ఆనాడు

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • 2007 నకిలీ పాసుపోర్టుల కుంభకోణంలో పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తెరాస అగ్రనేత ఆలె నరేంద్రను పార్టీ నుండి సస్పెండు చేసారు.
  • 2011 2011 ఏప్రిల్ 1 నుంచి 2011 ఏప్రిల్ 25 వరకు భారతదేశంలో, వెండి ధర 75,770 రూపాయలకు చేరి, రికార్డు స్థాపించింది. (1 ఏప్రిల్ నుంచి 2011 ఏప్రిల్ 25 వరకు ఉన్న 25 రోజులలో వెండి 31% ఎక్కువ పెరిగింది). ఈ నెలంతా, బంగారం, వెండ్ వ్యాపారులు వెండిని సరఫరా చేయలేక, ముందుగా కొంత డబ్బు కట్టించుకుని, వారం రోజుల తరువాత వెండిని ఇచ్చేవారు. భారత్

జననాలు

  • 1874 గూగ్లి ఎల్మో మార్కోని, రేడియో కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ. 1937).
  • 1893 త్యాగబీర్ హేమ్ బారువా, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త, రచయిత (మ.1945). భారత్
  • 1900 వోల్ఫ్‌గాంగ్ ఎర్నస్ట్ పౌలీ, ఆస్ట్రేలియా భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ. 1958).
  • 1943 దేవిక, తెలుగు,తమిళ, మళయాళ చిత్రాల నటీ(మ.2002).
  • 1971 బోయపాటి శ్రీను , తెలుగు సినిమా దర్శకుడు.
  • 1987 మల్లికా కపూర్, దక్షిణ భారత చలన చిత్ర నటి. భారత్

మరణాలు

  • 68: మార్క్ ద ఎవాంజెలిస్ట్, అలెగ్జాండ్రియా లోని మొదటి పోప్, అలెగ్జాండ్రియా చర్చి స్థాపకుడు.
  • 1744 అండర్స్ సెల్సియస్ స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త. ఉష్ణోగ్రతయొక్క ఒక కొలమానాన్ని ఇతని పేరు మీద సెల్సియస్ అని పిలుస్తారు. (జ.1701).
  • 1984 ముదిగొండ విశ్వనాధం, గణితశాస్త్రజ్ఞడు, శివపూజా దురంధురుడు. (జ.1906).
  • 1992 వసంతరావు వేంకటరావు, సైన్సు రచయిత, శాస్త్రవేత్త, భౌతిక శాస్త్ర విజ్ఞాన ప్రచార యోధాగ్రణి.
  • 2005 స్వామి రంగనాథానంద, భారత ఆధ్యాత్మిక గురువు. (జ.1908). భారత్
  • 2005 టంగుటూరి సూర్యకుమారి, గాయని, నటీమణి (జ.1925).
  • 2018 ఆనం వివేకానందరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయనాయకుడు (జ.1950).
  • 2021 డా. తిరునగరి రామానుజయ్య, సాహితీవేత్త, పద్యకవి. (జ. 1945).

సినిమా

  • 2014 'గలాట' చిత్రం విడుదలైంది.
  • 2025 'సూర్యాపేట జంక్షన్' చిత్రం విడుదలైంది.
  • 2025 'సారంగపాణి జాతకం' చిత్రం విడుదలైంది.
  • 2025 'చౌర్య_పాఠం' చిత్రం విడుదలైంది.

పండుగలు, జాతీయ దినాలు

  • ప్రపంచ మలేరియా దినోత్సవం.
  • ప్రపంచ పశువైద్య దినోత్సవం.