పొట్టి శ్రీరాములు
అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు. గాంధీజీ శిష్యుడిగా ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని, హరిజనోద్ధరణకు జీవితాంతం కృషి చేశారు. ఆయన బలిదానం భారతదేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మార్గం వేసింది.
-
1901 మార్చి 16
అమరజీవి పొట్టి శ్రీరాములు మద్రాసు జార్జిటౌన్లో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు.
-
1928
బిడ్డను, భార్యను కోల్పోయిన పొట్టి శ్రీరాములు వైరాగ్యంతో ఉద్యోగానికి రాజీనామా చేసి సబర్మతి ఆశ్రమం చేరారు.
-
1930
ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న పొట్టి శ్రీరాములు జైలుశిక్ష అనుభవించారు.
-
1942
క్విట్ ఇండియా ఉద్యమం, వ్యక్తిగత సత్యాగ్రహాల్లో పాల్గొన్న పొట్టి శ్రీరాములు మూడుసార్లు జైలుకెళ్లారు.
-
1943
నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి పొట్టి శ్రీరాములు విస్తృతంగా కృషి చేశారు.
-
1946
నెల్లూరు మూలపేట వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశం కోసం పొట్టి శ్రీరాములు దీక్ష చేసి సాధించారు.
-
1946
మద్రాసు ప్రొవిన్సు దేవాలయాలన్నింటిలో హరిజనుల ప్రవేశం కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు.
-
1952 అక్టోబరు 19
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు మద్రాసులో బులుసు సాంబమూర్తి ఇంట నిరాహారదీక్ష ఆరంభించారు.
-
1952 డిసెంబరు 15
58 రోజుల ఆమరణ దీక్షతో పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం రాత్రి 11.23 గంటలకు ప్రాణత్యాగం చేశారు.
-
1952 డిసెంబరు 19
పొట్టి శ్రీరాములు బలిదానంతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును ప్రధాని నెహ్రూ ప్రకటించారు.
-
1953 అక్టోబరు 1
పొట్టి శ్రీరాములు త్యాగఫలంగా కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది.
-
1956 నవంబరు 1
పొట్టి శ్రీరాములు సాధించిన ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ విలీనమై హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.
-
2000 మార్చి 16
అమరజీవి పొట్టి శ్రీరాములు గౌరవార్థం తపాలా శాఖ ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసింది.
-
2008
నెల్లూరు జిల్లా పేరును శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు.