ఆనాడు Aanaadu

ప్రస్థానం

జీవిత చరిత్రలు

పద్మనాభం (Padmanabham)

1931 – 2010

బసవరాజు వెంకట పద్మనాభరావు పద్మనాభంగా తెలుగు తెరపై ఆరు దశాబ్దాలు హాస్యం పండించిన నటుడు, నిర్మాత, దర్శకుడు. 400కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన రేఖా అండ్ మురళి ఆర్ట్స్ సంస్థ ద్వారా నిర్మాతగానూ రాణించారు. గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని సినీరంగానికి పరిచయం చేసింది ఆయనే.

  1. 1931 ఆగస్టు 20

    హాస్యనటుడు పద్మనాభం కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామంలో జన్మించారు.

  2. 1936

    ఐదేళ్ల వయసులో చింతామణి నాటకంలో కృష్ణుడి వేషం వేసిన పద్మనాభం వెండికప్పు బహుమతిగా పొందారు.

  3. 1945

    గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలోని మాయలోకం చిత్రంతో పద్మనాభం బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేశారు.

  4. 1947

    రాధిక చిత్రంలో పద్మనాభం కృష్ణ పాత్ర పోషించడంతో పాటు నేపథ్య గానం కూడా చేశారు.

  5. 1951

    పాతాళభైరవి చిత్రంలో సదాజపుడి పాత్రతో పద్మనాభం విజయా సంస్థ శాశ్వత కళాకారుల్లో ఒకరిగా స్థిరపడ్డారు.

  6. 1954

    సతీ అనసూయ చిత్రంతో మొదలుపెట్టి పద్మనాభం పలు చిత్రాల్లో నారదుడి పాత్రలు పోషించారు.

  7. 1964

    పద్మనాభం రేఖా అండ్ మురళి ఆర్ట్స్ చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు.

  8. 1967

    పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రం ద్వారా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాయకుడిగా పరిచయమయ్యారు.

  9. 1968

    శ్రీరామకథ చిత్రాన్ని నిర్మించి పద్మనాభం దర్శకత్వం కూడా వహించారు.

  10. 1970

    పద్మనాభం నిర్మించిన కథానాయిక మొల్ల చిత్రం బంగారు నంది అవార్డు పొందింది.

  11. 2010 ఫిబ్రవరి 20

    తెలుగు తెరపై ఆరు దశాబ్దాలు హాస్యం పండించిన నటుడు పద్మనాభం చెన్నైలో గుండెపోటుతో మరణించారు.