జనవరి 7 భారత జాతీయ సైన్సు అకాడమీని కలకత్తాలో నెలకొల్పారు.
భారత్
ఫిబ్రవరి 3 నిజాం కాలంలో హైదరాబాదులో దక్కన్ రేడియో కేంద్రం ప్రసారాలు ప్రారంభించి నగరంలో రేడియో ప్రసార శకానికి నాంది పలికింది.
ఏప్రిల్ 1 భారతీయ రిజర్వు బ్యాంకు స్థాపించబడింది.
భారత్
మే 14 లాస్ ఏంజెల్స్ నగరంలో 'గ్రిఫిత్ నక్షత్రశాల (ప్లానెటోరియం)' ను ప్రారంబించారు. (ఇది అమెరికాలో మూడవద్).
జూన్ 7 ఫ్రాన్స్ దేశానికి మొట్టమొదటి ప్రధాన మంత్రిగా పియెర్రీ లెవాల్.
జూన్ 11 అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని అల్పైన్ నగరంలో మొట్టమొదటిసారిగా ఎడ్విన్ ఆర్మ్స్ట్రాంగ్ అనే శాస్త్రజ్ఞుడు ఎఫ్.ఎమ్. రేడియో ప్రసారాన్ని ప్రజలకు ప్రదర్శించాడు.
జూన్ 30 ఆస్టరాయిడ్#1784 (బెన్గెల్లా) ని సి.జాక్సన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
జూలై 20 లాహోర్ లోని మసీదు విషయమై ముస్లిములకు, సిక్కులకు జరిగిన అల్లర్లలో, 11 మంది మరణించారు.
జూలై 22 సి. జాక్సన్ రెండు గ్రహశకలాల ను (ఆస్టెరాయిడ్స్) కనుగొన్నాడు. అవి #1359 ప్రియెస్కా, #1360 తార్కా.
జూలై 24 గ్రీటింగ్ టెలిగ్రాం పద్ధతిని మొట్టమొదటి సారిగా అమెరికాలో ప్రారంభించారు.
జూలై 25 నటుడు కైకాల సత్యనారాయణ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో జన్మించారు.
అక్టోబరు 20 హాస్యనటుడు రాజబాబుగా ప్రసిద్ధుడైన పుణ్యమూర్తుల అప్పలరాజు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జన్మించారు.
నవంబరు 13 ప్రఖ్యాత నేపథ్య గాయని పి. సుశీల విజయనగరంలో సంగీతాభిమాన కుటుంబంలో జన్మించారు.
జననాలు
జనవరి 7 శశికళ కకొడ్కర్, గోవాకు చెందిన రాజకీయ నాయకురాలు. (మ.2016).
జనవరి 26 వాండ్రంగి రామారావు, తెలుగు సినీ రచయిత, కవి, రాష్ట్ర పురస్కార గ్రహీత, వక్త, వ్యాఖ్యాత, రూపకకర్త, ఆకాశవాణి ప్రసంగికుడు.
ఫిబ్రవరి 20 నేదురుమల్లి జనార్థనరెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.
ఫిబ్రవరి 22 హెచ్.ఆర్. కేశవ మూర్తి, గమకకళలో నిష్ణాతుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత.
మార్చి 2 దుద్దిల్ల శ్రీపాద రావు, శాసనసభ్యుడు, శాసనసభ స్పీకరు. (మ.1999).
జూలై 25 కైకాల సత్యనారాయణ, తెలుగు సినీ నటుడు(మ.2022).
జూలై 26 కోనేరు రంగారావు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ మాజీమంత్రి. (మ.2010).
జూలై 27 వెలుదండ రామేశ్వరరావు, ఆయుర్వేద, హోమియోపతి వైద్య విధానాలలో ఈయనది అందే వేసిన చెయ్యి. ఈయన చాలా రచనలు చేశారు. వాటిలో కొన్ని ముద్రితం, కొన్ని అముద్రితం.
ఆగస్టు 1 ఏ.బి.కె. ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు.
ఆగస్టు 10 రఘునాథ పాణి గ్రాహి, శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, సంగీత దర్శకుడు, గాయకుడు.
ఆగస్టు 15 రాజసులోచన, తెలుగు సినిమా నటి, కూచిపూడి, భరతనాట్య నర్తకి. (మ.2013).
సెప్టెంబరు 3 శరద్ అనంతరావు జోషి, రైతు నాయకుడు. రాజ్యసభ సభ్యుడు. (మ.2015).
భారత్
సెప్టెంబరు 4 కొమ్మూరి వేణుగోపాలరావు, తెలుగు రచయిత. (మ.2004).
సెప్టెంబరు 9 వేదాంతం సత్యనారాయణ శర్మ, కూచిపూడి నృత్య కళాకారుడు, నటుడు. (మ.2012).
సెప్టెంబరు 10 జి. వి. సుబ్రహ్మణ్యం, సంగీత సాహిత్య నృత్య రంగాల్లో కృషిచేసిన బహుముఖప్రజ్ఞాశాలి. (మ.2006).
సెప్టెంబరు 10 పి.ఎల్. నారాయణ, విలక్షణమైన నటుడు, నాటక ప్రయోక్త. (మ.1998).
సెప్టెంబరు 19 మౌలానా అబ్దుల్ రహీం ఖురేషీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకుడు. రాముడు అయోధ్యలో కాదు, పాకిస్థాన్లో పుట్టినట్లుగా ఉర్దూలో పుస్తకం రాసి సంచలనం సృష్టించాడు. (మ.2016).
భారత్
సెప్టెంబరు 20 పర్వతనేని సాంబశివరావు , తెలుగు చలన చిత్ర దర్శకుడు, నిర్మాత.
నవంబరు 27 ప్రకాష్ భండారి, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
భారత్
డిసెంబరు 8 ధర్మేంద్ర , భారతీయ చలనచిత్ర నటుడు , రాజకీయ నాయకుడు.
భారత్
డిసెంబరు 11 ప్రణబ్ ముఖర్జీ, భారత 13 వ రాష్ట్రపతి.
భారత్
డిసెంబరు 12 వి.రామారావు, సిక్కిం రాష్ట్ర మాజీ గవర్నర్. (మ.2016).
డిసెంబరు 19 రాజ్సింగ్ దుంగార్పుర్, మాజీ క్రికెట్ క్రీడాకారుడు, బి.సి.సి.ఐ.మాజీ అధ్యక్షుడు.
డిసెంబరు 30 మాన్యువెల్ ఆరన్ భారతదేశపు చదరంగం ఆటగాడు.
భారత్
మరణాలు
మార్చి 9 గణేష్ ప్రసాద్, భారతీయ గణిత శాస్త్రవేత్త. ఈయన పొటెన్షియల్ సిద్ధాంతం, వాస్తవ చరరాశుల ప్రమేయాలు, ఫోరియర్ శ్రేణులు, ఉపరితల సిద్ధాంతం అనే గణిత విభాగాలలో ప్రత్యేకతను సంతరించుకున్న వ్యక్తి.
భారత్
మార్చి 16 జాన్ జేమ్స్ రికర్డ్ మెక్లియాడ్, నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త (జ. 1876).
ఆగస్టు 15 అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి ఆశుకవి, శతావధాని. (జ.1883).