ఈ రోజు విశేషం
1992 నటుడు అక్కినేని నాగార్జున 'శివ' సహనటి అమలను వివాహం చేసుకున్నారు.
తెలుగు నాట ఈ రోజు
- 1992 నటుడు అక్కినేని నాగార్జున 'శివ' సహనటి అమలను వివాహం చేసుకున్నారు. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1866 ప్రస్తుత అలహాబాదు హైకోర్టు (ఆగ్రా హైకోర్టుగా) స్థాపించబడింది.
- 1935 అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని అల్పైన్ నగరంలో మొట్టమొదటిసారిగా ఎడ్విన్ ఆర్మ్స్ట్రాంగ్ అనే శాస్త్రజ్ఞుడు ఎఫ్.ఎమ్. రేడియో ప్రసారాన్ని ప్రజలకు ప్రదర్శించాడు.
- 1963 బౌద్ధ భిక్షువులపై జరుగుతున్న అమానుష దాడులకు నిరసనగా దక్షిణ వియత్నాంలోని సైగాన్ పట్టణపు కూడలిలో టాయ్ క్వాంగ్ డుచ్ అనే బౌద్ధ భిక్షువు నిప్పంటించుకొని నిలువునా దహనమయ్యాడు.
- 1988 లండన్లోని వెంబ్లీ స్టేడియంలో నెల్సన్ మండేలా 70వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి.
- 1988 ఐ.ఎన్.ఎస్. సింధువీర్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు. భారత్
- 1988 సాధారణ ప్రజా లైసెన్సు (GPL) అనే పేరును మొట్టమొదటిసారి ఉపయోగించడం జరిగింది.
- 1996 నీలం సంజీవరెడ్డి మృతికి పార్లమెంటు సంతాపం ప్రకటించి నివాళులర్పించింది. భారత్ పూర్తి ప్రస్థానం →
- 1998 తొమ్మిది బిలియన్ల అమెరికా డాలర్ల ఖర్చుతో కాంపాక్ కంప్యూటరు కంపెనీ, డిజిటల్ ఎక్విప్మెంట్ కార్పోరేషనును కొనుగోలు చేసింది.
- 2001 ఓక్లహోమా బాంబు దాడిలో నిందితుడు టిమోతీ మెక్వీకు మరణశిక్ష అమలుపరిచారు.
- 2010 19వ ప్రపంచ కప్ సాకర్ పోటీలు దక్షిణాఫ్రికాలో ప్రారంభమయ్యాయి.
జననాలు
- 1897 భారతీయ విప్లవకారుడు, బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ జననం. (మ.1927). భారత్
- 1920 మహేంద్ర, నేపాల్ రాజుగా పనిచేశారు (మ. 1972).
- 1924 అబు అబ్రహాం, ఒక భారతీయ వ్యంగ్య చిత్రకారుడు, పాత్రికేయుడు, రచయిత. (మ.2002). భారత్
- 1930 ఎ. సి. త్రిలోకచందర్ , తెలుగు, తమిళ, హిందీ చిత్రాల దర్శకుడు.(మ.2016).
- 1932 ధారా రామనాథశాస్త్రి, నాట్యావధాని (మ.2016).
- 1944 మేకపాటి రాజమోహన రెడ్డి, భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు 14వ లోక్సభకు ఆంధ్రప్రదేశ్ లోని నరసారావుపేట లోక్సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
- 1947 లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ రాజకీయ నాయకుడు. భారత్
- 1956 అనూరాధా లోహియా, అంటువ్యాధులపై పరిశోధనలు చేసే భారతీయ సూక్ష్మ పరాన్న జీవుల శాస్త్రవేత్త. భారత్
మరణాలు
- 1963 టాయ్ క్వాంగ్ డుచ్, దక్షిణ వియత్నాం బౌద్ధ భిక్షువు.
- 1979 జాన్ వెయిన్, హాలీవుడ్ నటుడు (జ.1907).
- 1983 ఘనశ్యాం దాస్ బిర్లా, భారత పారిశ్రామిక వేత్త. (జ.1894). భారత్
- 1987 బి.ఎస్.మాధవరావు, భౌతిక శాస్త్రవేత్త. (జ.1900).
- 2001 ఓక్లహోమా, నిందితుడు టిమోతీ మెక్వీ.
- 2001 తిరుపతి స్వామి, తెలుగు, తమిళ చిత్రాల దర్శకుడు, విలేకరి(జ.1966).
- 2023 కుసుమ జగదీశ్, తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు (జ. 1976).
సినిమా
- 1965 'ప్రమీలార్జునీయము' చిత్రం విడుదలైంది.
- 1973 'పల్లెటూరి బావ' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- రేస్ యూనిటీ డే (జూన్ రెండవ ఆదివారం).