ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

  • 1908 తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి భువనగిరి మండలం బొల్లేపల్లిలో జన్మించారు. పూర్తి ప్రస్థానం →
  • 1982 దక్షిణ భారత సినీ సాంకేతిక నిపుణుల సంఘం ఎల్.వి.ప్రసాద్‌కు రామనాథ్ అవార్డు ప్రదానం చేసింది. పూర్తి ప్రస్థానం →
  • 2018 గాయని ఎస్. జానకి ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం అందించిన ఎస్పీబీ జాతీయ పురస్కారం అందుకున్నారు. పూర్తి ప్రస్థానం →

సంఘటనలు

  • 1968 అమెరికా సెనేటరు రాబర్ట్ ఎఫ్. కెన్నడీపై సిర్హన్ సిర్హన్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ సంఘటన లాస్ ఆంజిల్స్‌లోని ది అంబాసిడర్ హోటల్లోని వంటశాలలో జరిగింది.
  • 1972 స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో మొట్టమొదటి పర్యావరణ సదస్సు నిర్వహించబడింది.
  • 1995 "బోస్-ఐన్‌స్టీన్ కండెన్సేట్"ను మొదటి సారి సృష్టించారు.
  • 2008 3000 మీటర్ల పరుగులో సురేంద్రసింగ్ భారత జాతీయ రికార్డు సృష్టించాడు. 16 సంవత్సరాల బహదూర్ ప్రసాద్ రికార్డు ఛేదించబడింది. భారత్

జననాలు

  • 1908 రావి నారాయణరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు. (మ.1991).
  • 1934 చెన్నుపాటి విద్య, భారత పార్లమెంటు సభ్యురాలు, సంఘ సేవిక. భారత్
  • 1941 ఆచార్య ఎస్వీ రామారావు, పి.హెచ్.డి. పరిశోధనా పర్యవేక్షకుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇతని పర్యవేక్షణలో 19 పి.హెచ్.డి పరిశోధనలు, 15 ఎం.ఫిల్ పరిశోధనలు జరిగాయి.
  • 1943 రాయపాటి సాంబశివరావు, భారత పార్లమెంటు సభ్యుడు. భారత్
  • 1956 కుట్టి పద్మిని, దక్షిణ భారత చలనచిత్ర నటి, నిర్మాత. భారత్
  • 1961 రమేశ్ కృష్ణన్, భారత టెన్నిస్ క్రీడాకారుడు. భారత్
  • 1968 మూరెళ్ల ప్రసాద్, తెలుగు సినిమా ఛాయాగ్రాహకుడు. ఇతడు ఎక్కువగా తెలుగు, కొన్ని తమిళ సినిమాలకు పనిచేశారు.
  • 1974 భాస్కర భట్ల రవికుమార్, సినీ గీత రచయిత.
  • 1976 రంభ (నటి), తెలుగు సినిమా నటి.
  • 1993 సురభి , తెలుగు తమిళ చిత్రాలనటీ.

మరణాలు

  • 1973 మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్, గురూజీగా ప్రసిద్ధి చెందిన హిందుత్వ నాయకుడు (జ.1906).
  • 1996 ఆచార్య కుబేర్‌నాథ్ రాయ్, భారతీయ రచయిత, జ్ఞానపీఠ పురస్కర గ్రహీత (జ.1933). భారత్
  • 2022 మెండు శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు.

సినిమా

  • 2019 'సెవెన్' చిత్రం విడుదలైంది.

పండుగలు, జాతీయ దినాలు

  • ప్రపంచ పర్యావరణ దినోత్సవం.