ఈ రోజు విశేషం
1923 ఆంధ్రా బ్యాంకు స్థాపించబడింది.
తెలుగు నాట ఈ రోజు
- 1923 ఆంధ్రా బ్యాంకు స్థాపించబడింది.
జననాలు
- 1750 టిప్పు సుల్తాన్, మైసూరు రాజు. (మ.1799).
- 1858 జగదీశ్ చంద్ర బోస్, బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త. (మ.1937).
- 1909 ప్రయాగ నరసింహశాస్త్రి, ఆకాశవాణి ప్రయోక్త, తెలుగు నటుడు. (మ.1983).
- 1925 చుక్కా రామయ్య, విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, శాసనండలి సభ్యుడు.
- 1927 సంపత్ కుమార్, ఈయనను ఆంధ్ర జాలరిగా వ్యవహరిస్తారు. ఇతడు భారతదేశంలో శాస్త్రీయ, జానపద నృత్యములలోను, కొరియోగ్రఫీలలో పేరుగాంచాడు.. (మ.1999).
- 1930 కొండపల్లి పైడితల్లి నాయుడు, 11వ, 12వ, 14వ లోక్సభ లకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు. (మ.2006). భారత్
- 1950 దేవా,చలనచిత్ర సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు.
- 1951 గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు, కవి, రచయిత.
- 1956 వంశీ, తెలుగు సినిమా దర్శకుడు, రచయిత.
- 1969 శిల్పా శిరోద్కర్ , హిందీ, తెలుగు చిత్రాల నటి.
- 1994 ప్రియాంక అరుల్ మోహన్ , తెలుగు,తమిళ కన్నడ చిత్రాల నటి.
మరణాలు
- 1910 లియో టాల్స్టాయ్, సోవియట్ యూనియన్ (రష్యా) కు చెందిన రచయిత. (జ.1828).
- 1963 జీ: రామనాదన్ , సంగీత దర్శకుడు ,.
సినిమా
- 2020 'అనగనగా ఓ అతిథి' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం.