ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1260 కుబ్లైఖాన్ మంగోల్ చక్రవర్తి అయ్యాడు.
  • 1494 క్రిస్టోఫర్ కొలంబస్ జమైకా ద్వీపాన్ని కనుగొన్నాడు.
  • 1912 ఐదవ ఒలింపిక్ క్రీడలు స్టాక్‌హోమ్ లో ప్రారంభమయ్యాయి.
  • 1945 డెన్మార్క్, నాజీ కబందహస్తాలనుంచి, విడుదలైంది.
  • 1956 మొదటి ప్రపంచ జూడో ఛాంపియన్‌షిప్ పోటీలు, జపాన్‌ లోని టొక్యో నగరంలో జరిగాయి.
  • 1958 అమెరికా, ఎన్వెటక్ అనే చోట, వాతావరణంలో, అణుబాంబును పేల్చి, పరీక్షించింది.
  • 1961 అలన్ షెపర్డ్ [http://en.wikipedia.org/wiki/Alan_Shepard], మొదటి అమెరికన్ రోదసీ యాత్రికుడు (రోదసీ నౌక పేరు: ఫ్రీడం 7).
  • 1970 అమెరికా, నెవడా పరీక్షా కేంద్రంలో, అణుబాంబును పేల్చి, పరీక్షించింది.
  • 1979 రోదసీ నౌక వాయేజర్ 1 [http://en.wikipedia.org/wiki/Voyager_1], జూపిటర్ గ్రహాన్ని దాటి తన ప్రయాణాన్ని విశ్వాంతరాళంలోకి కొనసాగిస్తున్నది.
  • 1987 ప్రాన్స్, మురౌరా దీవిలో, అణుబాంబును పేల్చి, పరీక్షించింది.

జననాలు

  • 1818 కార్ల్ మార్క్స్, జర్మన్ శాస్త్రవేత్త, తత్త్వవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త, పాత్రికేయుడు, సోషలిస్టు విప్లవకారుడు.(మ.1883).
  • 1895 జ్ఞానాంబ, తెలుగు రచయిత్రి.
  • 1917 జి.ఎస్.రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరపున మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం ఎమ్.పి.గా 1967-1970, 1977-79, 1980-1984లలో ఎన్నికయ్యారు. భారత్
  • 1930 పిఠాపురం నాగేశ్వరరావు, సినీ సంగీత దర్శకులు.
  • 1930 జస్టిస్ సర్దార్ అలీ ఖాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన న్యాయమూర్తి. (మ. 2012).
  • 1946 రమాప్రభ, హాస్య నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న రమాప్రభ ఎన్నో సినిమాల్లో, ఎంతోమంది సరసన నటించింది.
  • 1946 అక్కినేని కుటుంబరావు, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత.
  • 1958 కొక్కుల పద్మావతి, కథా రచయిత, అనువాదకురాలు.
  • 1963 సబితా ఇంద్రారెడ్డి, మంత్రివర్గంలో కీలకమైన హోంశాఖా మంత్రి పదవిని పొంది హోంశాఖా మంత్రిపదవిని అధిష్టించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది.
  • 1986 విశాఖ సింగ్ , టాలీవుడ్, బాలీవుడ్ చలనచిత్ర నటి , నిర్మాత.
  • 1989 లక్ష్మీ రాయ్, భారతీయ సినీ నటి, మోడల్. భారత్

మరణాలు

  • 1821 నెపోలియన్, ఫ్రెంచ్ చక్రవర్తి. (జ.1769).
  • 1970 జి.వి. కృపానిధి, పలు ఆంగ్లపత్రికలకు సంపాదకుడిగా పనిచేసిన తెలుగువాడు. (జ.1896).
  • 1995 నాగభూషణం, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (జ.1921).
  • 2011 క్లాడ్ ఛౌల్స్ (బ్రిటన్ లో పుట్టాడు) 110వ సంవత్సరాల వయసులో పశ్చిమ ఆస్ట్రేలియాలో మరణించాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో రాయల్ నేవీ తరపున పోరాడి, 2011 మే 5 వరకు బ్రతికిన చివరి యోధుడు. (జ. 1901).
  • 2017 లీలా సేథ్ ఢిల్లీ హైకోర్టుకు మొదటి మహిళా న్యాయమూర్తి. (జ.1930). భారత్
  • 2019 అరుణోదయ రామారావు విప్లవ సాంస్కృతోద్యమనేత, కళాకారుడు, ప్రజా గాయకుడు, కవి (జ.1955).

పండుగలు, జాతీయ దినాలు

  • వరల్డ్ అథ్లెటిక్స్ దినోత్సవం.
  • అంతర్జాతీయ మంత్రసానుల దినోత్సవం.
  • ప్రపంచ చేతి పరిశుభ్రత దినోత్సవం.