ఏప్రిల్ 19 భారత తొలి అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్ట సోవియట్ భూభాగం నుంచి ప్రయోగించారు.
భారత్
ఏప్రిల్ 19 భారతదేశపు తొలి ఉపగ్రహం, ఇస్రో నిర్మించిన ఆర్యభట్టను అప్పటి సోవియట్ యూనియన్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు.
భారత్
ఏప్రిల్ 30 దక్షిణ వియత్నాం (సైగాన్) ఉత్తర వియత్నాం దేశానికి లొంగిపోయి వియత్నాం యుద్ధానికి ముగుంపు పలికింది.
మే 14 అమెరికా అణుబాంబును నెవడా పరీక్షా కేంద్రంలో పేల్చి, పరీక్షించింది.
మే 16 జాపనీస్ పర్వతరోహిణి, జుంకే తాబెయ్, మౌంట్ ఎవరెస్టు శిఖరం చేరిన మొదటి మహిళ.
మే 24 రష్యాకు చెందిన 'సోయుజ్ 18బి' ఇద్దరు రోదసీయాత్రికులను 'సాల్యూట్ 4' 'స్ఫేస్ స్టేషను (రోదసీ కేంద్రం) కి తీసుకువెళ్ళింది.
జూన్ 1 ఒలింపిక్ పతక విజేత, వెయిట్లిఫ్టర్ కరణం మల్లీశ్వరి ఆంధ్రప్రదేశ్లో జన్మించారు.
జూన్ 7 బీటా మాక్స్ వీడియో క్యాసెట్ రికార్డరును సోనీ విపణిలో ప్రవేశపెట్టింది.
జూన్ 25 భారతదేశం లో ఇందిరా గాంధీ, అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
భారత్
జూలై 5 కేప్ వెర్డె దేశం స్వతంత్రం పొందింది (పోర్చుగల్ నుంచి).
జూలై 20 'ది టైమ్స్', 'ది డెయిలీ టెలిగ్రాఫ్', 'న్యూస్ వీక్' పత్రికా విలేకరులను, భారత ప్రభుత్వపు సెన్సార్ నిబంధనలను పాటించే పత్రంపై సంతకం చేయటానికి నిరాకరించటం వలన, భారత ప్రభుత్వం వారిని బహిష్కరించింది (అది అత్యవసర పరిస్థితి - ఎమెర్జెన్సీ కాలం).
భారత్
ఆగస్టు 1 మానవ హక్కుల ఒప్పందం పై 35 పైగా దేశాలు సంతకం చేసాయి. ( దీనిని హెల్సింకీ ఒప్పందం అని అంటారు. ఈ ఒప్పందం హెల్సింకీ నగరంలో జరిగింది).
ఆగస్టు 9 నటుడు మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ, ఇందిర దంపతులకు మద్రాసులో జన్మించారు.
ఆగస్టు 15 బంగ్లాదేశ్లో సైనిక కుట్ర. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ ముజిబుర్ రెహ్మాన్ ని, అతని కుటుంబసభ్యులను (హసీనా వజీద్ ని తప్ప) చంపారు.
భారత్
అక్టోబరు 1 మహాకవి క్షేత్రయ్య చిత్రీకరణ తొలి రోజుల్లోనే తీవ్ర అనారోగ్యంతో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు కన్నుమూశారు.
అక్టోబరు 3 రాజబాబు, విజయనిర్మల ప్రధాన పాత్రల్లో నటించిన పిచ్చోడి పెళ్ళి చిత్రం విడుదలైంది.
అక్టోబరు 22 సోవియట్ యూనియన్ ప్రయోగించిన మానవరహిత అంతరిక్ష మిషన్ వెనెర-9 శుక్రగ్రహంపై దిగింది.
నవంబరు 27 ప్రముఖ హాస్యనటుడు, పద్మశ్రీ గ్రహీత రేలంగి వెంకట్రామయ్య తాడేపల్లిగూడెంలోని స్వగృహంలో కన్నుమూశారు.