1866 ప్రస్తుత అలహాబాదు హైకోర్టు (ఆగ్రా హైకోర్టుగా) స్థాపించబడింది.
1935 అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని అల్పైన్ నగరంలో మొట్టమొదటిసారిగా ఎడ్విన్ ఆర్మ్స్ట్రాంగ్ అనే శాస్త్రజ్ఞుడు ఎఫ్.ఎమ్. రేడియో ప్రసారాన్ని ప్రజలకు ప్రదర్శించాడు.
1963 బౌద్ధ భిక్షువులపై జరుగుతున్న అమానుష దాడులకు నిరసనగా దక్షిణ వియత్నాంలోని సైగాన్ పట్టణపు కూడలిలో టాయ్ క్వాంగ్ డుచ్ అనే బౌద్ధ భిక్షువు నిప్పంటించుకొని నిలువునా దహనమయ్యాడు.
1988 లండన్లోని వెంబ్లీ స్టేడియంలో నెల్సన్ మండేలా 70వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి.
1988 ఐ.ఎన్.ఎస్. సింధువీర్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.
భారత్
1988 సాధారణ ప్రజా లైసెన్సు (GPL) అనే పేరును మొట్టమొదటిసారి ఉపయోగించడం జరిగింది.
1996 నీలం సంజీవరెడ్డి మృతికి పార్లమెంటు సంతాపం ప్రకటించి నివాళులర్పించింది.
భారత్
పూర్తి ప్రస్థానం →
1998 తొమ్మిది బిలియన్ల అమెరికా డాలర్ల ఖర్చుతో కాంపాక్ కంప్యూటరు కంపెనీ, డిజిటల్ ఎక్విప్మెంట్ కార్పోరేషనును కొనుగోలు చేసింది.
2001 ఓక్లహోమా బాంబు దాడిలో నిందితుడు టిమోతీ మెక్వీకు మరణశిక్ష అమలుపరిచారు.
2010 19వ ప్రపంచ కప్ సాకర్ పోటీలు దక్షిణాఫ్రికాలో ప్రారంభమయ్యాయి.
జననాలు
1897 భారతీయ విప్లవకారుడు, బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ జననం. (మ.1927).
భారత్
1944 మేకపాటి రాజమోహన రెడ్డి, భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు 14వ లోక్సభకు ఆంధ్రప్రదేశ్ లోని నరసారావుపేట లోక్సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
1947 లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ రాజకీయ నాయకుడు.
భారత్
1956 అనూరాధా లోహియా, అంటువ్యాధులపై పరిశోధనలు చేసే భారతీయ సూక్ష్మ పరాన్న జీవుల శాస్త్రవేత్త.
భారత్
మరణాలు
1963 టాయ్ క్వాంగ్ డుచ్, దక్షిణ వియత్నాం బౌద్ధ భిక్షువు.