ఈ రోజు విశేషం
1863 వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి శ్రీకాకుళం సమీపంలోని పర్వతాలపేటలో జన్మించారు.
తెలుగు నాట ఈ రోజు
- 1863 వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి శ్రీకాకుళం సమీపంలోని పర్వతాలపేటలో జన్మించారు. పూర్తి ప్రస్థానం →
- 1959 నటుడు అక్కినేని నాగార్జున అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ దంపతులకు మద్రాసులో జన్మించారు. పూర్తి ప్రస్థానం →
- 1984 ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా శంకర్ దయాళ్ శర్మ నియమితులయ్యాడు.
సంఘటనలు
- 1842 నాన్కింగ్ సంధి జరిగి నల్లమందు యుద్ధాలు (ఓపియం వార్స్) ఆగిపోయాయి. నాన్కింగ్ సంధి ప్రకారం హాంగ్ కాంగ్ దీవిని బ్రిటన్ కి దత్తత ఇచ్చారు.
- 1885 గోట్లీబ్ డైమ్లెర్ ప్రపంచంలోని మొట్టమొదటి మోటారు సైకిల్ కి పేటెంట్ తీసుకున్నాడు.
- 1898 గుడ్ ఇయర్ టైర్ల కంపెనీని స్థాపించారు.
- 1910 జపాన్ కొరియా పేరును ఛోసెన్ గా మార్చీ, ఆ కొత్త వలసను పాలించటానికి ఒక గవర్నర్ జనరల్ ను నియమించింది.
- 1915 యు.ఎస్. నేవీ గజ ఈతగాళ్ళు ప్రమాదంలో మొదటిసారిగా ములిగిపోయిన ఎఫ్-4 అనే జలాంతర్గామిని బయటికి తీసారు.
- 1916 ఫిలిప్పైన్స్ అటానమీ చట్టాన్ని (స్వయంగా పాలించుకోవటం) అమెరికా ఆమోదించింది.
- 1930 సెయింట్ కిల్డాలో వివసిస్తున్న చివరి 36 మంది ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి, స్కాట్లాండులోని ఇతర ప్రదేశాలకు తరలిపోయారు.
- 1944 స్లొవేకియాలోని స్లొవాక్ దళాలు 60, 000 మంది నాజీలకు వ్యతిరేంగా ఉద్యమింఛటంతో స్లొవాక్ లో జాతీయతా భావం ఉప్పొంగింది. ఆనాటినుంచి, 29 ఆగస్టుని జాతీయతా భావం ఉప్పొంగిన దినంగా జరుపుకుంటున్నారు స్లొవేకియా లో.
- 1948 హైదరాబాదు సమస్యకు శాంతియుత పరిష్కారం అసాధ్యమని, సైనిక చర్య అనివార్యమని నెహ్రూ కృష్ణ మీనన్కు లేఖ రాశారు. భారత్ పూర్తి ప్రస్థానం →
- 1949 సోవియట్ యూనియన్ తన మొట్ట మొదటి అణుబాంబును (పేరు : ఫస్ట్ లైట్నింగ్ (లేక) జోయ్ 1) కజకిస్తాన్ లోని సెమిపలతిస్స్క్ అనే చోట పరీక్షించింది.
- 1957 స్ట్రామ్ థర్మాండ్, అమెరికన్ సెనేట్ లో 24 గంటలకు పైగా సివిల్ రైట్స్ బిల్లు పై వ్యతిరేకంగా మాట్లాడి రికార్డు సృష్టించాడు. ఆ బిల్లు పాస్ అయ్యింది.
- 1958 యునైటెడ్ స్టేట్స్ఏయిర్ ఫోర్స్ అకాడెమీని, కొలరాడో లోని కొలరాడొ స్ప్రింగ్స్ అనే చోట ప్రారంభించారు.
- 1965 అమెరికన్ రోదసి నౌక జెమిని-5 భూమికి తిరిగి వచ్చింది.
- 1966 బీటిల్స్ (గాయకుల బృందం] తమ చివరి కచేరిని అమెరికాలోని, సాన్ఫ్రాన్సిస్కో లోని కేండిల్స్టిక్ పార్క్ దగ్గర చేసారు.
- 1982 కృత్రిమంగా తయారుచేసిన రసాయన మూల్లకం మీట్నెరియం (అటామిక్ నెంబరు 109) ని మొట్టమొదటిసారిగా జర్మనీ లోని, డార్మ్స్టాడ్ దగ్గర గెసెల్స్చాఫ్హ్ట్ ఫర్ స్చెరిఒనెన్ఫొర్స్కంగ్.
- 1986 బ్రిటన్ లోని కవలలు తమ 100వ పుట్టిన రోజు జరుపుకున్నారు. 70 కోట్లమందిలో ఒక్కరికే ఇటువంటి అవకాశం ఉంటుంది. [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/august/29/newsid_2536000/2536297.stm వీడియో చూడటానికి ఇక్కడ నొక్కు ].
- 1991 సుప్రీం సోవియెట్ (రష్యా పార్లమెంటు) కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాలను ఆపి వేసి, కమ్యూనిస్ట్ పార్టీకి చరమ గీతం పాడింది. భారత్
- 2005 హరికేన్ కత్రినా అమెరికాలోని గల్ఫ్ తీరాన్ని తాకి, మిసిసిపి, లూసియానా ల లోని సముద్ర తీర పట్టణాలను నాశనంచేసి 10లక్షల మందిని నిరాశ్రయులను చేసి, 1, 000 మంది మరణానికి కారణమయ్యింది.
జననాలు
- 1863 గిడుగు రామమూర్తి, తెలుగు భాషావేత్త. (మ.1940).
- 1902 వెరియర్ ఎల్విన్, రాజనీతి పండితుడు, భారతీయ గిరజన జాతుల సమర్థకుడు. భారత్
- 1905 ధ్యాన్ చంద్, భారత హాకీ క్రీడాకారుడు. (మ.1979). భారత్
- 1926 రామకృష్ణ హెగ్డే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి. భారత్
- 1928 రావు బాలసరస్వతీ దేవి, పాతతరం తెలుగు చలనచిత్ర నటి, నేపథ్యగాయని.
- 1943 విజయ కుమార్ , తమిళ మలయాళ, హిందీ,తెలుగు చిత్రాల నటుడు , రాజకీయ నాయకుడు.
- 1958 మైకల్ జాక్సన్, అమెరికా సంగీత కళాకారుడు. (మ.2009).
- 1959 అక్కినేని నాగార్జున, తెలుగు చలనచిత్ర నటుడు, అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు.
- 1961 నాగబాబు, తెలుగు చిత్రసీమ నటుడు , నిర్మాత.
- 1974 దామరకొండ ప్రవీణ్ కుమార్, రైతు సమితి మండల కో-ఆర్డినేటర్, మాజీ సర్పంచ్, అమీనాపురం గ్రామం, కేసముద్రం మండలం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ.
- 1975 విశాల్ కృష్ణ, తమిళ, తెలుగు , చిత్రాల నటుడు , నిర్మాత.
- 1981 ప్రత్యూష , తెలుగు ,తమిళ, చిత్రాల నటి(మ.2002).
- 1989 హీనా సిద్ధూ, భారతీయ షూటింగ్ క్రీడాకారిణి. భారత్
- 1991 హరిప్రియ, సినీనటి, భరత నాట్య కళాకారిణి ,మోడల్.
మరణాలు
- 1950 వేటూరి ప్రభాకరశాస్త్రి, రచయిత. (జ.1888).
- 1976 ఖాజీ నజ్రుల్ ఇస్లాం, బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు, పద్మ భూషణ పురస్కార గ్రహీత. (జ.1899).
- 2018 నందమూరి హరికృష్ణ, సినిమా నటుడు, ఎన్. టి.రామారావు కుమారుడు, కారు ప్రమాదంలో గాయపడి మరణం. (జ.1956).
- 2022 అభిజిత్ సేన్ ఆర్థికవేత్త. ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు. (జ.1950).
సినిమా
- 1963 'పునర్జన్మ (1963 సినిమా)' చిత్రం విడుదలైంది.
- 1986 'రేపటి పౌరులు' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- తెలుగు భాషా దినోత్సవము - గిడుగు రామమూర్తి జయంతినే తెలుగు భాషా దినోత్సవముగా జరుపుతున్నారు.
- జాతీయ క్రీడా దినోత్సవం - ధ్యాన్ చంద్ జయంతినే జాతీయ క్రీడా దినోత్సవముగా జరుపుతున్నారు.
- అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం.