జనవరి 11 మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' విడుదలై బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించింది.
జనవరి 11 మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో విజయశాంతి వెండితెరకు పునరాగమనం చేశారు.
జనవరి 12 అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో విడుదలై ఆయన కెరీర్లో అతిపెద్ద విజయంగా నిలిచింది.
జనవరి 16 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తును ప్రకటించారు.
జనవరి 26 భారతదేశ మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ను పి.వి. సింధు అందుకుంది.
జనవరి 29 బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు.
జనవరి 30 భారతదేశంలో తొలి కరోనా వైరస్ కేసు కేరళలో నమోదైంది; అదే రోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19 ను అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.
భారత్
మార్చి 2 తెలంగాణలో తొలి కరోనా వైరస్ కేసు హైదరాబాదులో నమోదైంది.
మార్చి 8 బీబీసీ సంవత్సరపు భారతీయ మహిళా క్రీడాకారిణిగా పి.వి. సింధు ఎంపికైంది.
మార్చి 11 కోవిడ్-19 ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించింది.
మార్చి 12 ఆంధ్రప్రదేశ్లో తొలి కరోనా వైరస్ కేసు నెల్లూరులో నమోదైంది.
మార్చి 22 కరోనా వ్యాప్తి నివారణకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటించారు.
భారత్
మార్చి 24 కోవిడ్-19 నివారణకు భారతదేశం దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించింది.
భారత్
మే 23 నటి వాణిశ్రీ కుమారుడు అభినయ వెంకటేశ కార్తీక్ గుండెపోటుతో మరణించారు.
మే 30 కోవిడ్ యోధులకు నివాళిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన భరత్ భూమి గీతాన్ని ఇళయరాజా విడుదల చేశారు.
భారత్
జూన్ 28 పి.వి.నరసింహారావు శత జయంతి ఉత్సవాలను హైదరాబాదు పీవీ జ్ఞానభూమిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.
ఆగస్టు 5 ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనకు కోవిడ్-19 సోకినట్లు ప్రకటించి చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు.
సెప్టెంబరు 25 నలభై వేలకు పైగా పాటలు పాడిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నైలో తుదిశ్వాస విడిచారు.
సెప్టెంబరు 26 ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు తిరువళ్ళూరు జిల్లా తామరపాకంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.
సెప్టెంబరు 27 వివాదాస్పద నాగోర్నో-కరబఖ్ సరిహద్దు వద్ద అర్మేనియా, అజర్బైజాన్ల మధ్య భారీ ఘర్షణ చెలరేగి 2020 నవంబరు దాకా కొనసాగింది.
సెప్టెంబరు 30 బాబ్రీమసీదు విధ్వంసంలో భాజపా, సంఘ్ అగ్రనాయకులకు ఎలాంటి పాత్రలేదని వారు నిర్దోషులని సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించింది.
భారత్
మరణాలు
ఫిబ్రవరి 2 ఎం. నారాయణరెడ్డి, తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు. (జ.1931).
ఫిబ్రవరి 2 కొమ్మారెడ్డి సురేందర్రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటవీ, పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేశాడు. (జ.1944).
ఫిబ్రవరి 16 లారీ టెస్లర్, న్యూయార్క్ కు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త. (జ. 1945).
ఫిబ్రవరి 18 కిషోరి బల్లాళ్, భారతీయ చలనచిత్రనటి.
భారత్
ఏప్రిల్ 9 కావేటి సమ్మయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. (జ.1952).
ఏప్రిల్ 23 ఉషా గంగూలీ, భారతీయ రంగస్థల నటి, దర్శకురాలు. (జ.1945).
భారత్
ఏప్రిల్ 29 ఇర్ఫాన్ ఖాన్, హిందీ సినిమానటుడు, నిర్మాత. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1967).
భారత్
ఏప్రిల్ 29 రిషి కపూర్, హిందీ సినిమా నటుడు. (జ.1952).
భారత్
జూన్ 7 చిరంజీవి సర్జా, కన్నడ సినిమా నటుడు. (జ. 1980).
జూలై 23 ఎం.డి.నఫీజుద్దీన్, తెలుగు రచయిత, సంపాదకుడు, ఆంగ్ల అధ్యాపకుడు. ఎం.డి.సౌజన్య అనే కలం పేరుతో సుపరిచితుడు. (జ.1940).
జూలై 25 మంచాల సూర్యనారాయణ, తెలుగు నాటకరంగ, టీవీ, సినీ నటుడు. (జ.1948).
జూలై 26 గార్లపాటి రఘుపతిరెడ్డి, తెలంగాణా విముక్తి పోరాటయోధుడు.
జూలై 28 రావి కొండలరావు, సినీ నటుడు,రచయిత , నిర్మాత,దర్శకుడు (జ.1932).
ఆగస్టు 1 పైడికొండల మాణిక్యాలరావు, భాజపా నేత, ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి. (జ.1961).
ఆగస్టు 4 వంగపండు ప్రసాదరావు, విప్లవకవి, జానపద వాగ్గేయకారుడు, ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు (జ. 1943).
ఆగస్టు 4 సున్నం రాజయ్య, సిపిఎం నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోను, తెలంగాణ శాసనసభ లోనూ సభ్యుడు. (జ. 1960).
ఆగస్టు 4 ఇబ్రహీం అల్కాజీ, నాటకరంగ దర్శకుడు, నట శిక్షకుడు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్డీ) మాజీ డైరెక్టర్ (జ.1925).
ఆగస్టు 6 సోలిపేట రామలింగారెడ్డి, పాత్రికేయుడు, రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే (జ.1961).
ఆగస్టు 8 నంది ఎల్లయ్య, మాజీ పార్లమెంటు సభ్యుడు (జ. 1942).
భారత్
ఆగస్టు 8 మాదన నారాయణ, సీపీఐ రాష్ట్ర నాయకులు, తెలంగాణ. (జ.1940).
ఆగస్టు 16 రాపాక ఏకాంబరాచార్యులు, తెలుగు రచయిత, అవధాన విద్యాసర్వస్వము గ్రంథకర్త (జ.1940).
ఆగస్టు 18 ఎడ్మ కిష్టారెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. (జ. 1947).
ఆగస్టు 19 పి.సి.నరసింహారెడ్డి, భాషాశాస్త్రవేత్త, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు.(జ.1943).
సెప్టెంబరు 1 మాతంగి నర్సయ్య, మాజీ శాసనసభ సభ్యుడు, మాజీ మంత్రి.
సెప్టెంబరు 8 జయప్రకాశ్ రెడ్డి, రంగస్థల సినీ నటుడు, దర్శకుడు. (జ.1946).
సెప్టెంబరు 14 కొంకాల శంకర్, గాయకుడు, రచయిత, బుల్లితెర నటుడు, ఉప్పరపల్లి గ్రామం, కేసముద్రం మండలం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ.
సెప్టెంబరు 23 కోసూరి వేణుగోపాల్, టెలివిజన్, సినిమా నటుడు.
సెప్టెంబరు 25 ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం, గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు ( జ.1946).
సెప్టెంబరు 27 జస్వంత్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు (జ.1938).
సెప్టెంబరు 29 కె.సి.శివశంకరన్, "శంకర్"గా సుపరిచితుడైన చిత్రకారుడు. (జ.1924).
అక్టోబరు 11 రాజన్ ,(రాజన్ నాగేంద్ర సంగీత ద్వయం ) సం గీత దర్శకుడు,(జ.1933).
అక్టోబరు 13 గుండా మల్లేష్, కమ్యూనిస్టు నేత, శాసనసభ మాజీ సభ్యుడు. (జ.1947).
అక్టోబరు 14 శోభానాయుడు, కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1956).
అక్టోబరు 22 నాయిని నర్సింహారెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. (జ.1934).
నవంబరు 10 జీడిగుంట రామచంద్ర మూర్తి, తెలుగు రచయిత, ఆకాశవాణి ప్రయోక్త.
నవంబరు 11 ఆర్.శాంత సుందరి, తెలుగు రచయిత్రి, అనువాదకురాలు.