ 20 సైనా నెహ్వాల్ సింగపూర్ ఓపెన్ గెలిచి రెండు సూపర్ సిరీస్ టైటిళ్లు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచారు.
జూన్ 24 షట్లర్ సైనా నెహ్వాల్ ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో కెరీర్ అత్యుత్తమ మూడో స్థానానికి చేరారు.
జూలై 8 వై.ఎస్.రాజశేఖరరెడ్డి గౌరవార్థం కడప జిల్లా పేరును వైఎస్సార్ జిల్లాగా మార్చారు.
జూలై 10 అమరనాథ్ మంచులింగ దర్శనం కోసం బస్సులో వెళుతున్న ప్రయాణీకులను డ్రైవరు సలీం గఫూర్ రక్షించాడు.
జూలై 15 షట్లర్ సైనా నెహ్వాల్ ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి ఎగబాకారు.
ఆగస్టు 11 విశాఖపట్నం బార్ అసోసియేషన్ కి 2010-11 సంవత్సరానికి, బుధవారం ఎన్నికలు జరిగాయి.
ఆగస్టు 12 అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని బాలికలకు యవ్వనం తొందరగా వస్తున్నదని, అందుకని, ఆ బాలికల ఆరోగ్యం ప్రమాదకరం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది.
ఆగస్టు 12 రంజాన్ భారతదేశంలో ఈ సంవత్సరంలో నేటితో ప్రారంభమవుతుంది.
భారత్
ఆగస్టు 30 డైరెక్ట్ టాక్సెస్ కోడ్ 2010ని లోక్ సభలో ప్రవేశపెట్టారు.
సెప్టెంబరు 30 అయోధ్యలోని బాబ్రీ మసీదు రామ మందిర వివాదంపై ప్రయాగ్రాజ్ హైకోర్టు యొక్క లక్నో బెంచ్, ఆ వివాదాస్పద నేలను మూడు ముక్కలుగా వేరు చేసి, రామ్ లల్లా, నిర్మోహి అఖారా, వక్ఫ్ బోర్డులకు ఒక్కొక్కటి చొప్పున ఇచ్చింది.
నవంబరు 25 ఆంధ్రప్రదేశ్ 16 వ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
నవంబరు 29 ఓదార్పు యాత్రపై విభేదాలతో జగన్మోహన్ రెడ్డి లోక్సభ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
డిసెంబరు 7 45 రోజుల్లో కొత్త పార్టీ పెడతానని జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ప్రకటించారు.
డిసెంబరు 12 సైనా నెహ్వాల్ హాంకాంగ్ ఓపెన్ గెలిచి తన కెరీర్లో నాలుగో సూపర్ సిరీస్ టైటిల్ సాధించారు.
డిసెంబరు 16 శ్రీకృష్ణ కమిటీ గడువుకు ముందు వరంగల్లో టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభకు 26 లక్షల మందికి పైగా హాజరయ్యారు.
డిసెంబరు 25 దేశీయ క్రయోజనిక్ ఇంజన్తో ఇస్రో చేపట్టిన తొలి జీఎస్ఎల్వీ-ఎఫ్06 ప్రయోగం జీశాట్-5పీ ఉపగ్రహంతో సహా విఫలమైంది.
భారత్
డిసెంబరు 31 ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో పరిష్కారం కాని కేసులు 1,98,056. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని మూడు ప్రాంతాల లోని (రాయలసీమ, కోస్తా, తెలంగాణ) దిగువ స్థాయి కోర్టులలో, పరిష్కారం కాని కేసులు 9,63,190.
మరణాలు
జనవరి 17 జ్యోతిబసు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1914).
భారత్
జనవరి 22 చిల్లర భావనారాయణ రావు, నాటక రచయిత, సినీ రచయిత (జ.1925).
జనవరి 26 తెలుగు సినీనటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు (జ.1927).
జనవరి 27 దాసరి సుబ్రహ్మణ్యం, చందమామ కథా రచయిత, చందమామ తొలితరం సంపాదకవర్గ సభ్యుడు.
జనవరి 29 రాం నివాస్ మీర్థా, భారతదేశపు మాజీ కేంద్ర మంత్రి.
భారత్