జనవరి 9 నందమూరి బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ పాత్ర పోషించిన 'ఎన్టీఆర్: కథానాయకుడు' విడుదలైంది.
జనవరి 9 430 రోజుల్లో 125 నియోజకవర్గాల మీదుగా సాగిన జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసింది.
జనవరి 11 వినయ విధేయ రామ చిత్రంలో నటించిన రామ్ చరణ్, నిర్మాతగా సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని అందించారు.
ఫిబ్రవరి 1 మిథాలీ రాజ్ 200 వన్డేలు ఆడిన తొలి మహిళా క్రికెటర్గా రికార్డు నెలకొల్పారు.
భారత్
ఫిబ్రవరి 14 జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపురా సమీపంలో) కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడి కారణంగా 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సైనికులు, ఒక ఉగ్రవాది మరణించారు.
భారత్
ఫిబ్రవరి 22 నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ జీవితకథా చిత్రం రెండో భాగం 'ఎన్టీఆర్: మహానాయకుడు' విడుదలైంది.
మార్చి 26 నటి, మాజీ ఎంపీ జయప్రద భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారత్
ఏప్రిల్ 1 శత్రు రాడార్ల జాడ తెలిపే ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ఉపగ్రహం ఎమిశాట్ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.
భారత్
మే 30 వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
జూన్ 4 తెలుగు వికీపీడియా సభ్యుడు ప్రణయ్రాజ్ వంగరి 'వికీఛాలెంజ్' అనే కాన్సెప్ట్తో వరుసగా 1000రోజులు - 1000వ్యాసాలు రాసి, ప్రపంచం మొత్తం వికీపీడియాల్లో ఈ ఘనత సాధించిన మొదటి వికీపీడియన్గా చరిత్ర సృష్టించాడు. 2016, సెప్టెంబరు 8వ తేది నుండి తెలుగు వికీపీడియాలో ప్రతిరోజు ఒక వ్యాసం చొప్పున రాస్తూ 2019, జూన్ 4న 'వికీవెయ్యిరోజులు' పూర్తిచేశాడు.
జూన్ 21 కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభించబడింది.
జూన్ 27 ప్రపంచంలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ రికార్డు సాధించిన విజయనిర్మల హైదరాబాదులో మరణించారు.
జూలై 22 ఇస్రో రెండో చంద్ర యాత్ర చంద్రయాన్-2ను ఆర్బిటర్, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లతో జీఎస్ఎల్వీ మార్క్ 3 ద్వారా ప్రయోగించింది.
భారత్
ఆగస్టు 12 13 ఏళ్ల విరామం తర్వాత విజయశాంతి సినీ పునరాగమనాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు.
ఆగస్టు 13 శ్రీదేవి జయంతి నాడు మేడమ్ టుసాడ్స్ సింగపూర్ ఆమె మైనపు విగ్రహ ఏర్పాటును ప్రకటించింది.
భారత్
ఆగస్టు 27 సరోజినీ నాయుడు పేరిట నామకరణం చేసిన '5647 సరోజినీనాయుడు' గ్రహశకలం అధికారిక ప్రకటన ప్రచురితమైంది.
సెప్టెంబరు 7 చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగే చివరి క్షణాల్లో సంబంధాలు కోల్పోయింది.
భారత్
అక్టోబరు 2 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలను ప్రారంభించారు.
అక్టోబరు 2 ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా విడుదలైంది.
అక్టోబరు 9 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల ఆస్తుల పంపకంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శులతో చర్చలు జరిపారు.
నవంబరు 3 ఇసుక కొరతతో ఇబ్బందుల్లో ఉన్న నిర్మాణ కార్మికులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించారు.
డిసెంబరు 31 చైనాలోని వూహాన్ నగరంలో గుర్తుతెలియని న్యుమోనియా కేసులను చైనా ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదించింది — ఇదే తరువాత కోవిడ్-19 గా గుర్తించబడింది.
మరణాలు
జనవరి 10 వయ్యా సామేలు కవి, రచయిత, గాయకుడు. అతను తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు.
జనవరి 14 కట్టా రంగారావు తెలుగు సినిమా దర్శకుడు. (జ.1957).
జనవరి 15 మొదలి నాగభూషణశర్మ, రంగస్థల నటుడు, దర్శకుడు, నాటకకర్త, అధ్యాపకుడు, విమర్శకుడు, పరిశోధకుడు. (జ.1935).
ఫిబ్రవరి 4 పిళ్లా రామారావు స్వాతంత్ర్య సమరయోధుడు, ఆర్.ఎస్.ఎస్. నాయకుడు.
భారత్
ఫిబ్రవరి 10 చింతల కనకారెడ్డి, తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. మాజీ శాసనసభ సభ్యుడు. (జ.1951).
ఫిబ్రవరి 12 విజయ బాపినీడు, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1936).
ఫిబ్రవరి 18 దీవి శ్రీనివాస దీక్షితులు, రంగస్థల, సినిమా నటుడు, రంగస్థల దర్శకుడు. (జ.1956).
ఫిబ్రవరి 20 నంద్యాల శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాయకుడు, మాజీ శాసనసభ సభ్యుడు. (జ.1918).
ఫిబ్రవరి 20 వేదవ్యాస రంగభట్టర్ రంగస్థల నటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు, పాటల రచయిత. (జ.1946).
ఫిబ్రవరి 22 కోడి రామకృష్ణ తెలుగు సినిమా దర్శకుడు. (జ.1949).
ఫిబ్రవరి 26 తెలుగు పండితుడు, అధ్యాపకుడు, రచయిత, విమర్శకుడు, ద్వాదశి నాగేశ్వరశాస్త్రి.
మార్చి 6 కటికితల రామస్వామి, సుప్రీం కోర్టు న్యాయమూర్తి, జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు. (జ.1932).
మార్చి 15 విలియం స్టాన్లీ మెర్విన్ అమెరికాకు చెందిన కవి, రచయిత, అనువాదకుడు, యుద్ధ వ్యతిరేక కార్యకర్త. (జ.1927).
మార్చి 15 వై.ఎస్.వివేకానందరెడ్డి భారత పార్లమెంటు సభ్యుడు. (జ.1950).
భారత్
మార్చి 18 బొమ్మ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. మాజీ శాసన సభ్యుడు.
ఏప్రిల్ 7 బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి రంగస్థల నటుడు. స్త్రీ పాత్రలద్వారా పేరుగడించాడు. (జ.1936).
ఏప్రిల్ 30 ఎస్. పి. వై. రెడ్డి పార్లమెంట్ సభ్యుడు, పారిశ్రామికవేత్త (జ.1950).
భారత్
మే 1 బి. సుభాషణ్ రెడ్డి కేరళ, మద్రాసు హైకోర్టుల ప్రధాన ఛీఫ్ జస్టీస్ (జ.1943).
భారత్
మే 5 అరుణోదయ రామారావు విప్లవ సాంస్కృతోద్యమనేత, కళాకారుడు, ప్రజా గాయకుడు, కవి (జ.1955).
మే 7 గుండా రామిరెడ్డి తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు. (జ.1919).
మే 17 రాళ్ళపల్లి వెంకట నరసింహ రావు, తెలుగు చలనచిత్ర నటుడు (జ.1945).
మే 21 బొద్దులూరి నారాయణరావు తెలుగు కవి, పండితుడు. (జ.1925).
మే 22 చెరుకుమల్లి సూర్యప్రకాశ్ అంతర్జాతీయ స్థాయి ఆయిల్, అక్రిలిక్, అబ్స్ట్రాక్ట్ చిత్రకారుడు. (జ.1940).
మే 25 బండారు శారారాణి తెలంగాణకు చెందిన రాజకీయనాయకురాలు. మాజీ ఎమ్మెల్యే. (జ.1964).