ఈ రోజు విశేషం
2011 శ్రీరామరాజ్యం రచన పూర్తి చేసిన వెంటనే ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ చెన్నైలో కన్నుమూశారు.
తెలుగు నాట ఈ రోజు
- 1980 ఆంధ్రా షెల్లీగా ఖ్యాతి పొందిన భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి కన్నుమూశారు. పూర్తి ప్రస్థానం →
- 1982 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎనిమిదవ ముఖ్యమంత్రిగాటంగుటూరి అంజయ్య పదవీ విరమణ.
- 1982 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొమ్మిదవ ముఖ్యమంత్రిగా భవనం వెంకట్రామ్ ప్రమాణ స్వీకారం.
- 1982 టి.అంజయ్య స్థానంలో భవనం వెంకటరామిరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పూర్తి ప్రస్థానం →
- 2011 శ్రీరామరాజ్యం రచన పూర్తి చేసిన వెంటనే ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ చెన్నైలో కన్నుమూశారు. పూర్తి ప్రస్థానం →
- 2018 ప్రముఖ నటి శ్రీదేవి దుబాయ్ హోటల్ గదిలో ప్రమాదవశాత్తు మునిగి మరణించారు. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1582 గ్రెగేరియన్ కేలండర్ మొదలైన రోజు. నేపుల్సుకు చెందిన అలోయిసియస్ లిలియస్ అనే వైద్యుడు జూలియన్ కాలెండరుకు చేసిన సవరణల ఫలితమే ఈ కాలెండరు. దీన్ని పోప్ గ్రెగొరీ 13 తయారుచేయించి 1582 ఫిబ్రవరి 24 న అమలుపరచాడు. ఆయన పేరు మీదుగా దీనికి గ్రెగోరియన్ కాలెండరు అనే పేరు వచ్చింది.
- 1938 నైలాన్ దారంతో మొదటిసారిగా టూత్ బ్రష్ను న్యూజెర్సీ లోని ఆర్లింగ్టన్లో తయారు చేసారు. మొదటి సార్గిగా నైలాన్ దారాన్ని వ్యాపారానికి ఉపయోగించటం మొదలైన రోజు.
- 1942 వాయిస్ ఆఫ్ అమెరికా (అమెరికా షార్ట్ వేవ్ రేడియో సర్వీసు) ఆవిర్బవించిన రోజు.
- 1944 సెంట్రల్ ఎక్సైజ్ వ్యవస్థాపక దినోత్సవము. సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ శాఖను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది (సి.ఇ.సి.డి).సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అంద్ కస్టమ్స్ (సి.బి.ఇ.సి) చూడు [https://web.archive.org/web/20070528020343/http://www.cbec.gov.in/]. భారత్
- 1945 ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా ని, రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్ ఆక్రమించగా, అమెరికా విడిపించిన్ రోజు.
- 1952 ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇ.ఎస్.ఇ.సి) వార్షికోత్సవము. ఇ.ఎస్.ఇ.సి. మొదటిసారిగా కాన్పుర్, ఢిల్లీలలో ప్రారంభించారు. [[ది ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్ చట్టం 1948 ఆధారంగా ఇ.ఎస్.ఐ.సి. ఏర్ఫడింది. చూడు [http://esic.nic.in]. భారత్
- 1983 డౌ జోన్స్ ఇండిస్ట్రియల్ ఏవరేజి 1100 మార్క్ ని మొదటిసారిగా దాటింది. ఈ రోజున 24.87 పాయింట్లు పెరిగింది. 1972 లో, 1100 మార్క్ చేరినా, ఈ మార్క్ చివరి వరకు నిలబడలేదు.
- 2007 52వ ఫిల్మ్ఫేర్ వేడుకలో శ్రీదేవి తన పాత హిట్ పాటలకు నృత్యం చేసి ప్రేక్షకులను అలరించారు. భారత్ పూర్తి ప్రస్థానం →
జననాలు
- 1304 హాజీ ఆబు అబ్దుల్లా ముహమ్మద్ ఇబున్ బట్టూట - మన దేశాన్ని సందర్శించిన ఆరబ్ చరిత్రకారుడు. ఇతడు ఆసియా, ఆఫ్రికా ఖండాలను పర్యటించి, అక్కడి విశేషాలను పుస్తకంలో రాసాడు. మరణం (1368 లేదా 1369). (జననం కూడా 24 లేదా 1304 ఫిబ్రవరి 25). ముహమ్మద్ బిన్ తుగ్లక్, కాకతీయ వంశం లోని ప్రతాపరుద్ర దేవుడు, మంత్రి యుగంధరుడు కాలంలో ఇతను భారతదేశంలో ప్రయాణించాడు.
- 1911 పిలకా గణపతిశాస్త్రి, కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు. (మ.1983).
- 1929 అనంత్ పాయ్, భారతీయ కామిక్ రచయిత, అమర్ చిత్రకథ సృష్టికర్త. భారత్
- 1939 జాయ్ ముఖర్జీ, భారతీయ చలనచిత్ర నటుడు. భారత్
- 1948 జయలలిత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. (మ.2016). భారత్
- 1955 స్టీవ్ జాబ్స్, అమెరికన్ ఐటీ వ్యాపారవేత్త, యాపిల్ ఇన్కార్పొరేషన్కు సహ-వ్యవస్థాపకుడు.
- 1972 పూజా భట్ , భారతీయ నటి ,మోడల్, నిర్మాత, దర్శకురాలు. భారత్
- 1981 నానీ, తెలుగు సినిమా నటుడు.
మరణాలు
- 1810 హెన్రీ కేవిండిష్, బ్రిటిష్ తత్వవేత్త, సైద్ధాంతిక రసాయన, భౌతిక శాస్త్రవేత్త. (జ.1731). భారత్
- 1951 కట్టమంచి రామలింగారెడ్డి, సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత. (జ.1880).
- 1967 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, హైదరాబాదు చివరి నిజాము. (జ.1886).
- 1975 ఈలపాట రఘురామయ్య, రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు. (జ.1901).
- 1980 దేవులపల్లి కృష్ణశాస్త్రి, తెలుగు కవి. (జ.1897).
- 1984 న్యాయపతి రాఘవరావు, రేడియో అన్నయ్య, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు. (జ.1905).
- 1986 రుక్మిణీదేవి అరండేల్, కళాకారిణి. (జ.1904).
- 1991 జెట్టి ఈశ్వరీబాయి, భారతీయ రిపబ్లికన్ పార్టీ నాయకురాలు, అంబేద్కరువాది, దళిత సంక్షేమకర్త. (జ.1918). భారత్
- 1991 త్యాగరాజు , తెలుగు సినిమా నటుడు ,ప్రతినాయకుడు .(జ.1941).
- 2003 ముకురాల రామారెడ్డి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (జ.1929).
- 2011 ముళ్ళపూడి వెంకటరమణ, తెలుగు నవల, కథ, సినిమా, హాస్య కథ రచయిత. (జ.1931).
- 2013 షేక్ సాంబయ్య, క్లారినెట్ విద్వాంసుడు. (జ.1950).
- 2017 కె.సి.శేఖర్బాబు తెలుగు సినిమా నిర్మాత. (జ.1946).
- 2017 సింహాద్రి శివారెడ్డి గుంటూరు జిల్లాకు చెందిన సి.పి.ఎం నాయకుడు.
- 2018 శ్రీదేవి, భారతీయ సినీ నటి (జ. 1963). భారత్
- 2022 ఇమ్మడి లక్ష్మయ్య, వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు.(జ.1930).
సినిమా
- 1971 'పవిత్ర బంధం' చిత్రం విడుదలైంది.
- 1992 'మాధవయ్యగారి మనవడు' చిత్రం విడుదలైంది.
- 1994 'పరుగో పరుగు' చిత్రం విడుదలైంది.
- 2023 'మిస్టర్ కింగ్' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం.