జనవరి 11 మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' విడుదలై బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించింది.
మూలం
జనవరి 11 మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో విజయశాంతి వెండితెరకు పునరాగమనం చేశారు.
మూలం
జనవరి 12 అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో విడుదలై ఆయన కెరీర్లో అతిపెద్ద విజయంగా నిలిచింది.
మూలం
జనవరి 16 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తును ప్రకటించారు.
మూలం
జనవరి 26 భారతదేశ మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ను పి.వి. సింధు అందుకుంది.
మూలం
జనవరి 29 బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు.
మూలం
జనవరి 30 భారతదేశంలో తొలి కరోనా వైరస్ కేసు కేరళలో నమోదైంది; అదే రోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19 ను అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.
భారత్
మూలం 1
మూలం 2
మార్చి 2 తెలంగాణలో తొలి కరోనా వైరస్ కేసు హైదరాబాదులో నమోదైంది.
మూలం
మార్చి 8 బీబీసీ సంవత్సరపు భారతీయ మహిళా క్రీడాకారిణిగా పి.వి. సింధు ఎంపికైంది.
మూలం
మార్చి 11 కోవిడ్-19 ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించింది.
మూలం
మార్చి 12 ఆంధ్రప్రదేశ్లో తొలి కరోనా వైరస్ కేసు నెల్లూరులో నమోదైంది.
మూలం
మార్చి 22 కరోనా వ్యాప్తి నివారణకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటించారు.
భారత్
మూలం
మార్చి 24 కోవిడ్-19 నివారణకు భారతదేశం దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించింది.
భారత్
మూలం
మే 23 నటి వాణిశ్రీ కుమారుడు అభినయ వెంకటేశ కార్తీక్ గుండెపోటుతో మరణించారు.
మూలం
మే 30 కోవిడ్ యోధులకు నివాళిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన భరత్ భూమి గీతాన్ని ఇళయరాజా విడుదల చేశారు.
భారత్
మూలం
జూన్ 28 పి.వి.నరసింహారావు శత జయంతి ఉత్సవాలను హైదరాబాదు పీవీ జ్ఞానభూమిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.
మూలం
ఆగస్టు 5 ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనకు కోవిడ్-19 సోకినట్లు ప్రకటించి చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు.
మూలం
సెప్టెంబరు 25 నలభై వేలకు పైగా పాటలు పాడిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నైలో తుదిశ్వాస విడిచారు.
మూలం
సెప్టెంబరు 26 ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు తిరువళ్ళూరు జిల్లా తామరపాకంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.
మూలం
సెప్టెంబరు 27 వివాదాస్పద నాగోర్నో-కరబఖ్ సరిహద్దు వద్ద అర్మేనియా, అజర్బైజాన్ల మధ్య భారీ ఘర్షణ చెలరేగి 2020 నవంబరు దాకా కొనసాగింది.
మూలం
సెప్టెంబరు 30 బాబ్రీమసీదు విధ్వంసంలో భాజపా, సంఘ్ అగ్రనాయకులకు ఎలాంటి పాత్రలేదని వారు నిర్దోషులని సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించింది.
భారత్
మూలం
మరణాలు
ఫిబ్రవరి 2 ఎం. నారాయణరెడ్డి, తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు. (జ.1931).
మూలం
ఫిబ్రవరి 2 కొమ్మారెడ్డి సురేందర్రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటవీ, పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేశాడు. (జ.1944).
మూలం
ఫిబ్రవరి 16 లారీ టెస్లర్, న్యూయార్క్ కు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త. (జ. 1945).
మూలం