ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

  • 1956 తెలుగు మాట్లాడే ప్రాంతాలని ఒకే రాష్ట్రంగా చేయాలని పెద్దమనుషుల ఒప్పందం జరిగిన రోజు.

సంఘటనలు

  • 1969 భారతదేశం లో 50 కోట్ల రూపాయల పెట్టుబడికి మించిన 14 బ్యాంకులు జాతీయం చేయబడినవి. భారత్
  • 1996 26వ వేసవి ఒలింపిక్ క్రీడలు అట్లాంటాలో ప్రారంభమయ్యాయి.
  • 2000 ఐ.ఎన్.ఎస్. సింధుశస్త్ర (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు. భారత్

జననాలు

  • 1827 మంగళ్ పాండే, సిపాయిల తిరుగుబాటు ప్రారంభకులలో ఒకడు. (మ.1857).
  • 1902 సముద్రాల రాఘవాచార్య, సముద్రాల సీనియర్ గా పేరొందిన రచయిత, నిర్మాత, దర్శకుడు, నేపథ్యగాయకుడు. (మ.1968).
  • 1924 కె.సి.శివశంకరన్, "శంకర్" గా సుపరిచితుడైన చిత్రకారుడు. (మ.2020).
  • 1954 దామెర రాములు, తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఉద్యమించిన కవి.
  • 1955 రోజర్ బిన్నీ, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. భారత్
  • 1956 రాజేంద్రప్రసాద్, తెలుగు సినిమా నటుడు.
  • 1979 మాళవిక, భారతీయ సినీనటి...తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పలు చిత్రాలలో నటించారు.
  • 1983 సింధు తులాని, భారతీయ సినీనటి...తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో పలు చిత్రాలలో నటించారు.

మరణాలు

  • 1972 కలుగోడు అశ్వత్థరావు, స్వయంకృషితో తెలుగు కన్నడ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. (జ.1901).
  • 1991 చితిర తిరునాల్ బలరామ వర్మ, ట్రావెన్కోర్ సంస్థానం యొక్క ఆఖరి మహారాజు. (జ.1912).
  • 2024 అడిగోపుల వెంకటరత్నం, కవి, రచయిత.(జ.1945).

సినిమా

  • 1957 'దొంగల్లో దొర (1957 సినిమా)' చిత్రం విడుదలైంది.
  • 1993 'ఆగ్రహం (1991 సినిమా)' చిత్రం విడుదలైంది.
  • 2024 'డార్లింగ్ (2024 సినిమా)' చిత్రం విడుదలైంది.