ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

  • 1831 కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్వానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఈతని యాత్ర 18 మే, 1830 నుండి సెప్టెంబర్ 3, 1831 వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన ఏనుగుల వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.
  • 2009 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్య పదవీబాధ్యతలు చేపట్టాడు.
  • 2009 హెలికాప్టర్ ప్రమాదంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి సహా ఐదుగురు మరణించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ధృవీకరించింది. పూర్తి ప్రస్థానం →

జననాలు

  • 1893 కాంచనపల్లి కనకమ్మ, సంస్కృతాంధ్ర రచయిత్రి. (మ.1988). భారత్
  • 1905 కొసరాజు, తెలుగు సినిమా పాటల రచయిత, కవి, రచయిత. (మ.1986).
  • 1905 కార్ల్ డేవిడ్ అండర్సన్, అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, ఎలక్ట్రాన్ కు వ్యతిరేక కణమైన పాజిట్రాన్ కనుగొన్న వ్యక్తి. (మ.1991).
  • 1908 జమలాపురం కేశవరావు, నిజాం నిరంకుశ పాలను ఎదిరించిన వ్యక్తి. (మ.1953).
  • 1924 కావూరి పూర్ణచంద్రరావు, అష్టావధాని, గ్రంథరచయిత.
  • 1935 శరద్ అనంతరావు జోషి, రైతు నాయకుడు. రాజ్యసభ సభ్యుడు. (మ.2015). భారత్
  • 1940 ప్యారెలాల్ ,(సంగీత దర్శకుల ద్యయంలోఒకరు) సంగీత దర్శకుడు.
  • 1952 శక్తికపూర్, భారతీయ భాషల నటుడు, హాస్యనటుడు. భారత్
  • 1965 కార్లోస్ ఇర్విన్ ఎస్టవెజ్, అమెరికన్ నటుడు.
  • 1971 కిరణ్ దేశాయ్, భారతదేశ రచయిత్రి. భారత్
  • 1974 మల్లి మస్తాన్‌ బాబు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన పర్వతారోహకుడు. (మ.2015).
  • 1978 అర్జన్ బజ్వా, ఒక భారతీయ సినీ నటుడు.ఎక్కువగా బాలీవుడ్, తెలుగు సినిమాల్లో నటించాడు.
  • 1981 కమల్ కామరాజు, సహాయ దర్శకుడు, తెలుగు చలన చిత్ర నటుడు.
  • 2001 ధీరజ్ బొమ్మదేవర, భారతీయ విలుకాడు. 2024 ఒలింపిక్స్‌లో భారత్‌ ఆర్చరీ జట్టులో ఉన్నాడు. భారత్

మరణాలు

  • 1962 వినాయకరావు కొరాట్కర్, మాజీ భారత పార్లమెంటు సభ్యుడు. (జ.1895). భారత్
  • 1969 హొ చి మిన్ వియత్నాం సామ్యవాద నాయకుడు, ఫ్రెంచ్ వారి వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన వియత్నాం పోరాటంలో ముఖ్య సూత్రధారి. (జ.1890).
  • 1987 రమేష్ నాయుడు, తెలుగు సినీ సంగీత దర్శకుడు. (జ.1933).
  • 2011 నండూరి రామమోహనరావు, తెలుగు పాత్రికేయరంగ ముఖ్యుడు, అభ్యుదయవాది, ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు. (జ.1927).
  • 2011 ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్, పారిశ్రామిక వేత్త. (జ.1921).

పండుగలు, జాతీయ దినాలు

  • ఖతర్ స్వాతంత్ర్యదినోత్సవం. భారత్