ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

  • 1921 టంగుటూరి ప్రకాశం స్వరాజ్య దినపత్రికను ప్రారంభించారు. పూర్తి ప్రస్థానం →
  • 1989 విజయవాడలో మొదటి పుస్తక ప్రదర్శన నిర్వహించారు.
  • 2005 తెలంగాణలో నల్గొండ దగ్గరి వలిగొండ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో రేపల్లె, సికిందరాబాదు డెల్టా పాసెంజరు యొక్క ఇంజను, 8 పెట్టెలు పట్టాలు తప్పి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో పడి పోయాయి. 200 మందికి పైగా మరణించి ఉంటారని అంచనా.

సంఘటనలు

  • ఢిల్లీలో జరిగిన మూడు వరుస పేలుళ్ళలో 70 మంది మరణించారు. 200 మంది గాయపడ్డారు. ఒక బస్సులో ఉంచిన పేలుడు పదార్ధాలను గుర్తించిన డ్రైవరు, కండక్టరు వాటిని బయటకు విసిరి వేయడంతో నాలుగో పేలుడు తప్పింది. భారత్
  • 1963 స్టార్ ఆఫ్ ఇండియాతో సహా ఎన్నో విలువైన రత్నాలు న్యూయార్కు లోని అమెరికన్ మ్యూజియం నుండి దొంగిలించబడ్డాయి. భారత్
  • 1971 తుపాను తాకిడికి ఒడిషాలో 10, 000 మంది మరణించారు.
  • 1996 ప్రపంచం లోనే అరుదైన మానవ తయారీ యురేనియంతో పనిచేసే 30 మె.వా. అణు రియాక్టర్ తమిళనాడు లోని కల్పక్కంలో పని చెయ్యడం ప్రారంభమయింది. భారత్
  • 2007 బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 20, 000 దాటి రికార్డు సృష్టించింది.

జననాలు

  • 1017 హెన్రీ III, రోమన్ చక్రవర్తి.
  • 1899 నాయని సుబ్బారావు, తొలితరం తెలుగు భావకవి, భారత స్వాతంత్ర్యసమరయోధుడు. (మ.1978).
  • 1950 తల్లావజ్ఝుల సుందరం, రంగస్థల నటుడు, దర్శకుడు, ప్రయోక్త, కథ, నవలా రచయిత. (మ.2022).
  • 1961 కొణిదల నాగేంద్రబాబు, తెలుగు సినిమా నటుడు, నిర్మాత.
  • 1976 రాఘవ లారెన్స్, నృత్య దర్శకుడు, సంగీత దర్శకుడు, నటుడు, దర్శకుడు.
  • 1981 రీమాసేన్, భారతీయ సినిమా నటి. భారత్
  • 1986 శ్రీదేవి విజయ్ కుమార్, తమిళ, తెలుగు, కన్నడ, నటి.
  • 1991 హరిప్రియ, భరత నాట్య కళాకారిణి, మోడల్, దక్షిణ భారతీయ సినీ నటీ. భారత్

మరణాలు

  • 1940 కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, తెలుగు రచయిత. (జ.1863).
  • 1953 ఘంటసాల బలరామయ్య, తెలుగు సినిమా నిర్మాత, దర్శకులు. (జ.1906).
  • 2002 మహేష్ మహదేవన్ , సంగీత దర్శకుడు.(జ.1955).

సినిమా

  • 2005 'మొగుడ్స్ పెళ్ళామ్స్' చిత్రం విడుదలైంది.
  • 2010 'బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం' చిత్రం విడుదలైంది.

పండుగలు, జాతీయ దినాలు

  • జాతీయ పిల్లుల (క్యాట్) రోజు.
  • ప్రపంచ స్ట్రోక్ డే.