ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 5 భారతదేశంలో అమ్మకపు పన్ను చట్టం అమల్లోకి వచ్చింది. భారత్
  • జనవరి 20 భారత దేశపు మొట్టమొదటి అణు రియాక్టర్, అప్సరను ట్రాంబేలో ప్రారంభించారు. భారత్
  • జనవరి 26 జమ్మూ కాశ్మీరు రాష్ట్రం అవతరించింది. భారత్
  • మార్చి 22 భారత ప్రభుత్వం శకసంవత్సరాన్ని జాతీయ సంవత్సరంగా స్వీకరించింది.ఈ క్యాలెండర్ 365 రోజులు, 12 నెలలను కలిగి, మార్చి 22న ప్రారంభమవుతుంది, ఇది లీపు సంవత్సరంలో మార్చి 21కి అనుగుణంగా ఉంటుంది. భారత్
  • మార్చి 27 కె.వి.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన కళాఖండం మాయాబజార్ విడుదలైంది.
  • ఏప్రిల్ 1 డబ్బు, కానీ, అర్ధణా, అణా, బేడ అన్న 'డబ్బు', 'రూపాయి' లను 1 ఏప్రిల్ 1957 నుంచి నయాపైసలు, పైసలు, ఐదు పైసలు, పదిపైసలు అన్న దశాంశ పద్ధతిని ప్రవేశ పెట్టారు. భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, తూనికలు కొలతలకు 1 అక్టోబరు 1958 న ప్రవేశ పెట్టారు. భారత్
  • ఏప్రిల్ 5 భారతదేశంలో కేరళలో మొదటిసారిగా కమ్యూనిస్టులు విజయం సాధించారు.ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరించారు. భారత్
  • మే 20 ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు హైదరాబాదులో కన్నుమూశారు.
  • మే 24 తైవాన్ లోని 'తైపే' లో అమెరికాకు వ్యతిరేకంగా ఆందోళన చేసారు.
  • మే 24 కొలంబియాలో భయంకరమైన భూకంపం వచ్చింది.
  • జూన్ 20 సోవియట్ రష్యా తొలి ఉపగ్రహం స్పుత్నిక్ 1ని అంతరిక్షంలోకి పంపింది.
  • జూలై 1 ప్రపంచ భూ భౌతిక సంవత్సరంగా 1957 సంవత్సరాన్ని, యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది.
  • జూలై 29 అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఏర్పాటైంది.
  • ఆగస్టు 1 భీమసేన్ సచార్, ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా పదవీస్వీకారం (1957 ఆగష్టు 1 నుంచి 1962 సెప్టెంబరు 6 వరకు).
  • ఆగస్టు 3 తుంకు అబ్దుల్ రహ్మాన్, స్వతంత్ర మలేషియా దేశానికి, దేశాధిపతిగా, 5 సంవత్సరాలకి ఎన్నికయ్యాడు.
  • ఆగస్టు 29 స్ట్రామ్ థర్మాండ్, అమెరికన్ సెనేట్ లో 24 గంటలకు పైగా సివిల్ రైట్స్ బిల్లు పై వ్యతిరేకంగా మాట్లాడి రికార్డు సృష్టించాడు. ఆ బిల్లు పాస్ అయ్యింది.
  • అక్టోబరు 3 రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. భారత్
  • అక్టోబరు 4 సోవియట్ యూనియన్ మొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్‌ని విజయవంతంగా ప్రయోగించింది. ఇక్కడ నుండే అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య అంతరిక్ష పోటీ ప్రారంభమైందని నమ్ముతారు.

జననాలు

  • జనవరి 2 ఎ.వి.ఎస్., తెలుగు సినిమా హాస్యనటుడు, రచయిత, దర్శకులు, నిర్మాత, రాజకీయనాయకుడు. (మ.2013).
  • జనవరి 4 గురుదాస్ మాన్, పంజాబ్ కు చెందిన గాయకుడు, రచయిత, నృత్య దర్శకుడు,, నటుడు. భారత్
  • జనవరి 26 శివలాల్ యాదవ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. భారత్
  • జనవరి 30 ప్రియదర్శన్ , దక్షిణ భారతీయ చలనచిత్ర దర్శకుడు. భారత్
  • ఫిబ్రవరి 1 జాకీ ష్రాఫ్, భారతదేశానికి చెందిన సినిమా నటుడు. భారత్
  • ఫిబ్రవరి 8 వై.విజయ , తెలుగు సినీ నటి, నృత్య కారిణి.
  • ఫిబ్రవరి 23 కింజరాపు ఎర్రన్నాయుడు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి. (మ.2012).
  • మార్చి 15 నామా నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపారవేత్త మరియూ రాజకీయ నాయకుడు.
  • మార్చి 17 నామా నాగేశ్వరరావు, వ్యాపారవేత్త మరియూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు.
  • మార్చి 25 శ్రీరామోజు హరగోపాల్, చరిత్ర పరిశోధకులు, కవి, వ్యాసకర్త.
  • ఏప్రిల్ 19 ముకేష్ అంబానీ, రిలయన్స్ కంపెనీ అధినేత.
  • ఏప్రిల్ 19 రాసాని వెంకట్రామయ్య, కథ, నవల, నాటక రచయిత, విమర్శకుడు.
  • ఏప్రిల్ 23 జి.వి. పూర్ణచందు, తెలుగు భాషోద్యమ ముఖ్యుడు. ఆయుర్వేద పట్టభద్ర వైద్యుల సంక్షేమం కోసం నేషనల్ మెడికల్ అసోసియేషన్ వ్యస్థాపకుల్లో ఒకరు.
  • మే 22 సీమ, భారతీయ సినిమా నటి.(మళయాళ దర్శకుడుఐ.వి.శశి భార్య). భారత్
  • జూన్ 8 డింపుల్ కపాడియా, భారత సినిమా నటి. భారత్
  • జూన్ 25 ఎన్.గోపి, తెలుగు పండితుడు, కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి.
  • జూలై 9 లక్ష్మీపతి, తెలుగు హాస్యనటుడు (మ.2008).
  • జూలై 12 శ్రీలక్ష్మి రేబాల, నటి, భరతనాట్య కళాకారిణి.
  • ఆగస్టు 14 జానీ లీవర్: భారతీయ సినీ హాస్యనటుడు. భారత్
  • ఆగస్టు 21 రేకందార్ ప్రేమలత, రంగస్థల నటీమణి.
  • ఆగస్టు 27 నూతలపాటి వెంకటరమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి. భారత్
  • సెప్టెంబరు 9 జయచిత్ర , తెలుగు ,తమిళ చిత్రాల నటి.
  • సెప్టెంబరు 21 కెవిన్ రడ్డ్, ఆస్ట్రేలియా 26 వ ప్రధానమంత్రి. భారత్
  • సెప్టెంబరు 23 కుమార్ సాను, గాయకుడు.
  • అక్టోబరు 30 శిఖామణి, కవి.
  • నవంబరు 7 వై.విజయ, తెలుగు సినిమా నటి, నృత్య కళాకారిణి.
  • నవంబరు 10 శోభారాజు, గాయనీ, సంగీతదర్శకురాలు, రచయిత , అన్నమయ్య కీర్తనలు ప్రాచుర్యంలో విశేష కృషి.
  • నవంబరు 13 ఇ.జి.సుగవనం, తమిళనాడులోని డి.ఎం.కె.పార్టీకి చెందిన రాజకీయనాయకుడు. మాజీ పార్లమెంటు సభ్యుడు. భారత్
  • నవంబరు 30 శోభారాజు, గాయని.
  • నవంబరు 30 వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, సినీ గేయ సంభాషణల రచయిత (మ.2021).

మరణాలు

  • మార్చి 15 కుమారస్వామి రాజా, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఒడిషా మాజీ గవర్నరు. భారత్
  • ఏప్రిల్ 30 దుర్భాక రాజశేఖర శతావధాని, లలిత సాహిత్య నిర్మాత, పండితుడు, శతావధాని. (జ.1888).
  • మే 20 టంగుటూరి ప్రకాశం పంతులు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి (జ.1872).
  • జూలై 17 ఓగిరాల రామచంద్రరావు, పాత తరం తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. (జ.1905).
  • జూలై 21 బెర్నార్డ్ స్పూనర్, అమెరికాలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను వ్యక్తి.

సినిమా

  • మార్చి 27 'మాయాబజార్' చిత్రం విడుదలైంది.
  • జూన్ 14 'ఉత్తమ ఇల్లాలు (1958 సినిమా)' చిత్రం విడుదలైంది.
  • జూలై 19 'దొంగల్లో దొర (1957 సినిమా)' చిత్రం విడుదలైంది.
  • సెప్టెంబరు 20 'కొండవీటి దొంగ (1958 సినిమా)' చిత్రం విడుదలైంది.
  • అక్టోబరు 22 'సౌభాగ్యవతి (1959 సినిమా)' చిత్రం విడుదలైంది.

ఈ సంవత్సరపు ప్రస్థానాలు