ఈ రోజు విశేషం
2009 ఎన్నికల ప్రచారం అనంతరం సూర్యాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఎన్.టి.ఆర్ గాయపడ్డారు.
తెలుగు నాట ఈ రోజు
- 2009 ఎన్నికల ప్రచారం అనంతరం సూర్యాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఎన్.టి.ఆర్ గాయపడ్డారు. పూర్తి ప్రస్థానం →
- 2021 సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా తీసిన బయోపిక్ సైనా విడుదలైంది. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1971 పాకిస్థాన్ నుండి తూర్పు పాకిస్థాన్ స్వాతంత్ర్యం పొంది బంగ్లాదేశ్గా అవతరించింది. (బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవం). భారత్
- 1977 భారత లోక్ సభ స్పీకర్గా నీలం సంజీవరెడ్డి పదవి స్వీకారం. భారత్
- 1977 నీలం సంజీవరెడ్డి ఆరవ లోక్సభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారత్ పూర్తి ప్రస్థానం →
- 2000 రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికయ్యాడు.
- 2008 భూటాన్లో తొలిసారిగా జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికలలో గెలిచి జిగ్మీ ధిన్లే ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. భారత్
- 2019 నటి, మాజీ ఎంపీ జయప్రద భారతీయ జనతా పార్టీలో చేరారు. భారత్ పూర్తి ప్రస్థానం →
జననాలు
- 1872 దివాకర్ల తిరుపతి శాస్త్రి, వంద సంస్కృత, తెలుగు గ్రంథాలు, నాటకములు, అనువాదాలు వ్రాశారు. (మ. 1920).
- 1875 మాక్స్ అబ్రహమ్, జర్మన్ భౌతిక శాస్త్రవేత్త. (మ. 1922).
- 1912 పండితారాధ్యుల నాగేశ్వరరావు, పత్రికారచయిత, ఆంధ్రప్రభ బెంగళూరు రెసిడెంట్ ఎడిటర్గా, ఈ పత్రికలతో పాటుగా గోభూమి, క్రాంతి, సంజయ, ప్రజాప్రభ వారపత్రిక, Pedestrian పత్రికలలో సంపాదకునిగా పనిచేశాడు.
- 1933 ఆచార్య కుబేర్ నాథ్ రాయ్, రచయిత.
- 1965 ప్రకాష్ రాజ్, దక్షిణ భారతదేశానికి చెందిన నటుడు. భారత్
- 1972 మధుబాల, భారతీయ చలన చిత్ర నటి. భారత్
మరణాలు
- 1797 జేమ్స్ హట్టన్ స్కాటిష్ తత్వవేత్త, ప్రకృతి ప్రియుడు (జ.1726).
- 1990 బెంగుళూరు లత, కన్నడ, తెలుగు చిత్రాల గాయనీ (జ.1941).
- 1991 ఆర్.సుదర్శన్, సంగీత దర్శకుడు (జ.1914).
- 2006 అనిల్ బిశ్వాస్, రాజకీయవేత్త (పశ్చిమ బెంగాల్ సి.పి.యం రాష్ట్ర కమిటీ సభ్యులుగా పనిచేశారు. (జ.1944). భారత్
- 2006 దుక్కిపాటి మధుసూదనరావు, తెలుగు సినీ నిర్మాత. (జ.1917).
- 2013 సుకుమారి, తెలుగు, తమిళ, బెంగాలీ, చిత్రాలలో,2000 పైగా నటించిన నటి (జ.1938).
- 2016 పూసపాటి ఆనంద గజపతి రాజు, విజయనగరం పూసపాటి రాజవంశీయుడు, మాజీ మంత్రి. (జ.1950).
సినిమా
- 2004 'శీను వాసంతి లక్ష్మి' చిత్రం విడుదలైంది.