ఈ రోజు విశేషం
1791 ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ మే 3 (ఐరోపాలో మొట్టమొదటి ఆధునిక రాజ్యాంగం) –పోలిష్-లిథూనియన్ కామన్వెల్త్ 'సెజ్మ్' ప్రకటించింది. (20వ శతాబ్దానికి ముందు పోలిష్ పార్లమెంట్ లోని దిగువ సభ (మన లోక సభ వంటిది), ఎగువ సభ (మన రాజ్య సభ వంటిది), వారి రాజు, ఈ మూడింటిని కలిపి 'సెజ్మ్" అనేవారు).
సంఘటనలు
- 1494 క్రిస్టఫర్ కొలంబస్ జమైకాను కనుగొన్నాడు. దానికి 'ఇయాగొ' అని పేరు పెట్టాడు.
- 1791 ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ మే 3 (ఐరోపాలో మొట్టమొదటి ఆధునిక రాజ్యాంగం) –పోలిష్-లిథూనియన్ కామన్వెల్త్ 'సెజ్మ్' ప్రకటించింది. (20వ శతాబ్దానికి ముందు పోలిష్ పార్లమెంట్ లోని దిగువ సభ (మన లోక సభ వంటిది), ఎగువ సభ (మన రాజ్య సభ వంటిది), వారి రాజు, ఈ మూడింటిని కలిపి 'సెజ్మ్" అనేవారు). భారత్
- 1802 వాషింగ్టన్ డి.సి. ని, ఒక నగరంగా గుర్తించారు.
- 1830 ప్రతీరోజూ ప్రయాణీకులను తీసుకువెళ్ళటానికి, ఆవిరితో నడిచే రైలు (పొగబండి) సేవలు, మొదటిసారిగా మొదలయ్యాయి.
- 1837 యూనివర్సిటీ ఆఫ్ ఏథెన్స్ స్థాపించారు.
- 1841 న్యూజిలాండ్దేశం బ్రిటిష్ కోలనీగా మారింది. భారత్
- 1855 ఏంట్వెర్ప్ - రోటర్డాం రైలు మార్గం మొదలయింది.
- 1906 సినాయ్ ద్వీపకల్పం బ్రిటిష్ ఆధీనంలో ఉన్న ఈజిప్ట్ సరిహద్దుగా ఏర్పడింది. సినాయ్ని టర్కీ నుంచి ఈజిప్ట్ తీసుకుంది. భారత్
- 1913 భారతదేశ సినీ చరిత్రలో మొదటి చలనచిత్రం రాజా హరిశ్చంద్ర విడుదల. భారత్
- 1939 నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించాడు.
- 1968 యునైటెడ్ కింగడమ్ దేశంలోని లండన్లో మొదటి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసారు. ఆ దేశంలో ఇదే మొదటి గుండె మార్పిడి శస్త్ర చికిత్స.
- 1969 భారత రాష్ట్రపతిగా వి.వి.గిరి పదవిని చేపట్టాడు. భారత్
- 1973 చికాగో లోని 'సియర్స్ టవర్' ప్రపంచంలోని ఎత్తైన భవంతిగా గుర్తింపు పొందింది.
- 1978 'సూర్య దినం' - 'సౌర శక్తి' కి సంబంధించిన విశేషాలు అమెరికాలో తిలియ చేసారు.
- 1986 శ్రీలంకలో బాంబు పేలుడు వలన 21మంది మరణించారు.
- 2002 భారత వాయుసేనకు చెందిన మిగ్-21 విమానం, జలంధర్ లోని, బాంక్ ఆఫ్ రాజస్థాన్ దగ్గర కూలిపోయి, ఏడుగురు బాంక్ ఉద్యోగులు, 1 కూలీ మరణించగా, 17మంది గాయ పడ్డారు. పైలట్ ఫ్లైట్ లెఫ్ట్నెంట్ ఎస్.కె. నాయక్ క్షేమంగా తప్పించుకున్నాడు. భారత్
- 2005 ఇరాక్ చరిత్రలో మొట్టమొదటి సారిగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి, అధికారం చేపట్టింది.
జననాలు
- 612 [http://en.wikipedia.org/wiki/Constantine_III_(Byzantine_emperor) కాన్స్టేన్టైన్-III], బైజాన్టైన్ చక్రవర్తి (మ. 641).
- 1892 [http://en.wikipedia.org/wiki/George_Paget_Thomson జార్జ్ పేజెట్ థామ్సన్], ఇంగ్లీషు భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ. 1975). [http://en.wikipedia.org/wiki/Nobel_Prize_in_Physics భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీతల పట్టిక].
- 1932 బూదరాజు రాధాకృష్ణ, ప్రసిద్ధ భాషావేత్త. (మ.2006).
- 1950 మణివణ్ణణ్, భారత సినిమా నటుడు. భారత్
- 1959 ఉమా భారతి, కాషాయధారిణి, భారతదేశపు రాజకీయవేత్త. భారత్
- 1970 పద్మావతి. ఎల్, వీరికి రంగస్థలనటిగా 16 సంవత్పరాల అనుభవం ఉంది. చాలా సాంఘిక నాటిక/నాటకల్లో ప్రధాన స్త్రీ పాత్రలను పొషించారు.
- 1990 మేఘన రాజ్, దక్షిణ భారత చలన చిత్ర నటి. భారత్
మరణాలు
- 1616 షేక్స్పియర్, ఆంగ్ల నాటక కర్త, నటుడు (జ.1564). (జూలియన్ కేలండర్ ప్రకారం, ఇతడి మరణం, 23 ఏప్రిల్ గా, జనామోదం పొందింది).
- 1969 జాకీర్ హుస్సేన్, పూర్వ భారత రాష్ట్రపతి. (జ.1897). భారత్
- 1981 నర్గీస్ భారత సినిమా నటి (జ. 1929). భారత్
- 1998 వెంకటేష్ కులకర్ణి, భారతీయ-అమెరికన్ నవలా రచయిత, విద్యావేత్త. (జ. 1945). భారత్
- 1999 అప్పలాచార్య, సినిమారచయత.
- 2006 ప్రమోద్ మహాజన్, భారత రాజకీయవేత్త. (జ. 1949). భారత్
- 2023 మనోబాల, సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు (జ. 1953).
సినిమా
- 2019 'ఒకటే లైఫ్ (2019 సినిమా)' చిత్రం విడుదలైంది.
- 2024 'ప్రసన్నవదనం' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం.
- ప్రపంచ ఆస్తమా దినోత్సవం.