ఫిబ్రవరి 10 కొత్త ఢిల్లీ నగరం అధికారికంగా ప్రారంభించబడింది.
భారత్
ఫిబ్రవరి 13 న్యూఢిల్లీ భారతదేశ రాజధానిగా నిర్ణయంచబడింది.
భారత్
ఫిబ్రవరి 16 భారత వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ను మొదటిసారిగా ప్రజా ప్రతినిధిగా గాంధీజీ కలిశారు. ఆ తర్వాతనే చర్చిల్ గాంధీజీని 'Half naked seditious Fakir' అని అన్నాడు.
భారత్
మార్చి 5 రాజకీయ ఖైదీ ల విడుదల ఒపందంపై బ్రిటిష్ ప్రతినిధులు, మహాత్మా గాంధీ సంతకం.
భారత్
మార్చి 14 భారతదేశములో తొలి టాకీ చిత్రము, అర్దెషీర్ ఇరానీ దర్శకత్వము వహించిన ఆలం ఆరా ముంబైలోని గోరేగాఁవ్ లోని ఇంపీరియల్ సినిమా థియేటరులో విడుదలయ్యింది.
భారత్
మార్చి 23 భారత స్వాతంత్ర్యోద్యమంలో కృషి చేసిన భగత్ సింగ్ (జ. 1907), రాజ్గురు (జ. 1908), సుఖ్దేవ్ (జ. 1907) లు ఉరి తీయబడ్డారు. వారి మరణాలకు గుర్తుగా ఆ రోజు అమరవీరుల దినొత్సవంగా గుర్తిస్తారు.
భారత్
మే 1 న్యూయార్క్ లోని ఎంపైర్ బిల్డింగ్ పూర్తి అయిన రోజు.
మే 24 మొట్టమొదటి 'శీతలీకరణ రైలు' ప్రవేశ పెట్టారు (బాల్టిమోర్, ఓహియో రైలు మార్గంలో).
జూన్ 20 మొట్టమొదటి ఫోటో ఎలక్ట్రిక్ సెల్ ని వాణిజ్యపరంగా, వెస్ట్ హెవెన్, కనెక్టికట్ రాష్ట్రంలో (అమెరికా) ప్రవేశపెట్టారు.
జూన్ 28 ప్రసిద్ధ హాస్యరచయిత, బుడుగు సృష్టికర్త ముళ్ళపూడి వెంకటరమణ ధవళేశ్వరంలో జన్మించారు.
జూలై 21 సి.బి.ఎస్. టెలివిజన్ చానెల్, అమెరికా లో, తన 7 రోజుల రోజు వారీ ప్రసారాలను, క్రమం తప్పకుండా ప్రసారం చేయటం మొదలుపెట్టింది.
జూలై 23 హిందూ మహాసమురంలో ఉన్న 'అష్మోర్', 'కార్టియెర్' దీవులను ఆస్ట్రేలియా ఆధిపత్యంలోకి బదిలీ చేసారు.
జూలై 29 జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సి.నారాయణరెడ్డి కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో జన్మించారు.
ఆగస్టు 2 సైన్యానికి సంబంధించిన ఏ పనినైనా, తిరస్కరించమని, ఐన్స్టీన్, విజ్ఞానవేత్తలను కోరాడు.
ఆగస్టు 20 హాస్యనటుడు పద్మనాభం కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామంలో జన్మించారు.
సెప్టెంబరు 15 భక్త ప్రహ్లాద [తొలి తెలుగు టాకీ (మాటలు వచ్చిన సినిమా)] విడుదల. ఇందులో 40 పాటలున్నాయి. పద్యాలు ఉన్నాయి. బొమ్మ సరిగా కనిపించక పోయినా, మాటలు కొన్నిచోట్ల సరిగా వినిపించక పోయినా, ప్రేక్షకులు విరగబడి చూశారు.
సెప్టెంబరు 15 తొలి సంపూర్ణ తెలుగు టాకీ 'భక్త ప్రహ్లాద' నిర్మాణం పూర్తయింది; ఈ రోజును 'తెలుగు సినిమా దినోత్సవం'గా జరుపుకుంటారు.
జననాలు
జనవరి 5 చారుహాసన్, దక్షిణ భారత చలన చిత్ర నటుడు , రచయిత.
భారత్
జనవరి 24 నెల్లూరు కాంతారావు , సినీ నటుడు, వస్తాదు , నిర్మాత (మ.1970).
ఫిబ్రవరి 15 ఫాదర్ పూదోట జోజయ్య యస్.జె, క్రైస్తవ గురువులు. కతోలిక రచయితలకు గొప్ప మార్గ దర్శకులు.
ఫిబ్రవరి 23 నూజిళ్ళ లక్ష్మీనరసింహం, వేదమూర్తులు, సంస్కృతాంధ్ర భాషా ప్రవీణులు, ఉపన్యాస కేసరి, హిందూ ధర్మ పరిరక్షణా కంకణ దీక్షాపరులు.
భారత్
ఏప్రిల్ 6 నల్లమల గిరిప్రసాద్, కమ్యూనిస్టు నేత. (మ.1997).
ఏప్రిల్ 26 గణపతి స్థపతి స్థపతి, వాస్తుశిల్పి. (మ.2017).
మే 27 ఒ.ఎన్.వి.కురుప్ మలయాళం కవి, సినీ గేయకర్త (మ.2016).
జూన్ 9 నందిని సత్పతీ, ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి (మ.2006).
భారత్
జూన్ 25 విశ్వనాధ్ ప్రతాప్ సింగ్, భారతదేశ ఎనిమిదవ ప్రధానమంత్రి. (మ.2008).
భారత్
జూన్ 28 ముళ్ళపూడి వెంకటరమణ, తెలుగు నవల, కథ, సినిమా, హాస్య కథ రచయిత. (మ.2011).