జనవరి 7 తెలంగాణ ముఖ్యమంత్రి నియోజకవర్గంమైన గజ్వేల్ లో తెలంగాణ కాంట్రిబ్టూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్యర్యంలో అయుత ధర్మదీక్ష నిర్వహించడం జరుగుతుంది.
జనవరి 10 పవన్ కళ్యాణ్ 25వ చిత్రం 'అజ్ఞాతవాసి' విడుదలైంది.
ఫిబ్రవరి 14 అంతర్జాతీయ మైనింగ్ సదస్సు - 2018 హైదరాబాదులో ప్రారంభం.
ఫిబ్రవరి 20 శ్రీదేవి బంధువుల పెళ్లి కోసం కుమార్తె ఖుషీతో యూఏఈకి పయనమయ్యారు; అదే ఆమె చివరి ప్రయాణమైంది.
ఫిబ్రవరి 24 ప్రముఖ నటి శ్రీదేవి దుబాయ్ హోటల్ గదిలో ప్రమాదవశాత్తు మునిగి మరణించారు.
ఫిబ్రవరి 28 ముంబైలో శ్రీదేవి అంత్యక్రియలు మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా జరిగాయి.
మార్చి 3 శ్రీదేవి చితాభస్మాన్ని రామేశ్వరం తీరంలో సముద్రజలాల్లో నిమజ్జనం చేశారు.
మార్చి 30 సుకుమార్ దర్శకత్వంలోని రంగస్థలం చిత్రంలో చిట్టిబాబుగా రామ్ చరణ్ నటన కెరీర్ బెస్ట్గా నిలిచి రెండో ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డు తెచ్చింది.
ఏప్రిల్ 14 ఆయుష్మాన్ భారత్ పథకాన్ని 2018-19 సంవత్సర బడ్జెట్లో జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకంలో భాగంగా ప్రకటించారు.
భారత్
ఏప్రిల్ 15 సీ పి యస్ విధానానికి నిరసనతెలుపుటకై తెలంగాణా ఉపాధ్యాయ, ఉద్యోగులు 103 సంఘాల వారు హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కుటుంబాలతో జనజాతర కార్యక్రమాన్ని ఉవ్వెత్తున నిర్వహించారు.
ఏప్రిల్ 23 సానియా మీర్జా, షోయబ్ మాలిక్ దంపతులు తమ తొలి సంతానం రాబోతున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు.
ఏప్రిల్ 27 'భరత్ అనే నేను'లో ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ బాబు నటన ప్రశంసలు అందుకుంది.
మే 9 సావిత్రి జీవితకథ ఆధారంగా రూపొందిన మహానటి చిత్రం విడుదలై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది.
జూన్ 5 గాయని ఎస్. జానకి ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం అందించిన ఎస్పీబీ జాతీయ పురస్కారం అందుకున్నారు.
జూలై 3 ఎస్వీ రంగారావు శతజయంతి ఉత్సవాలు హైదరాబాదులో ప్రారంభం కాగా, ఏలూరులో ఆయన కంచు విగ్రహాన్ని చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.
ఆగస్టు 18 పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణం చేశాడు.
భారత్
ఆగస్టు 18 18 వ ఆసియా క్రీడలు ఇండొనీషియా రాజధాని జకార్తాలో ప్రారంభమయ్యాయి.
సెప్టెంబరు 9 టి.అంజయ్య సతీమణి, మాజీ ఎంపీ టంగుటూరి మణెమ్మ హైదరాబాదులో మరణించారు.
సెప్టెంబరు 19 అక్కినేని నాగేశ్వరరావు 95వ జయంతి సందర్భంగా తపాలా శాఖ ప్రత్యేక తపాలా కవర్ విడుదల చేసింది.
భారత్
సెప్టెంబరు 26 కామన్వెల్త్ క్రీడల్లో షూటింగ్ విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి పిన్నవయస్కుడు అనీష్ భన్వాలా.
సెప్టెంబరు 27 భారతదేశ అత్యున్నత న్యాయస్థానం నిబంధనల ప్రకారం 158 సంవత్సరాల పాత నిబంధన, సెక్షన్ 497, వివాహేతర సంబంధం చట్టవిరుద్ధం, ఎందుకంటే ఇది మహిళల పట్ల వివక్షతో కూడుకున్నది.
భారత్
అక్టోబరు 11 త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్.టి.ఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ ఘన విజయం సాధించింది.
అక్టోబరు 25 విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడి జరిగింది.
డిసెంబరు 7 ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ 88 స్థానాలతో ఘనవిజయం సాధించింది.
డిసెంబరు 13 కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు.
డిసెంబరు 14 సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ను వివాహం చేసుకున్నారు.
మరణాలు
జనవరి 23 వెంపటి రవిశంకర్, కూచిపూడి నాట్యాచార్యుడు. (జ.1969).