ఈ రోజు విశేషం
1910 హాస్యనట చక్రవర్తి రేలంగి వెంకట్రామయ్య తూర్పు గోదావరి జిల్లా రావులపాడు గ్రామంలో జన్మించారు.
తెలుగు నాట ఈ రోజు
- 1910 హాస్యనట చక్రవర్తి రేలంగి వెంకట్రామయ్య తూర్పు గోదావరి జిల్లా రావులపాడు గ్రామంలో జన్మించారు. పూర్తి ప్రస్థానం →
- 1961 కె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన జానపద చిత్రం జగదేకవీరుని కథ విడుదలై విజయం సాధించింది. పూర్తి ప్రస్థానం →
- 1975 నటుడు మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ, ఇందిర దంపతులకు మద్రాసులో జన్మించారు. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1925 రామ్ ప్రసాద్ బిస్మిల్ నేతృత్వంలోని యువ విప్లవకారులు బ్రిటిష్ పాలనపై పోరులో కకోరీ కుట్రకు పాల్పడ్డారు. భారత్ పూర్తి ప్రస్థానం →
- 1945 ఆగష్టు 6 న 'ఎనొలా గే' అనే అమెరికా బి-29 బాంబర్ ( బాంబులను ప్రయోగించడానికి వాడేది ), మొదటి సారి ఒక అణ్వాయుధాన్ని జపాన్ లోని హిరోషిమా పట్టణంపైన విడిచింది. ప్రపంచ చరిత్రలో అణ్వాయుధాన్ని ఒక దేశం పై ప్రయోగించడం అదే ప్రథమం. ప్రయోగించిన కొద్ది నిముషాల్లొనే మహా విస్పొటనం సంభవించింది. దీని నుంచి వెలువడిన అగ్ని క్షణాల్లొనే పట్టణం అంతా వ్యాపించి భస్మం చేసింది. ఈ విస్పొటనంలో 70, 000 అక్కడికక్కడే మరణించారు. అంటే ఈ సంఖ్య హిరోషిమా పట్టణ జనాభాలో మూడవ వంతు. మళ్ళీ మూడవ రోజున 1945 ఆగష్టు 9 అతి పెద్ద తీరప్రాంత పట్టణమైన నాగసాకి పై అటువంటిదే మరో అణ్వాయుధాన్ని అమెరికా ప్రయోగించింది. దీనితో జపాన్ రెండవ ప్రపంచ యుద్దంలో అమెరికాకు లొంగి పోక తప్పలేదు. ఇది ప్రపంచ చరిత్ర లోనే అతి ఖరీదైన యుద్దంగా మిగిలిపోయింది. రెండు పట్టణాలు మరల నిర్మించబడ్డాయి, కాని, మానవ చరిత్రలో మరిచి పోలేని పీడ కలగా ఈ సంఘటన మిగిలి పొయింది. 1945 ఆఖరికి 2 లక్షల మంది పైగా యుద్దబాధితులుగా మిగిలారు. వీరిలో చాలామంది జీవించగలిగినా, తరువాత చాలా వ్యాధులకు గురయ్యారు.
- 1962 భారతదేశంలో తొలి భారజల ఉత్పత్తి కేంద్రాన్ని పంజాబు లోని నంగల్లో ప్రారంభించారు. భారత్
- 1965 సింగపూర్ స్వాతంత్ర్యం పొందింది. భారత్
- 1974 గెరాల్డ్ ఫోర్డ్ అమెరికా 39వ అధ్యక్షునిగా పదవీ స్వీకారం.
జననాలు
- 1754 ఫ్రాన్సుకు చెందిన పియరి చార్లెస్ లీ ఎన్పేంట్ ప్రసిద్ధి పొందిన సివిల్ ఇంజనీరు, ఆర్కిటెక్ట్. (వాషింగ్టన్ డి.సి. లోని వీధులను ప్రణాళిక ప్రకారం అత్యంత మనోహరంగా రూపు దిద్దిన వాడు) (మ.1825).
- 1889 చిలుకూరి నారాయణరావు, భాషావేత్త, చరిత్రకారుడు, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1951). భారత్
- 1891 పాలినా లెబ్ల్-అల్బాలా.
- 1910 రేలంగి వెంకట్రామయ్య, పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు. (మ.1975).
- 1932 జాలాది రాజారావు, తెలుగు రచయిత. (మ.2011).
- 1962 వెలుదండ నిత్యానందరావు, రచయిత, పరిశోధకుడు, ఆచార్యుడు.
- 1965 బ్రహ్మాజీ, తెలుగు సినిమా నటుడు.
- 1970 రావు రమేష్, భారతీయ సిని, టీవి నటుడు. భారత్
- 1972 మురళిశర్మ , తెలుగు తో పాటు పలు ఇతర భాషలలో ప్రతి నాయకుడు.
- 1975 మహేష్ బాబు, తెలుగు సినిమా నటుడు.
- 1987 వి.జయశంకర్, తెలుగు సినిమా డైలాగ్ రచయిత, కథా రచయిత.
- 1991 హన్సిక మోత్వాని , చిత్రసీమ లో బాలనటిగా గుర్తింపు పొందిన భారతీయ సినీ నటీ. భారత్
మరణాలు
- 1948 యల్లాప్రగడ సుబ్బారావు, భారతీయ వైద్య శాస్త్రజ్ఞుడు. (జ.1895). భారత్
- 2016 జ్యోతిలక్ష్మి, దక్షిణ భారత శృంగార నృత్య నటి.తమిళ చిత్రాలలో కథానాయికగా పలు చిత్రాలలో నటించారు.(జ.1948). భారత్
సినిమా
- 1951 'స్త్రీ సాహసము' చిత్రం విడుదలైంది.
- 1989 'అగ్ని (సినిమా)' చిత్రం విడుదలైంది.
- 2002 'వచ్చిన వాడు సూర్యుడు' చిత్రం విడుదలైంది.
- 2024 'సింబా' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం.
- 1965 : సింగపూర్ స్వాతంత్ర్య దినోత్సవం. భారత్
- నాగసాకి దినోత్సవం.
- క్విట్ ఇండియా దినోత్సవం. భారత్
- ప్రపంచ స్వదేశీ ప్రజల దినోత్సవం.
- జాతీయ పుస్తక ప్రేమికుల దినోత్సవం.