ఈ రోజు విశేషం
1948 పోలీసు చర్యలో హైదరాబాదు సైన్యం, రజాకార్లు అన్ని రంగాల్లో ఓడిపోవడంతో నిజాం సాయంత్రం 5 గంటలకు కాల్పుల విరమణ ప్రకటించారు.
తెలుగు నాట ఈ రోజు
- 1948 హైదరాబాదు సంస్థానం నిజాం పరిపాలన నుండి విముక్తి పొంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడింది.
- 1948 ఆపరేషన్ పోలో పేరిట జరిగిన పోలీసు చర్యతో నిజాం పాలన ముగిసి హైదరాబాదు సంస్థానం భారతదేశంలో విలీనమైంది. పూర్తి ప్రస్థానం →
- 1948 పోలీసు చర్యలో హైదరాబాదు సైన్యం, రజాకార్లు అన్ని రంగాల్లో ఓడిపోవడంతో నిజాం సాయంత్రం 5 గంటలకు కాల్పుల విరమణ ప్రకటించారు. పూర్తి ప్రస్థానం →
- 1959 శోభన్ బాబు నటించిన తొలి విడుదల చిత్రం దైవబలం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1978 ఇజ్రాయిల్-ఈజిప్టు దేశాల మధ్య కాంప్డేవిడ్ శాంతి ఒప్పందం కుదిరింది.
- 2008 థాయిలాండ్ ప్రధానమంత్రిగా పీపుల్ పవర్ పార్టీకి చెందిన సొంచాయ్ వాంగ్సవత్ ఎన్నికైనాడు. భారత్
జననాలు
- 1906 వావిలాల గోపాలకృష్ణయ్య, గాంధేయ వాది, స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ శాసనసభ సభ్యుడు. (మ.2003). భారత్
- 1915 ఎమ్.ఎఫ్. హుస్సేన్, భారతీయ చిత్రకారుడు. (మ.2011). భారత్
- 1943 తిక్కవరపు సుబ్బరామిరెడ్డి, భారత జాతీయ కాంగ్రెసుకు చెందిన రాజకీయ నాయకుడు, తెలుగు సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త.
- 1950 భారతదేశ 14వ ప్రధానమంత్రి నరేంద్ర మోడి జన్మించారు. భారత్
- 1986 ప్రియా ఆనంద్, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, తెలుగు, చిత్రాల నటి.
- 1990 బండారు శివప్రసాద్ జర్నలిస్ట్, అధ్యాపకుడు, తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. విలేకరిగా ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రధాన పాత్ర పోషించారు. అధ్యాపకునిగా ఎందరికో విద్య ను అందించారు.
మరణాలు
- 1922 ముత్తరాజు సుబ్బారావు, శ్రీకృష్ణ తులాభారం నాటక రచన ద్వారా ప్రసిద్ధులయ్యారు, ఇతర రచనలు ఉత్తర రామచరిత్ర, రాజ్యశ్రీ, చంద్రగుప్త. వీటిలో రాజ్యశ్రీ నాటకాన్ని చెన్నపురిలోని సుగుణవిలాస సభవారు ఏర్పరచిన పోటీలకు రాసింది (జ.1888).
- 1999 రాజేశ్వర్ దయాళ్, భారతీయ దౌత్యవేత్త, రచయిత. (జ.1909). భారత్
సినిమా
- 1976 'మా దైవం' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- తెలంగాణ విమోచన దినోత్సవం.
- విశ్వకర్మ జయంతి.
- మహిళల మైత్రీ దినోత్సవం.
- ప్రపంచ పేషెంట్ సేఫ్టీ డే.