సంఘటనలు
- ఏప్రిల్ 7 ఉప్పు సత్యాగ్రహంతో మొదలై నాలుగేళ్లు సాగిన శాసనోల్లంఘన ఉద్యమం అధికారికంగా ముగిసింది.
భారత్
- మే 27 రెండవ ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు ఇటలీలో ప్రారంభమయ్యాయి.
- జూలై 20 అయొవా రాష్ట్రం రికార్డు. అయొవా రాష్ట్రంలో ఉన్న 'కియోకుక్' లో 118 డిగ్రీల ఫారెన్ హీట్ (48 డిగ్రీల సెంటిగ్రేడ్).
- జూలై 21 గల్లిపొలిస్ (అమెరికాలోని ఓహియో రాష్ట్రం) లో 113 డిగ్రీల ఫారెన్హీట్ (45 డిగ్రీల సెంటిగ్రేడ్). ఇది ఓహియో రాష్ట్రంలో నమోదు అయిన రికార్డు.
- అక్టోబరు 2 భారత నావికాదళం ( అప్పటి పేరు రాయల్ ఇండియన్ నేవీ) స్థాపించబడింది.
భారత్
- అక్టోబరు 4 అరోరా ఫిలిం కంపెనీ భాగస్వామ్యంలో ‘సతీ అనసూయ’ చిత్రం మొదలైంది.
- అక్టోబరు 21 లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జాతీయ కార్యదర్శిగా, ఆచార్య నరేంద్రదేవ్ అధ్యక్షుడిగా 'కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ' ఆవిర్భావం.
జననాలు
- జనవరి 3 వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి , నాటక, సినీ గీత రచయిత(మ.1985).
- జనవరి 15 వి. ఎస్. రమాదేవి, భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనరు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గవర్నరు. (మ.2013).
భారత్
- ఫిబ్రవరి 8 పొత్తూరి వెంకటేశ్వర రావు, తెలుగు పత్రికారంగ ప్రముఖుడు.
- మార్చి 9 యూరీ గగారిన్, అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు. (మ.1968).
- మార్చి 15 కాన్షీరాం, భారతదేశంలో దళిత నేత (మ. 2006).
భారత్
- మార్చి 23 కె.బి.కె.మోహన్ రాజు, సినిమా నేపథ్యగాయకుడు, ఆకాశవాణి, దూరదర్శన్ కళాకారుడు. (మ.2018).
- మార్చి 30 సి.ధర్మారావు, తెలుగు భాషోద్యమ నాయకుడు, గాంధేయవాది. (మ.2013).
- ఏప్రిల్ 24 ఏడిద నాగేశ్వరరావు, తెలుగు సినిమా నిర్మాత. (మ.2015).
- మే 4 అక్కిరాజు రమాపతిరావు, పరిశోధనా రచనలు, జీవిత చరిత్రలు, సంపాదక వ్యాసాలు, సాహితీ విమర్శ రచయిత, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత.
- మే 19 పి.లీల, దక్షిణ భారత నేపథ్యగాయని, ఈమె తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో 15 వేలకు పైగా పాటలు పాడింది.
- జూన్ 5 చెన్నుపాటి విద్య, భారత పార్లమెంటు సభ్యురాలు, సంఘ సేవిక.
భారత్
- జూన్ 30 చింతామణి నాగేశ రామచంద్ర రావు, భారతీయ శాస్త్రవేత్త, భారతరత్న పురస్కార గ్రహీత.
భారత్
- జూలై 1 వంగపండు అప్పలస్వామి, తెలుగు కవి, రచయిత.
- ఆగస్టు 1 నవోదయ రామమోహనరావు ప్రచురణకర్త, హేతువాది, కమ్యూనిస్టు, విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు. (మ.2019).
- ఆగస్టు 2 వలెరి బైకొవ్స్కీ, రోదసీ యాత్రికుడు. (వోస్టోక్ 5, సోయుజ్ 22, 31 వ్యోమనౌకలలో ప్రయాణించాడు).
- ఆగస్టు 6 కొత్తపల్లి జయశంకర్, తెలంగాణా సిద్ధాంతకర్త, తెలంగాణా పితామహుడు. (మ.2011).
- ఆగస్టు 13 ఎక్కిరాల వేదవ్యాస, ఐ.ఏ.ఎస్ అధికారి, ఆధ్యాత్మిక గురువు, రచయిత, పరిశోధకుడు (మ. 2014).
- ఆగస్టు 28 ఎ.పి. కోమల, తెలుగు, తమిళం, మలయాళ గాయని. రేడియో కళాకారిణి.
- ఆగస్టు 30 బాలూ గుప్తె, భారతీయ క్రికెట్ ఆటగాడు. (మ.2005).
భారత్
- ఆగస్టు 31 రాజశ్రీ, సినిమా పాటల రచయిత. (మ.1994).
- సెప్టెంబరు 9 సోనియా శాంచెజ్, అమెరికన్ కవి.
- సెప్టెంబరు 23 పేర్వారం జగన్నాధం, తెలుగు కవి, విమర్శకుడు, విద్యావేత్త. (మ.2008).
- సెప్టెంబరు 30 అన్నా కష్ఫి, భారత-అమెరికన్ నటీమణి (మ. 2015).
భారత్
- అక్టోబరు 1 భువన్ చంద్ర ఖండూరి, భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు, ప్రస్తుత ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి.
భారత్
- అక్టోబరు 1 చేకూరి రామారావు, తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకులు, భాషా శాస్త్రవేత్త. (మ.2014).
- నవంబరు 7 బొమ్మన విశ్వనాథం, భారతీయ సాహిత్యాన్ని వంగభాషలోనికి అనువదించిన తెలుగువ్యక్తి.
- డిసెంబరు 9 అల్లం శేషగిరిరావు, తెలుగు కథారచయిత. (మ.2000).
- డిసెంబరు 11 సలీం దుర్రానీ, భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
భారత్
- డిసెంబరు 20 ఈడుపుగంటి వెంకట సుబ్బారావు, వ్యవసాయ శాస్త్రవేత్త (మ.2010).
- డిసెంబరు 27 లారిసా లాటినినా, సోవియట్ జిమ్నాస్ట్. ఒలింపిక్ క్రీడలలో 18 పతకాలను సాధించింది.
మరణాలు
- జూలై 4 మేరీ క్యూరీ, భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త. రెండు నోబెల్ బహుమతులు (భౌతిక, రసాయన శాస్త్రాలలో) గ్రహీత. (జ.1867).
- ఆగస్టు 2 పాల్ వాన్ హిందేన్బర్గ్ తన 86వ ఏట మరణింఛగా, అడాల్ఫ్ హిట్లర్ పదవిని స్వీకరించాడు.