ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

  • 1919 హైదరాబాదులో హైకోర్టు భవన నిర్మాణం పూర్తయింది.
  • 1921 కొండా వెంకటప్పయ్య కృషితో బెజవాడలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు ప్రారంభమయ్యాయి; గాంధీజీ ఆంధ్ర పర్యటన ఆయన ఆధ్వర్యంలోనే సాగింది. పూర్తి ప్రస్థానం →

సంఘటనలు

  • 1959 14 వ దలైలామా, టెన్‌జిన్ జియాట్సో భారత సరిహద్దును దాటి భారత్ వచ్చాడు. భారత్
  • 2011 2011 మార్చి 31 నాటికి భారతదేశంలో మొత్తం 8,40,130 మంది వైద్యులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, లోక్ సభలో కేంద్ర ఆరోగ్యమంత్రి 2012 మే 18 నాడు చెప్పారు. భారత్

జననాలు

  • 1861 హ్యారియెట్ వైట్ ఫిషర్, లోకోమొబైల్ లో ప్రపంచాన్ని చుట్టివచ్చిన మొదటి మహిళ. (మ.1939).
  • 1865 ఆనందీబాయి జోషి, పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. (మ.1887). భారత్
  • 1928 కపిలవాయి లింగమూర్తి, సాహితీవేత్త, పాలమూరు జిల్లా కు చెందిన కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు (మ. 2018).
  • 1939 సయ్యద్‌ హుసేన్‌ బాషా, నాటక, చలనచిత్ర నటుడు. కవి. నాటకరచయిత (మ.2008).
  • 1960 స్టీవ్ అపిల్టన్, మైక్రాన్ టెక్నాజీ సిఇవో.
  • 1962 రాంకీ , తమిళ,తెలుగు, చిత్రాల నటుడు.
  • 1963 సుజాత మోహన్ , భారతీయ సినీ నేపథ్య గాయని. భారత్
  • 1984 రక్షిత , దక్షిణ భారత నటి. భారత్
  • 1986 వంశీకృష్ణ , తెలుగు సినీ నటుడు.
  • 1987 కోనేరు హంపి, చదరంగ క్రీడాకారిణి.

మరణాలు

  • 1727 ఐజాక్ న్యూటన్, సుప్రసిద్ధ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. (జ.1643).
  • 1972 మీనా కుమారి, భారత చలనచిత్ర నటీమణి. (జ.1932). భారత్
  • 1995 సెలీనా, మెక్సికన్-అమెరికన్ గాయని, గీత రచయిత్రి. నర్తకి (జ.1971).

సినిమా

  • 2017 'గురు' చిత్రం విడుదలైంది.

పండుగలు, జాతీయ దినాలు

  • అంతర్జాతీయ ట్రాన్స్‌జెండర్ కనువిప్పు దినోత్సవం.
  • ప్రపంచ బ్యాకప్ డే.