ఈ రోజు విశేషం
1971 కె.వి.రెడ్డి దర్శకత్వంలో ఎన్.టి.రామారావు నటించిన శ్రీకృష్ణసత్య విడుదలై మంచి విజయం సాధించింది.
తెలుగు నాట ఈ రోజు
- 1971 కె.వి.రెడ్డి దర్శకత్వంలో ఎన్.టి.రామారావు నటించిన శ్రీకృష్ణసత్య విడుదలై మంచి విజయం సాధించింది. పూర్తి ప్రస్థానం →
- 2005 తెలుగు సినిమా తొలి మహిళా సూపర్స్టార్ భానుమతీ రామకృష్ణ చెన్నైలోని స్వగృహంలో మరణించారు. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1865 శ్వేతజాతి ఆధిపత్యం తగ్గిపోవడాన్ని సహించలేని కొందరు దురహంకారులు కుక్లక్స్ క్లాన్ అనే సంస్థను స్థాపించారు. ఆ తర్వాత ఆ సంస్థ సభ్యులు నల్లజాతివారిపై చేసిన అత్యాచారాలకు అంతేలేదు.
- 1914 మొదటి ప్రపంచయుద్ధంలో భాగంగా జర్మనీ-బ్రిటన్ల మధ్య పోరు జరుగుతోంది. డిసెంబర్ 24 రాత్రి జర్మన్ సైనికులు తమ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కొవ్వొత్తులతో అలంకరించి పాటలు పాడటం ప్రారంభించారు. ఇంగ్లిష్ సైనికులు కూడా వారితో గొంతు కలిపారు. ఇరుపక్షాల సైనికులూ సిగార్లూ మద్యంసీసాలు బహుమతులుగా ఇచ్చిపుచ్చుకున్నారు. క్రిస్మస్ ట్రూస్గా పేరొందిన ఇలాంటి సంఘటన ప్రపంచ చరిత్రలో మరెప్పుడూ జరగలేదు.
- 1925 ప్రాట్ & విట్నీ మొట్టమొదటి విమాన ఇంజెను తయారుచేయటం పూర్తిచేసింది.
- 1968 నాసా అంతరిక్షనౌక అపోలో 8లో ప్రయాణించిన వ్యోమగాములు చంద్రుడి కక్ష్యలో ప్రవేశించి ఆ ఘనత సాధించిన తొలి మానవులుగా చరిత్ర పుటలకెక్కారు.
- 1986 పార్లమెంటు ఆమోదించిన 'వినియోగదారుల హక్కుల రక్షణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. నాటి నుంచి ఈ రోజును జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా జరుపుకొంటున్నాం. భారత్
- 1989 మనదేశంలో మొట్టమొదటి ఎమ్యూజ్మెంట్ పార్క్ 'ఎస్సెల్ వరల్డ్' ముంబయిలో ప్రారంభమైంది.
- 1999 ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కామ్దహార్కు హైజాక్ చేయబడింది.
- 1999 కాఠ్మండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండియన్ ఎయిర్లైన్ విమానాన్ని టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తీవ్రవాదులు హైజాక్ చేశారు. భారత్
- 2000 భారత్కు చెందిన చదరంగం ఆటగాడు, విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ ఛాంపియనయ్యాడు. ఆ ఘనత సాధించిన తొలి ఆసియా ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్. భారత్
- 2002 ఢిల్లీ మెట్రో రైల్వేను ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి ప్రారంభించాడు. భారత్
- 2025 ఇస్రో ఎల్వీఎం3-ఎం6 ద్వారా 6,100 కిలోల బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది; భారత గడ్డ నుంచి ఎగిరిన అత్యంత బరువైన విదేశీ ఉపగ్రహం ఇదే. భారత్ పూర్తి ప్రస్థానం →
జననాలు
- 1907 బులుసు వెంకట రమణయ్య, తెలుగు కవి, రచయిత. (మ.1989).
- 1924 మహమ్మద్ రఫీ, హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు భాషల సినిమా నేపథ్యగాయకుడు. (మ.1980).
- 1924 సి.కృష్ణవేణి, తెలుగు సినిమా నటీమణి, గాయని, నిర్మాత.
- 1956 అనిల్ కపూర్, భారతీయ నటుడు, నిర్మాత. భారత్
మరణాలు
- 1924 గరికిపర్తి కోటయ్య దేవర, సంగీత విద్వాంసుడు, ఆంధ్రగాయక పితామహుడు అనే బిరుదును పొందినవాడు. (జ.1864).
- 1987 ఎం.జి.రామచంద్రన్, సినిమా నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. (జ.1917). భారత్
- 1988 మోదుకూరి జాన్సన్, నటులు, నాటక కర్త. (జ.1936).
- 2005 భానుమతి, దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు. (జ.1925). భారత్
- 2022 తునీషా శర్మ, భారతీయ టెలివిజన్, చలనచిత్ర నటి. (జ.2002). భారత్
- 2024 మోతె జగన్నాథం, తెలంగాణకు చెందిన చెక్కతీగల తోలుబొమ్మలాట కళాకారుడు.
సినిమా
- 1982 'యువరాజు' చిత్రం విడుదలైంది.
- 1992 'ప్రాణదాత' చిత్రం విడుదలైంది.
- 2020 'మర్డర్ (2020 సినిమా)' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం.
- జాతీయ వినియోగారుల హక్కుల దినోత్సవం.