ఈ రోజు విశేషం
1987 దూరదర్శన్ తెలుగు ప్రసారాలు పూర్తిస్థాయిలో హైదరాబాదు నుంచే ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని 16 ప్రాంతాలలో ఉన్న ట్రాన్స్మిటర్లను ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రానికి అనుసంధానించారు. అంతకు ముందు ఢిల్లీ నుంచి ప్రసారమయ్యే హిందీ కార్యక్రమాలనూ హైదరాబాద్ కేంద్రం నుంచి రోజులో కొద్దిసేపు మాత్రమే ప్రసారమయ్యే తెలుగు ప్రసారాలనే ప్రేక్షకులు చూసేవారు.
తెలుగు నాట ఈ రోజు
- 1937 ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు కృష్ణా జిల్లా చిన నందిగామలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. పూర్తి ప్రస్థానం →
- 1951 హాస్యబ్రహ్మగా పేరొందిన రచయిత, దర్శకుడు జంధ్యాల పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. పూర్తి ప్రస్థానం →
- 1987 దూరదర్శన్ తెలుగు ప్రసారాలు పూర్తిస్థాయిలో హైదరాబాదు నుంచే ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని 16 ప్రాంతాలలో ఉన్న ట్రాన్స్మిటర్లను ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రానికి అనుసంధానించారు. అంతకు ముందు ఢిల్లీ నుంచి ప్రసారమయ్యే హిందీ కార్యక్రమాలనూ హైదరాబాద్ కేంద్రం నుంచి రోజులో కొద్దిసేపు మాత్రమే ప్రసారమయ్యే తెలుగు ప్రసారాలనే ప్రేక్షకులు చూసేవారు.
- 2004 వర్షం చిత్ర విజయంతో ప్రభాస్ తెలుగు సినీ రంగంలో స్టార్గా నిలదొక్కుకున్నారు. పూర్తి ప్రస్థానం →
- 2005 భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బి.ఎస్.ఎన్.ఎల్) బెంగళురు, చెన్నై, హైదరాబాద్, కోల్కత లలో బ్రాడ్బాండ్ సేవలను మొదలు పెట్టింది. మరొక 198 నగరాలకు ఈ సేవలను విస్తరిస్తామని ప్రకటించింది.
- 2014 అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోస్ ఆవిర్భావ వేడుకల్లో చివరిసారిగా ప్రజల ముందు కనిపించారు. పూర్తి ప్రస్థానం →
- 2025 'సంక్రాంతికి వస్తున్నాం'తో దగ్గుబాటి వెంకటేష్ సీనియర్ హీరోల్లో 300 కోట్ల వసూళ్లు సాధించిన తొలి కథానాయకుడిగా నిలిచారు. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1690 జర్మనీలోని న్యూరెంబర్గ్కు చెందిన జాన్ సి. డెన్నర్ 'క్లారినెట్' వాద్యాన్ని రూపొందించారు.
- 1760 ఫ్రెంచి వారి అధీనంలో ఉన్న పాండిచ్చేరిని బ్రిటిష్ కెప్టెన్ ఐరీకూట్ (Sir Eyre Coote) స్వాధీనం చేసుకున్నాడు. భారత్
- 1761 మరాఠాలూ అఫ్గాన్ల మధ్య మూడో పానిపట్టు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అహ్మద్షా అబ్దాలీ సేన విజయం సాధించింది.
- 1892 'గ్రాండ్ ఓల్డ్మ్యాన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్'గా పేరొందిన దినకర్ బల్వంత్ దేవధర్ జననం. ఆయన పేరు మీదే దేవధర్ ట్రోఫీ నిర్వహిస్తారు.
- 1964 ఇంగ్లండుతో జరిగిన ఓ టెస్టుమ్యాచ్లో భారత బౌలర్ బాపూ నాదకర్ణి వరుసగా 21 మెయిడెన్ ఓవర్లు విసిరి రికార్డు సృష్టించాడు. వికెట్లేమీ తీసుకోకున్నా ఆ మ్యాచ్లో అతను 32 ఓవర్లు వేసి ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. భారత్
- 1969 మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చారు. భారత్
- 1998 గానకోకిల ఎం.ఎస్.సుబ్బలక్ష్మికి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. భారత్
జననాలు
- 1856 న్యాపతి సుబ్బారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, సంస్కరణవాది, సాహిత్యవేత్త, పాత్రికేయుడు. (మ. 1941]. భారత్
- 1888 ముత్తరాజు సుబ్బారావు , నాటక రచయిత, శ్రీకృష్ణతులాభారం , పద్యాలు, ప్రసిద్ది(మ.1922).
- 1896 సి.డి.దేశ్ముఖ్, భారత ఆర్థికవేత్త, దుర్గాబాయి దేశ్ముఖ్ భర్త. (మ.1982). భారత్
- 1912 టిల్లీ అల్సెన్, అమెరికన్ రచయిత్రి (మ.2007).
- 1926 కె.బి. తిలక్, స్వాతంత్ర్య సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత. (మ.2010). భారత్
- 1926 మహా శ్వేతాదేవి, నవలా రచయిత, సామాజిక కార్యకర్త. (మ2016).
- 1930 చిత్తజల్లు వరహాలరావు, నాస్తికయుగం మాసపత్రిక సంపాదకవర్గ సభ్యులుగా పనిచేశారు.
- 1937 రావు గోపాలరావు, తెలుగు సినిమా నటుడు. (మ.1994).
- 1937 శోభన్ బాబు, తెలుగు కథానాయకుడు. (మ.2008).
- 1938 ఇందిరా నాథ్, భారతీయ మహిళా శాస్త్రవేత్త. భారత్
- 1951 జంధ్యాల, తెలుగు సినిమా దర్శకుడు, మాటల రచయిత. (మ.2001).
- 1956 నాగభైరవ జయప్రకాశ్ నారాయణ్, లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు.
- 1977 నారాయణ్ కార్తికేయన్, భారతదేశానికి చెందిన మొదటి ఫార్ములా వన్ మోటార్ రేసింగ్ డ్రైవరు. భారత్
- 1977 నిమిషా వేదాంతి, భూగర్భ చమురు నిల్వలపై పరిశోధన చేసిన శాస్త్రజ్ఞురాలు.
- 1990 మణి రవి వాల్మీకి, వాల్మీకి బోయ ఎస్టీ సాధన ఉద్యమకారుడు, ఉమ్మడి అనంతపురం జిల్లా వాల్మీకి బోయ సంఘం అధ్యక్షుడిగా పనిచేశాడు, తెలుగుదేశం పార్టీ వాల్మీకి బోయ సాధికార కమిటీ స్టేట్ డైరెక్టర్.
మరణాలు
- 1937 జయశంకర్ ప్రసాద్, ఆధునిక హిందీ సాహిత్యవేత్త. భారత్
- 1960 హెచ్ ఎం.రెడ్డి , తెలుగు సినీ దర్శకుడు.(జ.1892).
- 1973 నారు నాగ నార్య, 1949నుండి సాహిత్యంవైపు దృష్టి మరలించాడు. ఇతనికి వైద్యవిద్యలో ప్రవేశం ఉంది.
- 1979 కేసనపల్లి లక్ష్మణకవి, సహజకవి, పండితుడు, విమర్శకుడు, పౌరాణికుడు. (జ.1902).
- 1980 ముదిగొండ లింగమూర్తి, పాత తరానికి చెందిన నటుడు. హాస్యం, క్రౌర్యం, శోకం లాంటి అన్ని పాత్రలలో రాణించిన అద్భుతమైన సహాయ నటుడు.
- 2016 మౌలానా అబ్దుల్ రహీం ఖురేషీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకుడు. రాముడు అయోధ్యలో కాదు, పాకిస్థాన్లో పుట్టినట్లుగా ఉర్దూలో పుస్తకం రాసి సంచలనం సృష్టించాడు. (జ.1935). భారత్
- 2017 సూర్జీత్ సింగ్ బర్నాలా, రాజకీయ నాయకుడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1925). భారత్
- 2019 కట్టా రంగారావు తెలుగు సినిమా దర్శకుడు. (జ.1957).
- 2022 మల్లాది చంద్రశేఖరశాస్త్రి, ప్రముఖ పండితుడు, పురాణ ప్రవాచకుడు. (జ.1925).
సినిమా
- 1958 'భూలోక రంభ' చిత్రం విడుదలైంది.
- 1959 'అప్పుచేసి పప్పుకూడు' చిత్రం విడుదలైంది.
- 1965 'దొంగలకు దొంగ (1966 సినిమా)' చిత్రం విడుదలైంది.
- 1977 'కురుక్షేత్రం' చిత్రం విడుదలైంది.
- 1981 'ప్రేమ సింహాసనం' చిత్రం విడుదలైంది.
- 1989 'రాజకీయ చదరంగం' చిత్రం విడుదలైంది.
- 1997 'శుభాకాంక్షలు' చిత్రం విడుదలైంది.
- 1998 'ఖైదీగారు' చిత్రం విడుదలైంది.
- 2002 'నువ్వు లేక నేను లేను' చిత్రం విడుదలైంది.
- 2004 'వర్షం' చిత్రం విడుదలైంది.
- 2005 'ధన 51' చిత్రం విడుదలైంది.
- 2025 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం విడుదలైంది.
- 2026 'నారీ నారీ నడుమ మురారి (2026 సినిమా)' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- ప్రపంచ లాజిక్ డే.
- అంతర్జాతీయ గాలిపటాల దినోత్సవం.